-
అతి పెద్ద పాదరక్షలు ఇవే..
హాయ్ పిల్లలూ.. దాదాపు రెండున్నర అడుగుల పొడవు.. ఒక అడుగు వెడల్పు ఉండే పాదరక్షలను ఎక్కడైనా మీరు చూశారా? ఇంత పెద్ద రక్షలు ఎక్కడున్నాయి.. వీటిని ఎవరు వేసుకుంటారు? అనే అనుమానాలు మీకు వస్తున్నాయి కదూ? అయితే మీరు తప్పకుండా కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఒకసారి దర్శించుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత పెద్ద పాదరక్షలు ఉండేది అక్కడి ఆలయంలోనే కాబట్టి. అసలు ఈ పాదరక్షల వెనుక ఓ పెద్ద కథే ఉంది సుమా! అదేమంటారా? అయితే ఇది చదవండి.. పూర్వం కర్నూలు జిల్లా కోసగి గ్రామానికి చెందిన ఓ కుటుంబం చాలా కాలంగా కష్టాల్లో ఉండేది. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని తమ కష్టాలు తీరితే స్వామికి జత పాదరక్షలు సమర్పించుకుంటామని మొక్కుకున్నారు. ఆశ్చర్యకరంగా వారి కష్టాలు ఒకదాని వెనుక తీరిపోయాయి. దీంతో ఆనందభరితులైన వారు స్వామి వారికి ఇంత పెద్ద పాదరక్షలు చేసి సమర్పించారు. నేటికీ ఆ కుటుంబానికి చెందిన సంతతి స్వామి వారికి ప్రతిఏటా పాదరక్షలను సమర్పిస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద ఉండే ఈ పాదరక్షల స్పర్శ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. - గుంతకల్లు -
లభ్యమైన రూ.2.43 లక్షల చెల్లని నోట్లు
గుంతకల్లు రూరల్ : హుండీ లెక్కింపులో రూ.2.43 లక్షల చెల్లని నోట్లు లభించినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో ఆనందకుమార్ తెలిపారు. ఈ నోట్ల వివరాలను దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.19.75 లక్షలు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. ఆలయంలో ఉన్న 24 హుండీలను లెక్కించగా మొత్తం రూ.19.75 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద కుమార్ తెలిపారు. అంతేకాక ఎనిమిది గ్రాముల బంగారం, ఒక కేజీ 110 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాక అన్నదాన హుండీ ద్వారా రూ.25,520 నగదు వచ్చింది. కార్యక్రమంలో ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు, పాలకవర్గం, ఆర్టీసీ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి, హనుమాన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
నెట్టికంటుడిని దర్శించుకున్న ఢిల్లీ డీఐజీ
గుంతకల్లు రూరల్ : ఢిల్లీ డీఐజీ యామినీ ప్రియ గురువారం కుటుంబసమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన యామినీ ప్రియ ప్రస్తుతం ఢిల్లీ డీఐజీగా పని చేస్తున్నారు. యామినీ ప్రియ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
నెట్టికంటుడి ఆదాయం రూ. 24.39 లక్షలు
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ద్వారా రూ.24.39 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. గురువారం ఆలయంలో ఈఓతో పాటు ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు, పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయంలోని 24 హుండీలు లెక్కించారు. 37 రోజులకు సంబంధించి రూ.24,39,790 నగదుతో పాటు 3 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.14,828 నగదు అందిందని ఈఓ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement