-
షేమ్...షేమ్!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం ముందు హోదాలు బలాదూర్ అవుతున్నాయి. వేదిక ఏదైనా తెలుగుతమ్ముళ్లు ఆశీనులవుతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులను, అధికారులను విస్మరిస్తున్నారు. ప్రోటోకాల్ విస్మరిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సాక్షిగా ఉన్నతాధికారులు ఘోర పరాభవం చవిచూశారు. టీడీపీ నేతల ముందు కమిషనర్, డీఈఓ చేతులు కట్టుకొని నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఏకంగా ఇన్చార్జి మంత్రి సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయస్థాయి పోటీపరీక్షలకు సన్నద్ధం చేసేందుకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం మున్సిపల్ హైస్కూల్స్లో ఐఐటీ, నీట్ కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టారు. శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. కాగా అధికారిక కార్యక్రమంలో అధికారులకు చోటు దక్కకపోగా టీడీపీ నేతలు మూకుమ్మడిగా తిష్టవేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సురేష్నాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్లు వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, మంత్రి గంటా చెంతన కూర్చొని ఉండగా కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఈఓ ప్రతాపరెడ్డి, హెచ్ఎం సుబ్బారెడ్డిలు నిల్చోవాల్సి వచ్చింది. సాక్షాత్తు మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో సైతం కలెక్టర్ సాక్షిగా ప్రోటోకాల్కు తిలోదాకాలిచ్చారు. కార్యక్రమం ముగిసేంత వరకూ ఉన్నతాధికారులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోవాల్సిన వచ్చింది. తలాడించాల్సిన దుస్థితి టీడీపీ నేతలు ఎవరు స్పందించినా గంగిరెద్దులా తలాండించాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనను కలెక్టర్ నియంత్రించాల్సి ఉంది. కాగా ఇదేవిషయమై ఓ ఉన్నతాధికారి సాక్షితో మాట్లాడుతూ అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉద్యోగం ఉండదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చెప్పినట్లే ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్నా అనేక సమస్యలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారకార్యక్రమంలో సీటు దక్కకపోయినా బాధలేదు, దూషణలు లేకపోతే చాలంటూ పేర్కొనడం విశేషం. దీనిని బట్టి అధికారుల మానసిక పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన
రంపచోడవరం, న్యూస్లైన్ : కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై.కిషోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఏజెన్సీలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. రెండున రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మూడున పీఎంఆర్సీలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదే రోజు మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ, రాజీవ్ యువ కిరణాలు, మండల మహిళా సమాఖ్య లీడర్లు తదితరులతో చర్చాగోష్టిలో పాల్గొంటారని తెలిపారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement