breaking news
Member of the Legislative Assembly
-
సర్టిఫికెట్లు జారీ చేసిన దొంగ దొరికాడు
మంత్రి, ఎమ్మెల్యేకి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన అంశం కొలిక్కి వచ్చింది. పనుల్లో తనకు అవకాశం ఇవ్వలేదన్న అక్కసుతో కాంట్రాక్టర్ అతితెలివి ప్రదర్శించినట్లు తేలింది. అలాగే మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర సహకారశాఖ మంత్రి సెల్లూరు కె.రాజు, సీపీఎం ఎమ్మెల్యే అన్నాదురైలకు మదురై కార్పొరేషన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు జారీ కావడం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయూంశమైంది. సైబర్ క్రైం రంగంలోకి దిగడంతో విచారణ వేగం పుంజుకుంది. ఓ కంప్యూటర్ నుంచి ఈ సర్టిఫికెట్లు ప్రింట్ తీసి ఉండడం వెలుగు చూసింది. ఆ కంప్యూటర్ను ఉపయోగించే సిబ్బందిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. కార్పొరేషన్ కాంట్రాక్టర్ పొన్నురాం ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు తేలింది. అసలు కథ ఇదీ జన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు, కాంట్రాక్టు కార్మికుల నియూమకం, కంప్యూటర్ల పర్యవేక్షణ తదితర పనుల్ని కాంట్రాక్టర్ పొన్నురామ్కు గతంలో అప్పగించారు. ఇటీవల ఆన్లైన్లో నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో అన్ని పనులూ మరో కాంట్రాక్టర్ మురుగేషన్ చేతికి చేరారుు. మేయర్ రాజన్ చెల్లప్పకు మురుగేషన్ సన్నిహితుడు కావడంతో కాంట్రాక్టులన్నీ ఆయనకే అప్పగించడం మొదలైంది. తనకు కాంట్రాక్ట్లు దూరమవడాన్ని పొన్నరాం జీర్ణించుకోలేకపోయూడు. మురుగేషన్ ను అప్రతిష్ట పాలు చేయడం లక్ష్యంగా పథకం రచించాడు. జనన, మరణ విభాగంలో కాంట్రాక్టు కార్మికులుగా ఉన్న వారిలో తన సన్నిహితులతో పథకం అమలు చేరుుంచాడు. నకిలీ సర్టిఫికెట్ల జారీని వేగవంతం చేశాడు. ఈ వ్యవహారం ఏదో ఒకరోజు వెలుగులోకి రావడం తథ్యమని, తద్వారా మురుగేషన్ ఇరకాటంలో పడతాడని భావించాడు. అయితే మంత్రి, ఎమ్మెల్యేలకు డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేసి పొన్నురాం, అతని సన్నిహితులు ముగ్గురు సైబర్ క్రైమ్కు చిక్కారు. -
సమైక్య ఉద్యమం అదే జోరు
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగాయి. మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులో సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ నేతలు స్థానిక హిందూ కశాశాల సెంటర్లో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్య నినాదాలు చేశారు. పలు విద్యార్థి సంఘాలు రోడ్లపై సమైక్య ప్రదర్శన చేశాయి. నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక రాజు ఆమరణ నిరాహార దీక్షను సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవ అధ్యక్షులు ఆచార్య పి. నరసింహారావు, జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ తదితరులు నిమ్మరసం అందించి విరమింపజేశారు. సత్తెనపల్లిలో ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేట రూరల్ గంగన్నపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వాన భారీ ర్యాలీ, మానవహారం జరిగింది. వినుకొండలో ముస్లింలు ప్రదర్శన నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్ సిబ్బంది వేర్వేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాలు పట్టుకుని నిరసన తెలిపారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో.. తెనాలిలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని రోజుకోరీతిగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు. సమైక్యాంధ్ర బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్విలాస్ సెంటర్లో సిటీబస్సులను అడ్డగించారు. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సభ్యులు మోకాళ్లతో నడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. గుంటూరులో బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్పేట స్టేషన్కు తరలించారు. అనంతరం ఆందోళనకారులను వదిలేశారు. -
ఊరూ వాడా సమైక్యం
**** కొనసాగుతున్న మున్సిపల్ ఉద్యోగుల పెన్డౌన్ సమ్మె **** గుంటూరులో కార్పొరేషన్ ఉద్యోగుల విధుల బహిష్కరణ **** తెలుగుదేశం నాయకుల భారీ ప్రదర్శన, ధర్నా **** బ్రాహ్మణ సంఘాల జేఏసీ శాంతి హోమం **** వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన **** మంత్రి డొక్కా కార్యాలయం ముట్టడించిన ఎన్జీవోలు **** ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యుల జేఏసీ ధర్నా, మానవహారం **** విద్యుత్ ఉద్యోగుల ఎస్ఈ కార్యాలయం ముట్టడి **** విద్యార్థుల ప్రదర్శనలు,ధర్నాలు, మానవహారాలు సాక్షి, గుంటూరు : ఏకపక్ష నిర్ణయాలతో యూపీఏ రాష్ట్ర విభజన చేయడం సహించరాని నేరమంటూ సర్వజనం గొంతెత్తి అరుస్తోంది. చేయిచేయి కలిపి రోడ్లపైకి వచ్చి కదం తొక్కుతోంది. అధికార కాంగ్రెస్ నేతలు మౌనం వీడి రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుండి నాయకత్వం వహిస్తుండగా, రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో నిరసనలు మంగళవారం కూడా హోరెత్తాయి. జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల 72 గంటల పెన్డౌన్ కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు భారీగా ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి మార్కెట్ సెంటర్లో వంటావార్పుచేసి రోడ్డుపైనే భోజనాలు ఆరగించారు. కబడ్డీ, కోకో వంటి ఆటలు ఆడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ఏ ఒక్కర్నీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో... టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ నుంచి హిందూ కళాశాల వద్ద వున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేసి అక్కడ ధర్నా చేశారు. బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లో శాంతి హోమం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ మహిళావిభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. చౌడవరం, చినపలకలూరు, పెదపలకలూరులలో వైఎస్సార్ సీపీ నేతల నాయకత్వాన గ్రామస్తులు రాస్తారోకోలు చేసి సమైక్య నినాదాలు చేశారు. చిలకలూరిపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగి వాహనాల్ని నిలిపేశారు. యూపీఏ అధినేత్రి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీఎన్జీవో సంఘం గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించింది. ప్రింటర్స్ అసోషియేషన్ కూడా భారీ ప్రదర్శన చేసి మార్కెట్ సెంటర్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టింది. ఆంధ్రా సౌవార్తిక లూథరన్ సంఘం గుంటూరు సినడు అధ్యక్షుడు బిషప్ ఏలియా నాయకత్వాన నిరసన దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ నిరసన రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ప్రదర్శన చేశారు. తెలుగుతల్లి వేషధారణతో ఉన్న విద్యార్థికి దండం పెడుతూ నల్లజెండాలు పట్టుకుని హిందూ కళాశాల సెంటర్లో మానవహారం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, మానవహారం జరిగింది. వెటర్నరీ వైద్యుల సంఘం కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... నరసరావుపేటలో సమైక్యాంధ్ర జేఏసీ చేపట్టిన ర్యాలీకి వైఎస్సార్ సీపీ సమన్వయకర్తడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. సత్తెనపల్లిలో టాక్సీ ఓనర్ల, డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ జరిగింది. వినుకొండలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నన్నపనేని సుధ హాజరై మద్దతు తెలిపారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల నిరాహార దీక్ష శిబిరానికి జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. తెనాలిలో ఆటోడ్రైవర్ల సంఘం సోనియా దిష్టిబొమ్మను దహనం చేసింది. విద్యుత్శాఖ ఉద్యోగుల జేఏసీ జిల్లాలోని అన్ని డీఈఈ కార్యాలయాల ముట్టడి, గుంటూరు కేంద్రంలో ఎస్ఈ కార్యాలయ ముట్టడి చేశారు. బాపట్లలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. రేపల్లెలో కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.