breaking news
kill passwords
-
ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాపై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 44 మంది మరణించారు. అల్–బురైజ్లో ఒక్కఇంటిలోనే ఏకంగా 23 మంది మరణించారు. దక్షిణ గాజాలోని అమెరికా సహాయ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ కాల్పుల్లో ఇద్దరు మరణించగా చాలామంది గాయపడ్డారు. హమాస్కు సహాయ సామగ్రి అందకుండా చేసేందుకు అమెరికా మద్దతుతో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్ని ఐరాసతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్ అన్ని నైతిక, చట్ట పరమైన హద్దులు దాటుతోందని జోర్డాన్ మండిపడింది. ఒక సంచి పిండి కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజా అంతటా డజన్ల కొద్దీ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇంకా ఆకలి కేకలే రెండు నెలల పై చిలుకుకు దిగ్బంధం తర్వాత గాజాలోకి ఇప్పుడిప్పుడే మానవతా సాయం చేరుతోంది. ఇజ్రాయెల్ పరిమిత అనుమతితో ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్నట్టు ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ భద్రతా మండలికి తెలిపారు. దాని పంపిణీకి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఐరాస తెలిపింది. అయినా గాజాలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. విరమణకు మరో ప్రతిపాదన గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం హమాస్ తన వద్ద సజీవంగా ఉన్న 10 మంది ఇజ్రాయెలీ బందీలను అప్పగించాలి. 18 మంది బందీల మృతదేహాలను రెండు దశల్లో ఇజ్రాయెల్కు ఇవ్వాలి. బదులుగా ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణ పాటిస్తుంది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. -
పాస్వర్డులను కాప్సుల్లా మింగేయొచ్చు!
ఇంటర్నెట్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాస్వర్డ్ల పద్ధతి ఇక పాతబడిన విద్యే. మన కంప్యూటర్ మనల్ని గుర్తించేందుకు మన శరీరంలోనే పాస్వర్డ్లు దాగి ఉంటాయనేది రేపటి సాంకేతిక పరిణామం. ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'పేపాల్' ఈ దిశగా కసరత్తును ప్రారంభించింది. కాప్సుల్స్ రూపంలో పాస్వర్డ్లను, ఇతర మైక్రోచిప్లను మింగేసే టెక్నాలజీపై పేపాల్కు చెందిన డెవలపర్ జొనాథన్ లెబ్లాంక్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈదిశగా ఇప్పటికే ఆయనెంతో విజయం సాధించారు. ఆయన ఇటీవల తన ప్రయోగాలపై 'కిల్ ఆల్ పాస్వర్డ్స్' పేరిట ఓ ప్రయోగాత్మక ప్రదర్శన ఇచ్చినట్టు 'వాల్స్ట్రీట్ జర్నల్' తెలియజేసింది. ఆయన చర్మం కింద మైక్రోచిప్లు, మైక్రోఫోన్స్ అమర్చుకొని వాటి పనితీరును ప్రదర్శించి చూపారు. కాప్సుల్ రూపంలో తయారుచేసిన పాస్వర్డ్, నానోచిప్స్ కలిగిన పరికరాన్ని చూపించారు. ఆ క్యాప్సుల్ను మింగేస్తే చాలట. అది మన శరీరంలో భాగమవుతుంది. శరీరంలో అంతర్భాగమైన పాస్వర్డ్ను కంప్యూటర్ గుర్తిస్తుంది. బ్రెయిన్లో కూడా కంప్యూటర్ చిప్స్ను అమర్చుకోవచ్చని, వాటిని పాస్వర్డ్ల కోసమే కాకుండా ఇతర కంప్యూటర్ అవసరాల కోసం, డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా కూడా పాస్వర్డ్లను మానవ శరీరంలో భద్రపర్చుకోవచ్చని ఆయన తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, సాంకేతిక పరికరాలను మింగేయొచ్చని, శరీరంలోని రక్తంలో, నరాలతో వాటిని మిళితం చేయొచ్చని లెబ్లాంక్ వివరించారు. ఓ మనిషి గుర్తింపునకు ఆ మనిషి బొటన వేలు ముద్రలు, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ పద్ధతులు ఇక పాతబడినవేనని, మన శరీరంలో కలిసిపోయిన పాస్వర్డ్లే మన గుర్తింపునకు దోహదపడతాయని వివరించారు. ఇంటర్నెట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు సగటున 16 పాస్వర్డ్లు గుర్తించుకోవాల్సి వస్తుందని, అన్నింటిని గుర్తించలేక సతమతమవుతున్న వారు కూడా ఎక్కువమందే ఉన్నారని, వారి సౌకర్యార్థం ఈ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టినట్టు 'పేపాల్' సంస్థ పేర్కొంది. అయితే మానవ శరీరంలో కలిసిపోయే ఈ సరికొత్త పరికరాలను ఇప్పుడే అందుబాటులోకి తీసుకరావాలనే ఉద్దేశం తమ కంపెనీకి లేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని లెబ్లాంక్ వివరించారు.