-
పేయూ చేతికి బిల్డెస్క్
న్యూఢిల్లీ: దేశీ ఇంటర్నెట్ కన్జూమర్ విభాగంలో తాజాగా అతిపెద్ద ఒప్పందానికి తెరలేచింది. ఫిన్టెక్ బిజినెస్ సంస్థ పేయూ.. డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల సంస్థ బిల్డెస్క్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 4.7 బిలియన్ డాలర్లు(రూ. 34,376 కోట్లు) వెచ్చించనుంది. దీంతో పేయూ మాతృ సంస్థ, నెదర్లాండ్స్ దిగ్గజం ప్రోసస్ ఎన్వీ దేశీ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల(రూ. 73,140 కోట్లు)కు చేరనున్నాయి. అయితే బిల్డెస్క్, పేయూ డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి లభించవలసి ఉంది. 2022 తొలి త్రైమాసికానికల్లా ఒప్పందం పూర్తయ్యే వీలున్నట్లు ప్రోసస్ గ్రూప్ సీఈవో బాబ్ వాన్ డిక్ అభిప్రాయపడ్డారు. రెండు సంస్థల కలయికతో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో దేశీయంగానూ, గ్లోబల్ స్థాయిలోనూ లీడింగ్ కంపెనీ ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న దేశీ ఫిన్టెక్ ఎకోసిస్టమ్లో మరింత లోతైన, మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. 2005 నుంచీ..: దేశీయంగా ప్రోసస్ దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా నిలుస్తున్నట్లు డిక్ పేర్కొన్నారు. 2005 నుంచీ టెక్ కంపెనీలలో దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాజా లావాదేవీతో ఈ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. ఇది భారత్ మార్కెట్పట్ల తమకున్న కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ పెట్టుబడులకు దేశీ మార్కెట్ కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న దశాబ్దంలోనూ గ్రూప్ వృద్ధికి భారీగా దోహదపడనున్నట్లు తెలియజేశారు. రానున్న కొన్నేళ్లలో 20 కోట్లమందికిపైగా కొత్త వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. మూడేళ్ల కాలంలో ఒక్కో వ్యక్తి సగటు లావాదేవీలు 10 రెట్లు జంప్చేసి 22 నుంచి 220కు చేరనున్నట్లు అభిప్రాయపడ్డారు. పలు కంపెనీలలో..: ప్రోసస్ ఇప్పటికే బైజూస్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ తదితర పలు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. పేయూ ద్వారా సిట్రస్పే, పేసెన్స్, విబ్మోలనూ సొంతం చేసుకుంది. అత్యధిక వృద్ధిలో ఉన్న 20 మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించిన పేయూ తాజా కొనుగోలుతో ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ పేమెంట్ సర్వీసుల సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. 2000లో షురూ బిల్డెస్క్ కార్యకలాపాలు 2000లో ప్రారంభమయ్యాయి. కంపెనీలో జనరల్ అట్లాంటిక్, వీసా, టీఏ అసోసియేట్స్, క్లియర్స్టోన్ వెంచర్, టెమాసెక్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ నెట్వర్క్ను కొన్ని దిగ్గజ బ్యాంకులతోపాటు, యుటిలిటీస్, టెలికం, బీమా తదితర పలు విభాగాలకు చెందిన చాలా కంపెనీలు వినియోగిస్తున్నాయి. పేయూ, బిల్డెస్క్ సంయుక్తంగా ఏడాదికి 4 బిలియన్ లావాదేవీలను నిర్వహించే అవకాశమున్నదని పేయూ సీఈవో అనిర్బన్ ముఖర్జీ అంచనా వేశారు. దశాబ్ద కాలంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో కంపెనీ అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు బిల్డెస్క్ సహవ్యవస్థాపకుడు ఎంఎన్ శ్రీనివాసు తెలియజేశారు. -
బాహుబలి టిక్కెట్ల పేరుతో మోసం
హైదరాబాద్: బాహుబలి–2 సినిమా టిక్కెట్ల ఆన్లైన్ విక్రయం పేరుతో ఇంటర్నెట్లో ఏర్పాటు చేసిన ఓ వెబ్సైట్పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తమతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా సదరు వెబ్సైట్ తమ పేరుతోనూ టిక్కెట్లు విక్రయిస్తోందని ఏషియన్ సినిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని నమోదు చేశారు. బాహుబలి–2కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా పగడ్భందీ పథకంతో రంగంలోకి దిగింది. తమిళనాడులోని కోయంబత్తూరు చిరునామాతో ఈ నెల 7న (www. newticketr.in) పేరుతో వెబ్సైట్ రిజిస్టర్ చేయించింది. ఏడాది పాటు నిర్వహించేందుకు సర్వర్ను సైతం లీజుకు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల కోసం ‘పేయూమనీ’తో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్తో పాటు కొన్ని ఇతర దేశాల్లోనూ ఉన్న సినిమా «థియేటర్ల పేర్లు పొందుపరిచింది. సాధారణ ఆన్లైన్ వెబ్సైట్ మాదిరిగానే దీనిలోకీ ప్రవేశిస్తే థియేటర్లు, వాటిలోని సీట్ల వరుసలు అన్నీ కనిపిస్తుండటంతో పాటు బుక్ చేసుకున్న వారికి కన్ఫర్మేషన్ సందేశాలు సైతం వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ రకంగా అనేక మందిని మోసం చేసిన ఈ ముఠా మూలాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దుబాయ్ కేంద్రంగా వీరు వ్యవహారాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement