breaking news
Nimajjanalu
-
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడికి శాంతియుతంగా వీడ్కోలు పలికారు. గణేశోత్సవాలతోపాటు నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ‘గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా’ (గణపతి దేవుడా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్య), ‘గణపతి గేల గావాల చైన్ పడేన హమాల’ అనే నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో 10 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడి ప్రతిమలను భారీ ఎత్తున శోభాయాత్రల ద్వారా ఊరేగించి నిమజ్జనం చేశారు. భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు పలు ప్రాంతాల్లో బుధవారం వరకు కొనసాగాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 69 కృత్రిమ నిమజ్జన ఘాట్లతోపాటు 204 కృత్రిమ నిమజ్జన ఘాట్ల వద్ద మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ముంబైలో మొత్తం 37,064 వినాయకుల నిమజ్జనం జరిగాయి. వీటిలో 5,762 విగ్రహాలు సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 31,105 ఇళ్లల్లో ప్రతిష్టించిన వినాయకులతోపాటు 197 గౌరీలను నిమజ్జనం చేశారు. కృత్రిమ జలాశయాల్లో 709 సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 10,957 ఇళ్లల్లోని వినాయకులు, గౌరీలు ఇలా మొత్తం 11,713 విగ్రహాలున్నాయి. ముంబైలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ముంబై రాజాగా గుర్తింపు పొందిన గణేశ్ గల్లీలోని ముంబైచా రాజా వినాయకుడి నిమజ్జన యాత్ర మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటలకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రతో ముంబై నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అనంతరం ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కోరికలు తీర్చేదైవంగా గుర్తింపు పొందిన లాల్బాగ్చా రాజా వినాయకుని హారతి 10.30 గంటల ప్రాంతంలో జరిగింది. అనంతరం లాల్బాగ్ చా రాజా వినాయకుని శోభాయాత్ర సుమారు 11 గంటలకు ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన నిమజ్జనోత్సవాలలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ముంబైలోని గిర్గావ్, శివాజీ పార్క్, జుహూ, చౌపాటీ తదితర నిమజ్జన ఘాట్ల వద్దకి లక్షలాది మంది భక్తులు వినాయకుడిని సాగనంపారు. ప్రతి సారి మాదిరిగానే ఈ సారి నిమజ్జనోత్సవాలు కూడా నిఘా నీడలో జరిగాయి. నిమజ్జనాల ఊరేగింపులు ఎంత తక్కువైతే అంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని పోలీసులు సార్వజనిక గణేశోత్సవ మండళ్లకు సూచనలిచి్చనప్పటికీ నగరంలో సగటున 5 నుంచి 10 గంటలపాటు నిమజ్జనాల ఊరేగింపులు కొనసా గాయి. నగరంలోని ప్రముఖ వినాయకులలో ఒకటైన లాల్బాగ్ చా రాజా వినాయకుడి నిమజ్జన ఊరేగింపు సుమారు 19 గంటలపాటు కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. లాల్బాగ్ నుంచి గిర్గావ్ చౌపాటీ వరకు జనం నీరాజనాలు పలికారు. ఇసుకవేస్తే రాలనంత జనం మధ్య ఈ నిమజ్జనోత్సవాల శోభాయాత్ర కొనసాగింది. గణపతి బొప్పా మోర్యా.. గణపతి చాల్ లా గావాలా.. చైన్ పడేనా అమ్హాలా.. అనే నినాదాలతో పరిసరాలు హోరే త్తాయి. భక్తిమయ వాతవరణం మధ్య నిమజ్జన యాత్ర కొనసాగింది. ముఖ్యంగా చిన్న పెద్ద ఆడామగ వయసుతో తేడా లేకుండా అందరూ బ్యాండుమేళాలు సంగీతానుసారం నృత్యం చేస్తూ వీడ్కోలు పలికారు. ఇలా బుధవారం ఉదయం లాల్బాగ్చా రాజా వినాయకుడిని గిర్గావ్ చౌపాటీలో నిమజ్జనం చేశారు. మరోవైపు పక్కనే ఉన్న థానే, నవీ ముంబైలలో నిమజ్జనాల ఊరేగింపులు కూడా సగటున 3 నుంచి 5 గంటలపాటు సాగాయి. ముంబై పోలీసులకు మద్దతుగా హోంగార్డులు, అగి్నమాపక సిబ్బంది, ఎస్ఆర్పీఎస్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని మోహరించారు. అలాగే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ముందుజాగ్రత్తగా పలు రోడ్లు బంద్ చేయడంతోపాటు వన్వే ల కారణంగా అంతగా సమస్య ఏర్పడలేదని చెప్పవచ్చు. అయితే నిమజ్జనాల ఘాట్లవైపు వెళ్లే రోడ్లుపై మాత్రం తీవ్ర ట్రాఫిక్ సమస్య కని్పంచింది. మరోవైపు కృత్రిమ జలాశయాల్లో కూడా