-
ప్రకృతే నేస్తం.. ప్రకృతే పరమాత్మ..!
చిన్న..చిన్న మొక్కలే ఓ పెద్ద వనం అవుతుంది. మనం నాటిన మొక్కే మనకు నీడను ఇస్తుంది, ప్రాణ వాయువు ఇస్తుంది. మానవ జీవితంలో మనం చేయాల్సిన ముఖ్య విధానం ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి అనేది భగవంతుడే ఏర్పరచిన ఓ అద్భుత సంపద. దాన్ని వినాశనానికి గురి చేయకుండా ప్రకృతి పట్ల అర్థవంతంగా నడచుకో అనే సందేశాన్ని ప్రతి వారు గ్రహించాలి. అప్పుడే ప్రకృతికి పరమార్థం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ప్రకృతి ఏర్పడటమే ఓ విచిత్రం. చెట్లు, చేమలు, వివిధ జంతువులు, విహంగాలు, నదులు, పర్వతాలు... ఇవన్నీ ఎవరి సృష్టి అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికర్త ఆజ్ఞ వలన ఈ సృష్టి ఏర్పడింది. సృష్టిని నిర్మించింది ఆ పరమాత్మనే అనే మాట వినిపిస్తుంది. పరమాత్మ ప్రకృతికి ప్రాణం పోస్తే, పరమాత్మ ద్వారా సృష్టించబడిన మానవుడు నేడు ప్రకృతి వినాశనానికి కారకుడు అవుతున్నాడు. స్వేచ్చగా చెట్లు నరకడం, అనువుగాని చోట్ల నిర్మాణాలు చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించే కలుషిత కర్మాగారాలు స్థాపించడం వంటి వాటి వలన ప్రకృతి పాడవుతున్నది. మానవుడు తన స్వలాభాలను చూసుకుంటున్నాడే గాని పదిమందికి ఉపయోగపడే ప్రకృతికి ప్రాణం పోయాలి అనే విషయం మరచి నట్లు ఉన్నాడు. విచ్చలవిడిగా వ్యర్ధ పదార్థాలను ధరణిపై వేసి ప్రకృతి నిరోధానికి పరోక్షంగా కారకుడు అవుతున్నాడు. ప్రకృతి అనేది ఓ దైవం అనే మాటను విస్మరిస్తున్నాడు. పచ్చని ప్రకృతిని ఓ క్షణం పరిశీలిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ప్రకృతిలోని పక్షుల కిల.. కిల రావాలు, పారే సెలయేర్లు, శబ్దం చేసే పాల పొంగులాంటి జలపాతాలు, అందంగా పేర్చినట్లు ఉండే పర్వత శ్రేణులు చూస్తుంటేనే ఓ మధురానుభూతికి లోనవుతాం. రోజు కొంత సేపు ప్రకృతిలో విహరిస్తే మనం పొందే అనుభూతే వేరు. అయితే నేడు చాలామంది వాకింగ్ వంకతో ప్రకృతిని ఆస్వాదిస్తామంటారే కానీ వాళ్ళు ఆస్వాదించేది అంతా వాళ్ళ చెవులలో పెట్టుకుని వినే పాటలే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకునే వారే కనిపిస్తారు. వాళ్ళు ఏమి ఆస్వాదిస్తున్నారో, ఏమి వింటున్నారో అర్థం కాదు. మనం ప్రయాణిస్తున్నప్పుడు కనపడే చెట్టు, చేమ చూడటం వలన ఓ ఆనందం కలుగుతుంది. ఈ విశ్వంలో జరిగే కార్యాలు అన్నీ ప్రకృతి వల్లనే జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారం, గర్వం కారణం మూలంగా మనిషి మాత్రం తానే అన్నిటికీ కర్తనని, మూలం తానేననీ, తన ప్రయోజకత్వం వల్లనే అన్ని కార్యాలు జరుగుతున్నాయని భావిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ‘నేను చేస్తున్నాను’ అనుకోకపోతే ఏ పనినీ చేయలేడు. చిక్కు అంతా ఎక్కడ వస్తుందీ... అంటే సమస్తం నేను చేస్తున్నాను. నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అని అహంకార పూరితుడిగా మారినప్పుడే. అప్పుడే వ్యక్తి పతనపు అంచులకు ప్రయాణం సాగిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇటువంటి అహంకారం మానవుణ్ణి కిందకు లాగుతుంది. సత్వ రజస్తమోగుణాలతో కూడిన ఈ ప్రకృతిని అధిగమించడం కష్టం. ఈ సువిశాల విశ్వమంతా చాలా వరకు అన్ని కార్యాలు ప్రకృతి పర్యవేక్షణలోనే జరిగిపోతూ ఉంటాయి. భూమిలో విత్తనం వేసి నీళ్ళు పోయాడమే మనం చేయగలిగేది. కాని ఆ విత్తనం నుండి మొలక రావడం, మొక్క పెరగడం, అది కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుని నుండి ఆహారం స్వీకరించడం మొదలగు అన్ని క్రియలలో వ్యక్తి ఏమి చేయగలుగుతున్నాడో అని బేరీజు వేసుకుంటే విశ్వంలో జరిగే ప్రతి క్రియలో ప్రకృతి పాత్ర మిక్కుటం. తల్లి గర్భంలో ఫలదీకరణ చెందిన జీవి ఎన్ని మార్పులకు గురవుతుందో సరిగ్గా ఆచి తూచగలిగే జ్ఞానం, విజ్ఞానం మనకు ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇది కేవలం ప్రకృతి ద్వారానే సాధ్యం. ఇంతటి మహత్తర కార్యం ప్రకృతి వలననే జరుగుతుండగా మనిషి ‘నేనే కర్తను’ అని అహంకరించడం ఏ మాత్రం సబబు? ఎప్పుడైతే నేనే అని అనుకుంటున్నాడో అప్పుడే నాది... నాదే అనే మమకారం మొదలవుతుంది. ఈ ‘అహం’, ‘మమ’ అనే రెండు భావాలే ఇరువైపులా నుండి వ్యక్తిని పతనం వైపుకు నెడతాయి. అహంతో నేనే కర్తను అని భావించుకుంటూ తమ పతనానికి తానే గోతిని తవ్వుకుంటూ ఉంటారు కనుక ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా ప్రకృతి మయమనే, ప్రకృతే సర్వం, సర్వం ప్రకృతే అని భావించవలసి వస్తుంది. అందమైన ప్రకృతిని వీక్షించడం అంటే ఆ భగవంతుని చూడటమే. ప్రకృతికి మనం ఎంత దగ్గర అవుతామో అంత భగవంతునికి దగ్గర అయినట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క ను నాటి దాని ఆవశ్యకతను తెలియజేస్తే మొక్కలు పట్ల అభిరుచి పెరుగుతుంది. విద్యార్థులలో కూడా ప్రకృతి అంటే జిజ్ఞాస కలుగుతుంది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర ఉపన్యాసకులు. -
శరీరత్రయం
జ్యోతిర్మయం ప్రతి జీవికి స్థూల సూక్ష్మ కారణ దేహాలనే మూడు శరీ రాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలతో, పంచకర్మేం ద్రియాలతో, కంటికి స్పష్టంగా కనిపించే, అస్థి మాంస మజ్జ రక్తమయ శరీరమే స్థూల శరీరం. సంకల్ప వికల్పాలతో మనస్సుగా, నిశ్చయాత్మక మైన బుద్ధిగా, స్మరణమాత్రమైన చిత్తంగా, భోగించే అహమ్గా, కంటికి కనిపించకపోయినా, నిరంతరం అనుభూతమయ్యే, ఆంతరిక శరీరమే సూక్ష్మ శరీరం. స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను, అన్న భ్రాం తికి కారణమైన మూలాజ్ఞానమే కారణ శరీరం. అం దరూ స్థూల