breaking news
Maya Tata
-
టాటా బోర్డులో ఇద్దరు వారసురాళ్లకు చోటు
సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్లో ఎగ్జిక్యూటివ్గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్లు స్పందించ లేదు.SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్లో టాటా ట్రస్ట్ల ఛైర్మన్గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.లేహ్ టాటాలేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్వే హోటల్స్ బ్రాండ్ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయ టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.నోయల్ టాటాదివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. -
లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే. ఇదీ చదవండి: గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే! రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది.