breaking news
Mungeli
-
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
నిప్పులపై నడిచిన ఐజీ, మహిళా ఎస్పీ
-
నిప్పులపై నడిచిన ఐజీ, మహిళా ఎస్పీ
రాయ్పూర్: తమ ప్రాంతంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను నిలువరించేందుకు ఛత్తీస్గఢ్లో ఓ ఐజీ అధికారి, ఓ ఎస్పీ నడుం కట్టారు. మూఢ విశ్వాసాలను నమ్మకూడదని రుజువు చేస్తూ వారిద్దరు బూట్లు లేకుండా పాదాలతో నిప్పులపై నడిచి చూపించారు. ముంగేలి ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అందరిని ఒక చోటకు పిలిచారు. అనంతరం ఓ నిప్పుల కొలిమి ఏర్పాటుచేశారు. బిలాస్పూర్ కు చెందిన ఐజీ వివేకానంద్, ముంగేలి ఎస్పీ నీతు కమల్ ఆ నిప్పులపై చెప్పులు లేకుండా నడిచారు. చేతబడి కూడా లేదని దానికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఎలా చేస్తారో వారికి వివరించారు. మాయాజాలంతో ప్రజలను ఎలా మోసం చేస్తారో ప్రయోగాత్మకంగా చూపించారు. పలువురు విద్యార్థులు, గ్రామస్తులతో కూడా ఆ నిప్పులపై నడిపించి తమ విశ్వాసాలు మూఢత్వంతో నిండినవని నిరూపించారు. ఇటీవల కాలంలో ముంగేలీలో ఈ తరహా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించేందుకు ఉన్నత శ్రేణి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.