breaking news
Kaveri River water
-
కర్ణాటకలో ‘ కాలా’ కష్టాలు
బెంగళూరు: కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తలైవా తాజా చిత్రం ‘ కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వాఖ్యలపట్ల కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ‘ కాలా’ చిత్రాన్ని ప్రదర్శించరాదని నిర్ణయించుకుంది. కావేరీ జలాలపై రజనీ వాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని దీంతో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ఫిల్మ్ఛాంబర్ తెలిపింది. తమిళనాడుకు కావేరీ జలాలను తక్షణమే విడుదల చేయాలని రజనీకాంత్ గతంలో కోరిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందారు. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. కావేరి మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నటుడు ధనుష్ తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం. ఇక నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారత చూపించలేదు. మరి ఈ సూపర్స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది. -
జోక్యం చేసుకోం
కావేరి జలాల విషయంలో, మేఘదాతు డ్యాంల నిర్మాణంలో కర్ణాటక ప్రయత్నాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఇది డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం రేపుతోంది. సాక్షి, చెన్నై : తమిళనాడుకు కావేరి జలాల పంపిణీలో ప్రతి ఏటా కర్ణాటక సర్కారు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న విషయం తెలి సిందే. తాజాగా ఆ నీటిని అడ్డుకునే రీతిలో మేఘదాతులో డ్యాంల నిర్మాణానికి కసరత్తు ల్లో పడింది. దీనిపై రాష్ర్టంలో ఆగ్రహజ్వాల రగిలింది. ఎట్టకేలకు ప్రతి పక్షాలు ఓ వైపు, అధికార పక్షం మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని జోక్యం చేసుకోవాలని విన్నవించారు. డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరాయి. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చి పంపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మంగళవారం కోయంబత్తూరుకు వచ్చిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ చేసిన వ్యాఖ్యలు అన్నదాతల్లో , రైతు సంఘాల్లో, ప్రతి పక్ష పార్టీల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. జోక్యం చేసుకోం: కోయంబత్తూరు పీల మేడులో ఈసా సంస్థ నేతృత్వంలో 43 లక్షల మొక్కల నాటడం లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇప్పటికే 33 శాతం మేరకు మొక్కల్ని నాటి ఉన్నారు. ఈఏడాదికిగాను మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రకాష్ జవదేక ర్ కావేరి జలాల విషయంలో, మేఘదాతులో డ్యాంల నిర్మాణ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోబోదని వ్యాఖ్యానించారు. ఈ రెండు సమస్యలు రాష్ట్రాలకు సంబంధించిందని, వారి హక్కుల విషయంలో కేంద్రం వేలు పెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. రెండు నాల్కల ధోరణితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పయనిస్తున్నట్టుందని విమర్శిస్తున్నారు. ఇక, ప్రతి పక్షాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఉన్నాయి. బాధ్యత గల మంత్రి జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కారణంగా మళ్లీ రాష్ట్రంలో ఆందోళనలు బయలు దేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కర్ణాటకకు నోటీసు : ఇదిలా ఉండగా, కావేరి నదిలో మురికి నీరు కలుస్తుండడంపై పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. న్యాయవాది సుదన్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారణకు స్వీకరించింది. ఆ నదిలో ఏడాదికి 148 కోట్ల లీటర్ల మురికి కలుస్తున్నదని, కర్ణాటకలోని అనేక సంస్థలు ఆ నదిలోకి మురికి నీటిని వదలి పెడుతున్నాయని తన పిటిషన్లో ఆయన వివరించారు. దీనిని పరిశీలించిన చెన్నైలో ట్రిబ్యునల్ కర్ణాటక సర్కారుకు నోటీసులు జారీ చేసింది. జూలై 28లోపు వివరణ ఇవ్వాలని, మురికి నీరు కలుపుతున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది. అలాగే, తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తూ, మురికి నీటి అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పైమ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.