breaking news
Paramedical employees
-
రోడ్డుపై కరోనా వారియర్: పట్టించుకోని జనం
భోపాల్: కరోనా వారియర్ స్పృహ తప్పి పడిపోతే ఏ ఒక్కరూ చలించలేదు. అరగంటకు పైగా రోడ్డు మీద పడి ఉన్న సదరు పారామెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ధరించిన పారామెడికల్ సిబ్బంది కరోనా రోగులను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం తిరిగి ఆస్పత్రికి బయలు దేరారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి ఉన్నపళంగా రోడ్డుపై పడిపోయాడు. ఈ క్రమంలో అతనికి రక్షణగా నిలవాల్సిన సహోద్యోగులు అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అతను 25 నిమిషాల పాటు రోడ్డుపై అచేతనంగా పడిపోయి ఉన్నాడు. రోడ్డు వెంట వెళుతున్న వారు కూడా చూస్తూ వెళ్లిపోయారే తప్పితే సాయం చేసేందుకు ముందడుగు వేయలేదు. సదరు విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!) -
స్వైన్ఫ్లూ పై కదిలిన జీవీఎంసీ
విశాఖపట్నం సిటీ : స్వైన్ ఫ్లూ నివారణపై జీవీఎంసీ యంత్రాంగం కదిలింది. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు పారామెడికల్ బృందాలను రంగంలోకి దించింది. నగరంలోని వివిధ జోన్లలో వున్న పారామెడికల్ ఉద్యోగులందరికీ ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. జోన్-4 ప్రాంతమంతా మురికివాడలతోనే వుండడంతో ఎక్కువ దృష్టి సారించారు. వైరస్ సోకే అవకాశాలున్న వారి ఆరోగ్యో పరిస్థితిపై సహాయ వైద్యాధికారి డాక్టర్ మురళీ మోహన్ ఆరా తీస్తున్నారు. హుదూద్ తుఫాన్ తర్వాత అర్బన్లో పారిశుద్ధ్య సమస్య మరింత పెరిగింది. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ఎక్కడ విజృంభిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. పల్స్పోలియో వాలంటీర్లు, పారామెడికల్ ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించే బాధ్యతలను అప్పగించారు. మరుగుదొడ్లు లేని వారు ఎంత మంది వున్నారో గుర్తించే పనిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అర్బన్లో 72 వార్డులకూ 86 బృందాలను నియమించారు. 775 మురికివాడల్లో గత వారం రోజులుగా సర్వే చేసి 20 వేల మందికి లెట్రిన్లు లేవని గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో మరో 20 వేలకు పైగా మరుగుదొడ్లు లేని ఇళ్లను సులువుగానే గుర్తించే అవకాశాలున్నాయని వైద్య సిబ్బంది అంటున్నారు. 4.30లక్షల ఇళ్లు వున్నాయని ఇంకా ఇళ్లు లేని వారు, కొండలపై నివాసముంటున్న వారు, పాకల్లో వుంటున్న వారు, టెంట్లలో వుంటున్న వారందరినీ లెక్కలేస్తే లక్షల్లోనే లెట్రిన్లు లేనట్టుగా నమోదయ్యే ఛాన్స్లున్నాయి.