మీజు నుంచి ‘ఎంఎక్స్5’ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీజు టెక్నాలజీ లిమిటెడ్ ‘ఎంఎక్స్5’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.19,999. ఈ స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,150 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ‘ఎంఎక్స్5’ స్మార్ట్ఫోన్ల విక్రయాల కోసం స్నాప్డీల్తో ఒప్పందం కుదుర్చుకుంది.