breaking news
MLA Vallabhaneni vamsimohan
-
అచ్చెన్నాయుడు చిట్టా విప్పుతా.. ఎమ్మెల్యే వంశీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ‘‘చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు బాధలో ఉన్నాయని.. అందుకే కావాలని గోబెల్ ప్రచారం చేస్తున్నాయి’’ అంటూ వంశీ దుయ్యబట్టారు. ‘‘చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు. పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు.. ఓ మహిళా ఆఫీసర్పై అసభ్యంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు నా గురించి మాట్లాడితే చిట్టా విప్పుతా.. చంద్రబాబు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం జగన్.. అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది? -
చిన్న చిన్న పొరపాట్లు వాస్తవమే
► ఉమాతో పోరు లేదు ► బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ధికి చర్యలు ► ఎమ్మెల్యే వంశీ వెల్లడి గన్నవరం : గన్నవరం-ఆగిరిపల్లి మండలాల మధ్య ఉన్న బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. ‘మట్టి పోరు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్థానిక తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. చెరువులో మట్టి తవ్వకాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, తనకు ఎటువంటి పోరూ లేదన్నారు. చెరువులో పూడికలను తొలగించి, ఆక్రమణలను ప్రక్షాళన చేయటం, గ ట్లను బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రస్తుతం పనులు చేపట్టామని తెలిపారు. దీనిని రిజర్వాయర్గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు సీఎంతో పాటు మంత్రి ఉమా అంగీకరించారని చెప్పారు. పుష్కరాలకు రోడ్ల నిర్మాణం... రానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జక్కంపూడి నుంచి గొల్లనపల్లి వరకు పోలవరం కాలువ కట్టపై నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని వంశీ తెలిపారు. పాయకాపురం వైపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ముస్తాబాద మీదుగా కేసరపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు విస్తరణకు రూ.21 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.