భారీ ఎత్తున నిమజ్జనాలు జరగడం పర్యావరణ ప్రేమికులకు ఆనందం కలిగించింది. థానే మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బీఎంసీ చేస్తున్న ప్రయత్నం పెద్ద ఎత్తున సఫలీకృతమైందని చెప్పవచ్చు. పుణేలో ఎప్పటిలాగానే రెండవరోజు బుధవారం మ« ద్యాహ్నం వరకు నిమజ్జనాలు జరిగాయి. అయితే ఈసారి నిమజ్జనోత్సవాలు 29 గంటలకుపైగా సమయం పట్టడం విశేషం. నగరంలో గణేశోత్సవాలకే గౌర వంగా భావించే మొదటి గణపతి ‘కస్బా పేట్’ వినాయకుడితోపాటు అయిదు గణపతు ల శోభాయాత్రలు ముందు గా ప్రారంభమయ్యాయి. పుణేలో ముఖ్యంగా కళ్లు మిరుమి ట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతోపాటు సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనోత్సవాల శోభాయాత్రలు జరిగాయి. ఈ శోభాయాత్రల ను లక్షలాది మంది తిలకించారు. -
రెండో రోజూ.. బైబై గణేశా
సాక్షి, సిటీబ్యూరో: వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చాయి. దీంతో ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా వైపు నిమజ్జన వాహనాలు భారీ ఎత్తున బారులు తీరాయి. గురువారం మొదలైన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు నిరాటంకంగా శుక్రవారం కూడా కొనసాగగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ♦ రామంతాపూర్, అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్నగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలివచ్చాయి. రెండు రోజులుగా సుమారు 10 వేలకుపైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పోలీసు వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు సుమారు 30 వేలకుపైగా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైన మూడో రోజు నుంచే నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. 5వ రోజు కూడా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఉత్సవాల అనంతరం గురువారం పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేయగా, శుక్రవారం కూడా అన్ని వైపులా నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకూ నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా వైపు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. మహాగణపతి నిమజ్జనంతో మొదలు.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా విగ్రహాల తరలింపు క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మందకొడిగా సాగిన తరలింపు ప్రక్రియ రాత్రి నుంచి వేగంగా సాగింది. బాలాపూర్ విగ్రహాన్ని తరలించిన అనంతరం వరుసగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు చెందిన విగ్రహాలు బారులు తీరాయి.భారీ విగ్రహాలు కావడంతో నెమ్మదిగా ముందుకు కదిలాయి. అదే సమయంలో రామంతాపూర్, అంబర్పేట్ వైపు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు కూడా ప్రధాన శోభాయాత్రలో చేరడంతో నిమజ్జనం నెమ్మదిగా సాగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఏర్పాట్లు చేయగా, కొన్ని విగ్రహాలను శుక్రవారం ఉదయం తరలించారు. దీంతో గురువారం మొదలైన నిమజ్జన శోభాయాత్ర నిరాటంకంగా సాగింది. అబిడ్స్, కోఠి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిటీబస్సులు, ఇతర వాహనాలు స్తంభించడంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మొదటి రోజే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. రెండో రోజు మిగిలిన విగ్రహాలను ఉదయం పదింటి వరకే పూర్తి చేస్తారు.కానీ అందుకు పూర్తిగా భిన్నంగా రెండు రోజులు నిమజ్జనం కొనసాగింది. శుక్రవారం రాత్రి కూడా విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
నిమజ్జన వైభవం
గంగ ఒడిలో సేదతీరేందుకు గణనాథుడు ఘనంగా తరలివెళ్లాడు. ఆదివారం ఉదయం నుంచే అట్టహాసంగా వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరిగాయి. హుస్సేన్సాగర్, కాప్రా చెరువు, కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు, సరూర్నగర్లోని మినీట్యాంక్బండ్, గచ్చిబౌలిలోని దుర్గం చెరువు, గండిపేట్, సఫిల్గూడ చెరువులలో నిమజ్జనం జరిగింది. - సాక్షి, సిటీబ్యూరో