breaking news
people rights
-
హక్కులకు భంగం కలిగించొద్దు
– టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి జడ్చర్ల : రాష్ట్రంలో భూసేకరణ సందర్భంలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కోరారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 123జీఓను హైకోర్టు కొట్టివేసి 2013చట్టం ప్రకారం వ్యవహరించాలని సూచించినా ప్రభుత్వం మొండివైఖరితో తిరిగి అప్పీలుకు వెళ్లడం నియంతత్వానికి నిదర్శనమన్నారు. 123జీను నిరసిస్తూ మల్లన్నసాగర్, కుడికిళ్ల వద్ద రైతులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2013చట్టం ప్రకారంగా భూసేకరణ చేయాలని కోరారు. గ్రామసభలో 70 శాతం ప్రజలు అంగీకరిస్తేనే భూసేకరణ జరుపాలని, రైతు కూలీలు, చేతివత్తుల వారికి 20ఏళ్ల పాటు ప్రతి నెల రూ.2వేలు పింఛన్ చెల్లించాలని, ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించాలని, మార్కెట్ ధరల ప్రకారంగా మూడేళ్ల కాలానికి సంబంధించి సమీక్షించి «భూముల ధరలు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అప్పీలుకు వెళ్లిన జీఓలో 2013చట్టం కంటే మరింత మెరుగ్గా ఉండే అంశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు 2013చట్టాన్ని అమలు చేస్తూ అంతకు మించి పరిహారం, పునరావాసం అందజేస్తే మంచిదే కదా అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కాక నిరంకుశంగా పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్, జడ్చర్ల సర్పంచ్ బుక్క వెంకటేశం, నాయకులు మినాజ్, రేణుక, లత, కష్ణ, రఫీక్, జగదీశ్వరాచారి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన
– ప్రజాహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం – సీమ కేబుల్ కమ్యూనికేషన్ సెంటర్ సీజ్ అన్యాయం – అఖిలపక్ష సమావేశంలో పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కర్నూలు(ఓల్డ్సిటీ): రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని శాసనసభా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక పాత బస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో అఖిల పక్ష రాజకీయ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తరపున జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్, మాజీ కార్పొరేటర్ తోట వెంకటకష్ణారెడ్డి, కాంగ్రెస్ తరపున జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య, సీపీఎం తరపున కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్, సీపీఐ తరపున జిల్లా నాయకుడు భీమలింగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ స్వేచ్ఛ లేకుండా చేస్తుందన్నారు. కర్నూలులో సీమ కేబుల్ కమ్యూనికేషన్స్ను సీజ్ చేయడం అన్యాయమని ఖండించారు. జిల్లాలో ఐరన్ఓర్ దోపిడీ జరుగుతుందని, టన్నుకు రూ. 250 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కష్ణా పుష్కరాల సందర్భంగా ముందుజాగ్రత్త లేకుండా హడావుడిగా పుష్కర పనులు ప్రారంభించడంలో మతలబు ఏమిటన్నారు. తాను శాసన సభ్యుడి స్థాయిలో 2 పబ్లిక్ లెట్రిన్లు అడిగినా జిల్లా కలెక్టర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్, లోక్సత్తా, సీపీఐ ఎంఎల్ జనశక్తి, జమాతే ఇస్లామీ హింద్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి సవాల్: ఎం.ఎ.గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మౌలికమైన ప్రజాస్వామ్యానికి కర్నూలులో సవాల్ ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్ పచ్చచొక్కాల మాట విని సీమ డిజిటల్ కమ్యూనికేషన్స్ను సీజ్ చేయడం అన్యాయం. లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు అందుబాటులో ఉండేలా సీమ డిజిటల్ కేబుల్ కమ్యూనికేషన్స్ పెడితే లైసెన్స్ లేదంటున్నారు. మరి టీడీపీ నాయకుడు శిల్పా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు ప్రాంతాల్లో కేబుల్స్ తీసుకున్నారో లేదో ఒకసారి తనిఖీ చేయాలి. మిగతా వాళ్లు వ్యాపారం చేయకూడదా: బి.వై.రామయ్య, డీసీసీ అధ్యక్షుడు కేఈ, ఎస్వీ, టీజీ కుటుంబాలు మాత్రమే వ్యాపారం చేయాలనుకుంటే ఎలా. కేఈ కుటుంబీకులు శ్యాండ్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్, కేబుల్ వంటి అన్ని వ్యాపారాల్లో భాగస్వాములై ఉన్నారు. వీరు చేయని ఏదైనా వ్యాపారం ఉంటే అది చెబుతే మిగతా వాళ్లు అదే చేసుకుని బతుకుతారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలాంటి ఉన్నతాధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం ఏమొచ్చింది. దాడుల పరంపర ఈనాటిది కాదు: భీమలింగప్ప, సీపీఐ జిల్లా నాయకుడు కేఈ కుటుంబం దాడుల పరంపర ఈనాటిది కాదు, తరతరాలుగా కొనసాగుతుంది. రోజూ టీవీల్లో వీరి బొమ్మలు కనబడాలనే వేరే నెట్వర్క్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కప్పట్రాళ్లను మార్చడం కాదు, ముందు కర్నూలులో దౌర్జన్యాలు అరికట్టాలని సూచించారు. ఆమోదించిన తీర్మానాలు: – సీమ కమ్యూనికేషన్స్పై అధికారుల పక్షపాత వైఖరిని, అధికార పార్టీకి అనుకూలంగా సాగిస్తున్న దాడులను ఖండించాలి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్న అధికారుల చర్యలను నిరసించాలి. – జిల్లాలో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన జిల్లా అధికారులను బదిలీ చేయాలి, కార్పొరేషన్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి. -
కశ్మీర్ ప్రజల హక్కులేవి?
జకార్తా: భారత అభ్యంతరాలను తోసిరాజని అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారం ఇప్పటికీ నెరవేరకపోవడం విచారకరమని, అది ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించింది. ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతున్న ఆసియాన్-ఆఫ్రికన్ సదస్సులో పాక్ ప్రతినిధిగా పాల్గొన్న సర్తాజ్ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన గురువారం ఈ సదస్సు జరిగింది. అజీజ్ వ్యాఖ్యలపై భారత్ ఇదే సదస్సులో స్పందించింది. కశ్మీర్ ప్రస్తావనను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అనిల్ వెంటనే బదులిచ్చారు.