-
కళాకారుల నోరు నొక్కొద్దు
విజయవాడ గాంధీనగర్): కళాకారులు, కవులపై మతోన్మాదుల దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి, ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన జరిగింది. హనుమాన్పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఆంధ్రరత్నరోడ్డు, గాంధీనగర్, అలంకార్సెంటర్ మీదుగా లెనిన్సెంటర్ వరకు సాగింది. అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చంద్రానాయక్ మాట్లాడుతూ ఇండోర్లో ఇఫ్టా 14వ జాతీయ మహాసభల సందర్భంగా కళాకారులపై మతోన్మాదులు చేసిన దాడిని ఖండించారు. మహాసభల వేదికపైకి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు జాతీయ జెండాతో వచ్చి ‘భారతమాతాకీ జై’ అనాలంటూ మైకులు ఆపుచేసి దౌర్జన్యానికి దిగారన్నారు. ఇటీవల కాలంలో కళాకారులు, రచయితలు, మేధావులపై దాడులు పెరిగాయన్నారు. వాక్స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారు: ముప్పాళ్ల సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన హిందూ మతాన్ని బీజేపీ , ఆర్ఎస్ఎస్ శక్తులు మంటగలుపుతున్నాయన్నారు. భారత్మాతాకీ జై, వందేమాతరం అనే పదాలు జాతీయతకు చిహ్నాలని అటువంటిని హిందూత్వ శక్తులు అపహాస్యం చేస్తున్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో రాజ్యాంగం కల్పించి వాక్స్వాతంత్యాన్ని హరిస్తున్నారన్నారు. దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గనీ, సహాయ కార్యదర్శి మహంతు సుబ్బారావు,. ఎస్కే నజీర్, జానీ, కెవీ భాస్కరరావు, కె అప్పారావు, ఆర్ పిచ్చయ్య, ఎఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
ఆగిపోయిన ప్రజా కలం
– ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసు అస్తమయం – చిన్న వయస్సులోనే వందల పాటలు రాసిన రచయిత – మూడో తరగతే చదివినా.. జీవితాన్ని అధ్యయనం చేసిన ప్రజాకవి – వాసు మృతికి ప్రముఖుల సంతాపం కర్నూలు (కల్చరల్): నా చిట్టి తమ్ముళ్లారా రారే.. నా చిట్టి చెళ్లెల్లారా రారే.. రేపన్న రూపు రేఖలు మీరే... నా సెమట సుక్కో.. నా సెమెట సుక్కో... సుత్తి కొడవలి మీద ముత్యమై మెరిసే...అమ్మా నేను ఆగమైతే.. అక్షరాలు రెండు నేర్వక... నాగమ్మ పడగలో లాంటి రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యం పొందిన ప్రజలు పాటలు రాసిన కలం ఆకస్మికంగా ఆగిపోయింది. కర్మాగారాల్లో, చేలల్లో, వర్కు షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికుల దయనీయ జీవితాలను కూలి, నాలీల కడగండ్లను సిరాగా మార్చి కలంలో పోసి, అద్వితీయమైన పాటలు రాసిన ప్రజానాట్య మండలి వాసి ఇక లేరు. కర్నూలు నగరం, ఇందిరాగాంధీ నగర్ వాస్తవ్యులైన వాసు చదువుకున్నది మూడో తరగతే. కానీ దారిద్య్రాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపడంతో పేదరికం కోణాలన్నింటినీ చవి చూసిన వాసు దారిద్య్రంపై అక్షరాలను ఎక్కుపెట్టి సాహితీ సృజన చేశారు. ఆయన ఆదివారం ఉదయం అమరావతిలో జరుగుతున్న ప్రజానాట్య మండలి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ, మాట్లాడుతూనే తీవ్రమైన గుండెనొప్పితో కుప్పకూలి పోయారు. సహచర కళాకారులు ఆయనను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం కోల్పోయారు. గతరెండు రోజులుగా ప్రజా కళలపై పాటలు రాసి, బాణీలు కట్టి, గజ్జ కట్టి ఆడుతూ, పాడుతూ ఉత్సాహం నింపిన ప్రజా కళాకారుడు తమ కళ్ల ముందే ప్రాణం కోల్పోవడం చూసిన కళాకారులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాల్యం నుంచి పాటలపైనే దష్టి .. కర్నూలు నగరంలోని మురికి వాడల్లో పుట్టి పెరిగిన వాసు మూడో తరగతితోనే చదువుకు చుక్క పెట్టారు. పని చేస్తేగాని పొద్దుగడవని స్థితిలో ఉన్న వాసు రకరకాల వర్క్షాపుల్లో కూలీగా పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు సీపీఎం ప్రధాన నాట్య మండలితో పరిచయం ఏర్పడింది. పదునైన పాటలు పాడుతూ.. పాడుతూ.. ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థ, నిరక్ష్యరాస్యత నిర్మూలన తదితర కార్యక్రమాల్లో 1990 నుంచి ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మహిళా కూలీలు, ఫ్యాక్టరీల్లో కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్న వైనాన్ని అక్షరీకరించారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ప్రజా పాటలు పాడుతున్న సుజాత అనే కళాకారిణిని పెళ్లి చేసుకున్నారు. ప్రజానాట్య మండలికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. పేద ప్రజల కడగండ్లను నాటికలుగా, గేయాలుగా, పాటలుగా రాస్తూ ప్రజా కళలను ఆదరించాలనే ప్రచారం చేశారు. ఈయన రాసిన నా సెమట సుక్కో.. పాటను విని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షుడు రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నీరు కార్చి, వాసును భుజం తట్టి మెచ్చుకున్నారు. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ వాసు పాటల్లో ప్రజల ఆర్థి, ప్రజల వ్య«థ స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. కళాకారుల సంతాపం.. ప్రజల పాటలు రాస్తూ, పేదల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వాసు మరణం ప్రజా నాట్య మండలికి తీరని లోటని, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి బసవరాజు, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వాసు రాసిన పాటలను పలు వేదికలపై పాడి, ప్రజల్లో చైతన్యం నింపామని, ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్మియ్యా అన్నారు. వాసు పాటలు అజరామరంగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతాయని ప్రముఖ రచయిత ఇనాయతుల్లా అన్నారు. వాసు పాటలు ప్రజ ల బాధల్ని లోకానికి చాటి చెప్పాయని లలిత కళా సమితి పత్తి ఓబులయ్య అన్నారు. ప్రముఖ రచయితలు ఎస్డీవీ అజీజ్, వెంకటకష్ణ, ప్రజాభ్యుదయ సంస్థ భార్గవ, అధ్యక్షుడు శ్రీనివాస్, ధర్మపేట యువజన సంఘం నాయకులు ఇమ్మానియేలు, యేసేపు తదితరులు సంతాపం ప్రకటించారు. -
కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి
యాచారం : గ్రామీణ కళాకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బోడ జగన్ అన్నారు. మంగళవారం యాచారంలోని సుందరయ్య భవన్లో జరిగిన సంఘం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీవీలు, సీనిమాలు వచ్చిన ఈ రోజుల్లో కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందన్నారు. అయినా కళాకారులు తమ బతుకు బాట కోసం కళారూపాలను ప్రదర్శిస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో కళాకారులు తమ కళల ద్వారా చేసిన పోరాట గుర్తింపును పరిగణనలోకి తీసుకుని తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా యాచారం మండల ప్రజానాట్యమండలి కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా వి.భూషణ్, అధ్యక్షుడిగా వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఎంజే వినోద్కుమార్, సహాయ కార్యదర్శులుగా స్వామి, నర్సింహ, ఉపాధ్యక్షులుగా పెంటయ్య, శ్రీను, కమిటీ సభ్యులుగా అనంద్, పెంటయ్య, ప్రవీణ్, శ్రీను తదితరులను ఎన్నుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement