breaking news
machkand
-
మాచ్ఖండ్ మిలమిల
ఆంధ్రా ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్జలవిద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి ఉత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్ట్ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. మిగతా యూనిట్లో కూడా విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలాఇరు రాష్ట్రాల అధికారులు శ్రమిస్తున్నారు. ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన గాడిలో పడుతోంది. కొంతకాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండటంతో ప్రాజెక్టు ఉద్యోగులు అవస్థలు పడుతూ వచ్చారు. మరోపక్క నీటి సమస్య కూడా ఉత్పాదనకు ఆటంకం కలిగించింది. ఇప్పుడు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ జలాశయాల నీటిమట్టాలు కూడా మెరుగుపడుతున్నాయి. అధికారులు, సిబ్బంది రేయింబళ్లు శ్రమించి ప్రాజెక్ట్లోని ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతం 1,2,3,5,6 జనరేటర్ యూనిట్ల ద్వారా 97 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాలుగో నంబరు జనరేటర్కు మరమ్మతులు జరుగుతున్నాయి. దీనిని కూడా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు జనరేటర్లు పనిచేస్తే 120 మెగావాట్ల మేర ఉత్పాదన జరుగుతుందని పేర్కొన్నాయి. జనరేటర్లు మరమ్మతుల కారణంగా దాదాపుగా 15 ఏళ్లుగా విద్యుత్ ఉత్పాదన కుంటుపడింది. 2023 ఆగస్టులో మాత్రమే ప్రాజెక్ట్లోని ఆరు జనరేటర్లు పనిచేయడం వల్ల పూర్తిస్థాయిలో 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన సాధ్యమైంది. అప్పటిలో రెండు నెలల మాత్రమే పూర్తిగా జనరేటర్లు పనిచేశాయి. ఆ తరువాత నుంచి మొరాయింపుతో ఉత్పాదన తగ్గిపోయింది. కొద్ది నెలల క్రితం వరకు 68 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగేది. అధికా రులు సిబ్బంది కృషి వల్ల 97 మెగావాట్లకు చేరింది. జలాశయాల్లోకి వరద నీరుమాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఆంధ్రా , ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నెల రోజలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు జలాశయాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. » డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా బుధవారం నాటికి 2,579 అడుగులుగా నమోదు అయింది. » జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా మంగళవారం నాటికి 2,725 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజు 2,697 అడుగుల మేర నీరు ఉంది.మాచ్ఖండ్ ప్రాజెక్ట్ వివరాలుమొత్తం యూనిట్లు : 6 పనిచేస్తున్నవి : 5 మొత్తం సామర్థ్యం : 120 మెగావాట్లు ప్రస్తుత ఉత్పాదన : 97 మెగావాట్లు కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో గతంలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం నీటి నిల్వలు పెరుగుతున్నందున విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉంది. నాలుగో నంబరు జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదనకు ఆస్కారం ఉంది. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ,మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
అసలేం జరిగింది?
కిడ్నీ ఆపరేషన్పై మాచ్ఖండ్ పోలీసుల దర్యాప్తు బాధితుడి అనుమతితోనే తొలగింపు: ఆశాకిరణ ఆస్పత్రి జయపురం(భువనేశ్వర్): జయపురం సమితి అంత గ్రామానికి చెందిన ఘాసీనాగ్ కిడ్నీ మాయంపై మాచ్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నీలో ఉన్న రాళ్లు తొలగించాలని ఆస్పత్రికి కిడ్నీ మాయం చేశారని లమతాపుట్ ఆశ కిరణ్ ఆస్పత్రిపై మాచ్ఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. మాచ్ఖండ్ పోలీసు స్టేషన్ అధికారి బినోద్ కుమార్ మల్లిక్, ఏఎస్సై ప్రదీప్ కుమార్ నాయక్, లమతాపుట్ ఏఎస్సై శివప్రశాంత షడంగి దర్యాప్తు చేపట్టారు. లమతాపుట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్కు వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రి అధికారులు డాక్టర్ మాథ్యూ, డాక్టర్ వినోద్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్న తాను కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమీపంలోని ఆశకిరణ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని ఘాసినాగ్ తెలిపాడు. కిడ్నీలో రాళ్లు తొలగించాలని చెప్పి కిడ్నీ తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణపై ఆస్పత్రి యాజమాన్య వర్గాలను పోలీసులు ప్రశ్నించారు. బాధితుడి అనుమతితోనే ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించామని చెప్పినట్లు తెలిసింది. ఘాసీనాగ్ తమ ఆస్పత్రికి నాలుగు సార్లు వచ్చాడని డాక్టర్ మాథ్యూ చెప్పారని తెలిసింది. తొలిసారి 2013 జూన్11న వచ్చాడని, అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ఉందని, రెండో సారి వచ్చినపుడు అల్ట్రా సౌండ్ చేస్తే ఎడమ కిడ్నీ పాడైనట్లు గుర్తిచామని చెప్పారు. కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలని సూచించామని, ఆగస్టు 9న ఎక్స్రే తీసి చూస్తే ఎడమ కిడ్నీ పూర్తిగా పాడైందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఇతర అవయవాలకు నష్టమని చెప్పామని పోలీసులకు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదని చెప్పాడంతో 2013 సెప్టెంబర్ 7న ఘాసీనాగ్, మామ రఘునాగ్ సమ్మతితో ఆపరేషన్ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు సమర్పించినట్లు తెలిసింది. ఘాసీ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేలు మాత్రమే తీసుకున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా, ఆస్పత్రి చెబుతున్నదంతా అవాస్తవమని బాధితుడు పేర్కొన్నాడు.