శరీరాన్ని, కొందరే సూక్ష్మ శరీరాన్ని, మరి కొందరే కారణ శరీరాన్ని పరికిస్తూ ఉంటారు. స్థూల శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉం చుకోవాలని అధికులు ఆరాటపడు తూనే ఉంటారు. స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయిస్తూ ఉంటారు. నిర్మాలిన్య సాధ నాల్ని సౌందర్య సాధనాల్ని పరిమళ ద్రవ్యాల్ని వాడు తూనే ఉంటారు. వైద్యుల్ని ఆరోగ్యానికై సంప్రదిస్తూనే ఉంటారు. ఈ స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయించక పోతే, అది మాలిన్యంతో దుర్గంధ భరితం అవుతుంది. అట్టి వారిని చూసి సభ్యసమాజం ముక్కు మూసుకుం టుంది. స్థూల శరీరానికి ఎలా మాలిన్యాలు ఉన్నాయో, అలానే సూక్ష్మ శరీరానికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మాలిన్యాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీ రాన్ని మాలిన్య రహితంగా వినిర్మలంగా ఉంచుకోవా లని ఆరాటపడే వారు చాలా అరుదు. సూక్ష్మశరీర నిరంతర పరిశీలనమే ఆ నిర్మాలి న్యానికి తొలి సాధనం. అంతరంగంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుర్గంధాలు పేరుకుం టున్నాయని ప్రథమంగా గుర్తించాలి. గుర్తించిన వెం టనే భగవన్నామ స్మరణంతో భగవత్ ధ్యానంతో భగ వత్ చింతనతో ఆ సూక్ష్మ శరీరానికి స్నానం చేయించి, దుర్గంధాల్ని నివారించాలి. అలా చేయకపోతే, సూక్ష్మ శరీరం దుర్గంధ భరిత మవుతుంది. సాధు సజ్జనులు ఇలాంటి సూక్ష్మ శరీ రాన్ని చూసి ముక్కు మూసుకుంటారు. మనం మన సూక్ష్మ శరీరానికి స్నానం చేయించకుండా, ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి ఎన్ని జన్మల నుంచి దుర్గంధ భరి తం చేశామో, పరిశీలించాలి. అలా పరిశీలించి, తప్పి దాన్ని తెలుసుకొని, వెంటనే సూక్ష్మ శరీర అభ్యంగన స్నానానికి సమాయత్తం కావాలి. అనుదినం ఆమరణ పర్యంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా సూక్ష్మ శరీరాన్ని శుభ్రంగా వినిర్మలంగా ఉంచుకోగలిగితే, మూలాజ్ఞానమనే కారణ శరీరం కూడా జ్ఞానమయమవుతుంది. దేహ భ్రాంతి జీవభ్రాం తి అనే అవిద్య నశిస్తుంది. ఆత్మ నిష,్ఠ జ్ఞాన నిష్ఠ సిద్ధి స్తుంది. జీవితమే వినిర్మలమవుతుంది. కనుక స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీర పారిశుద్ధ్యానికీ, తక్షణమే ప్రాధాన్యాన్ని ఇద్దాం. శరీరత్రయ శుద్ధికి సంకల్పిద్దాం. ఈ పుడమిని స్వర్గధామం చేద్దాం. నరజాతికి నారా యణ తత్వాన్ని ప్రబోధిద్దాం. పరమాత్ముని -
ప్రేమోపాసన
రుజుమార్గం నందవ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహప్రవేశానికి ఎందరో ఆత్మీయులు, బంధువులు, సన్నిహితులు వచ్చారు. ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఇష్టసఖి కూడా బహుదూరం నుంచి వచ్చింది. గృహప్ర వేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. నదీ జలాల్లో జలకాలాడుతూ ఇష్టసఖి గోపి కతో ‘చెలీ! మీరంతా ఎంతో అదృష్టవంతులు. శ్రీకృ ష్ణునితో రాసలీలలో పాల్గొనే మహదవకాశం మీకు ప్రా ప్తించింది కదా అన్నది. ‘నిజమేనేమో’ అన్నది గోపిక. ‘చెలీ! రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రీ ఆరు నెలల సాధారణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ సమయంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు నీ తనువుపై తన అధరాల ముద్రల్ని అంకితం చేశాడో, మరి ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలిం చాడో? చెప్పవా?’ అన్నది కుతూహలంగా ఇష్టసఖి. గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల ఒక తరగతి గది కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటా నికి! అది ఒక దుకాణం కాదుకదా, లెక్కలు సరిచూసు కోవటానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అనిర్వచనీయమైన రసానుభూతి. స్వామి సన్నిధి చేరగానే స్వామి స్పర్శానుభూతిని పొం దగానే, నాకు శరీరస్పృహ నశించింది. స్వామి ధ్యానం లో నా అంతరంగం అంతరించిపో యింది. నేను నేనుగా మిగలలేదు. నేను అంతరించగానే, ఇంక మిగి లింది పరమానంద స్ఫూర్తియే! సత్ చిత్ ఆనంద చైతన్యమే!’ అన్నది పర వశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఈ దశకు చేరటా నికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టించావో? కదా అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను. నేనింత ధ్యానించా ను. అన్న లెక్కల్లో ‘అహమ్’ ఉంటుంది. అహం ఉన్నం త కాలం స్వామి సన్నిధి దక్కదు. స్వామి విరహంలో ఎంతగా జ్వలించావు? స్వామి సన్నిధికై ఎంతగా తపిం చావు? అన్నదే ప్రధానం. సన్నిధికి పూర్వం దర్శనాన్ని పొందకుండా ‘నేను’ ఉండలేను, అన్న స్థితి కలగాలి. అప్పుడే స్వామి దర్శనం!’ అన్నది గోపిక. ఆ యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొ ని ఒక సాధకుడు కొంత కాలంగా కృష్ణమంత్రాన్ని జపి స్తున్నాడు. శరీరం శుష్కించిందే కానీ, తలపై జటలు కట్టాయే కానీ, శ్రీకృష్ణ సాక్షాత్కారం సంప్రాప్తించ లేదు. నిరాశలో ఉన్న ఆ సాధకునికి ఈ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరి వేశాడు. ప్రేమోపాసనకు ఉద్యుక్తుడైనాడు. చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహం లో తపించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి పొందాలని మనస్సు పరితపించాలి. మహదానంద స్వరూపులమై ప్రేమ స్వరూపులమై నిలవాలని జ్వలించాలి. అదే వినిర్మలభక్తి. మనమూ వినిర్మల భక్తులమై ప్రేమోసాకులమై సాధనను కొనసాగిద్దాం. పరమాత్ముని -
జై వీరహనుమాన్
జ్యోతిర్మయం హిందీ సాహిత్య గగనంలో చంద్రునిగా కీర్తినం దుకున్న భక్త కవి తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ హనుమంతుని సమగ్ర స్వరూపాన్నీ మహా త్మ్యాన్నీ అభివర్ణిస్తుంది. ఈ చాలీసా యావత్ భార తీయ భక్తజనుల నాల్కలపై నర్తిస్తుందనడం అతి శయోక్తి కాదు. ఈ చాలీసా ఆరంభంలోనే హనుమంతుని ‘జ్ఞాన గుణసాగర’ అని సంబోధించింది. హనుమంతుని జ్ఞానం అంతులేని సాగరం వంటిదని అర్థం. ఆ జ్ఞాన మే ముల్లోకాల్ని జాగృతం చేస్తుందని చెప్తూ ‘తిహులోక ఉజాగర’ అని జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మగా ఈ స్తోత్రరాజం కీర్తించింది. ఆ జ్ఞానమే దేహాత్మబుద్ధి జీవా త్మబుద్ధితో కూడిన కుమతిని తొలగించి ఆత్మబుద్ధి అనే సుమతిని కలిగిస్తుందని ధ్రువీకరిస్తూ ‘కుమతినివార సుమతికే సంగీ’ అని ఆ కపీశుణ్ణి శ్లాఘించింది. సాగరోల్లంఘన చేసి లంకలో హనుమంతుడు ప్రదర్శించిన ధైర్యాన్నీ పరాక్రమాన్నీ సమయోచిత చాతుర్యాన్నీ ఈ చాలీసా వేనోళ్ల శ్లాఘించింది. హను మంతుడు ‘రామకాజకరివేకో ఆతుర’ రామకార్య నిర్వ హణలో మహా ఆత్రుత కలవాడు అని వివరించింది. లంకలో హనుమంతుడు, సీతకు కాపలా కాచే రాక్షస స్త్రీలు ఎక్కడ తన రాకను గమనిస్తారో అని, అత్యంత సూక్ష్మరూపాన్ని ధరించి ‘సూక్ష్మ రూపధరి సియహి దిఖావ’ సీతా దేవికి కనిపించాడు అన్నది చాలీసా. పిదప హనుమంతుడు బృహద్రూ పాన్ని ధరించి లంకాదహనం చేసిన ఘట్టాన్ని వర్ణిస్తూ ‘వికట రూపధరి లంక జరావా’ అన్నాడు తులసీదాస్. పిమ్మట ‘భీమరూపధరి అసుర సంహారే’ భీకర రూపాన్ని ధరించి హనుమ అసురుల్ని మట్టుబెట్టాడని చెప్పి, ఇలా హనుమ ‘రామచంద్రకే కాజ సంవారే’ రాముని కార్యాన్ని చక్కబెట్టాడని, తులసీదాసు హనుమ పరాక్రమాన్ని కీర్తించాడు. హనుమంతుని భక్త రక్షణా దృఢ వ్రతాన్ని అభివ ర్ణిస్తూ తులసీదాసు ‘సుబసుఖలహై తుమార్హరీ శరనా, తుమ రక్షక కాహూకో డరనా’ ఓ హనుమా! నిన్ను శర ణుజొచ్చితే సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయి. అసలు నీ రక్షణలో భయానికి తావే లేదు అని అన్నాడు. ‘భూతపి శాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై’ ఓ హనుమా! నీ నామస్మరణంచే, దుష్టశక్తులు దరిచేరవు అని హనుమన్నామ ప్రాశస్త్యాన్ని వర్ణించాడు. ‘సాధు సంతకే తుమ రఖవారే’- ఓ హనుమా! నీవు సాధు రక్షకుడవు అని అంటూ, ‘జన్మ జన్మకే దుఃఖ బిసరావై’- జన్మజన్మల జీవుని వేదనను తొల గించే ముక్తి ప్రదాత అని హనుమ మహాత్మ్యాన్ని కీర్తిం చాడు తులసీదాస్. ‘జో యహ పఢై హనుమాన్ చాలీసా, హొయసిద్ధి సాఖీ గౌరీసా’ హనుమాన్ చాలీసాను నిత్యం పారా యణ చేస్తే, జీవన్ముక్తి ప్రాప్తిస్తుందని, అందుకు పార్వ తీ పరమేశ్వరులే సాక్షులని తులసీదాస్ అభయమి చ్చాడు. హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తూ సిద్ధిని పొందుదాం. పరమాత్ముని -
శ్రుతిసారం
జ్యోతిర్మయం ‘అంతా మిథ్య తలంచి చూడ’... లోతుగా పరిశీలించి చూస్తే, ఈ లౌకికమైన జగత్తంతా మిథ్యే. ఇందులో మనం దక్కుతాయని ఆశిస్తున్న ఆనందాలూ మిథ్యే. ఈ భోగాలూ మిథ్యే. ఈ విషయం తెలిసినప్పటికీ నరులు ‘నేనూ నా సంతానం, నా సంసారం, నా సంపద, నా ఇల్లూ వాకిలీ’ అనే మోహంలో కొట్టుమి ట్టాడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారే కానీ, పర మార్థమైన దైవాన్ని ధ్యానింపరు కదా అని ధూర్జటి మహాకవి వాపోయాడు కాళహస్తీశ్వర శతకంలో. ‘తద్యథా ఇహ కర్మచితః లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యచితః లోకః క్షీయతే’ ఈ లోకంలో వ్యవసాయం, వాణిజ్యం సేవ మొదలైన కర్మల వల్ల సంపాదించుకున్న భోగాలు కాలక్రమంలో ఎలా గతించిపోతాయి. అలానే అగ్నిహోత్రాది కర్మల వల్ల సాధించుకున్న స్వర్గాది ఫలాలూ, చేసుకున్న పుణ్యం నశించగానే నశిస్తాయి, కనుక వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నది శ్రుతిమాత. ఈ లోకంలోని ఆనందానుభవం ఎలా అనిత్యమో, పరలోకంలోని స్వర్గాది సౌఖ్యాల ఆనందానుభవమూ అలానే అనిత్యం అన్నది శ్రుతి తాత్పర్యం. ఈ లోకాలు కేవలం అవిచార రమణీయమే. లలితా పరమేశ్వరి సహస్ర నామాల్లో ‘మిథ్యా జగదధిష్ఠానా’ అన్నది ఒక నామం. ఈ నామానికి విశేషమైన అర్థం ఉన్నది. అమ్మవారు ఈ మిథ్యా జగత్తుకు అధిష్ఠాన స్వరూపం అన్నది ఈ నామ తాత్పర్యం. మసక చీకట్లో తాడు పాములా అనిపిస్తుంది. భ్రాంతి గొల్పుతుంది. అలా ఈ మిథ్యా జగత్తుకు అమ్మవారు అధిష్ఠానం, ఆధారం. వాస్తవమైన తాడు ఉండబట్టి మిథ్య అయిన సర్పం తాత్కాలికంగా ఆభాసిస్తోంది. ఉన్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి తొలగితే మిథ్యా సర్పం మటు మాయమై, వాస్తవమైన తాడే మిగులుతుంది. అదే విధంగా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జగత్తు, జగత్తులోని సుఖ దుఃఖాలు, జన్మ మృత్యువులూ, సత్యంగా గోచరిస్తాయి. అజ్ఞానం తొలగితే జగత్తు పట్ల సత్యత్వ భావన అదృశ్యమవుతుంది. అధిష్ఠాన మైన అమ్మవారే గోచరిస్తుంది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న పారమార్థిక సత్యం సుదృఢం అవుతుంది. అప్పుడంతా అద్వైతమే. జగత్తు పారమార్థిక సత్యం కాదన్నదే శ్రుతి సారం. లలిత నామ సహస్రం బోధ అదే. ధూర్జటి పల్కుల తాత్పర్యం అదే. ఈ జగత్తుకు సంబంధించిన అసత్వాన్ని తెలుసుకొని, నేను కర్తను భోక్తను కాను అన్న పరమార్థాన్ని గ్రహించి, ఈ వ్యావహారిక జగత్తులో, ఫలాల్ని ఆశించకుండా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిత్యం నిర్వహించాలన్నదే గీతాసారం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ నీకు అధికారం కర్మల్లోనే, ఫలాల్లో కాదు, అన్నది గీతా తాత్పర్యం. గీతా సారాన్ని గ్రహించి, ఉపనిషత్ బోధను స్వీక రించి, నిష్కామ కర్మను చేబట్టి, మన జీవితాన్ని సార్థ కం చేసుకుందాం. పరమాత్ముని
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement