breaking news
Kaanchi
-
హీరోయిన్తో ఆ సీన్ కోసం 37 టేకులు.. హీరోకే చిరాకు వచ్చిందట!
తెరమీద రొమాన్స్ పండిచడం అనేది అంత ఈజీ పని కాదు. హీరోహీరోయిన్లు మధ్య కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. అయితే ఇలాంటి సీన్స్ దాదాపు సింగిల్ టేక్లో క్లోజ్ చేస్తుంటారు. ఏదైనా తేడా ఉంటే ఒకటి, రెండు టేకులు తీసుకుంటారు. కానీ ఓ సినిమాలో ముద్దు సీన్ కోసం హీరోహీరోయిన్లు 37 టేకులు తీసుకున్నారు. దర్శకుడు అనుకున్న విధంగా సీన్ రాకపోడంతోనే లన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. (చదవండి: పేరుకే బుల్లితెర నటి.. కోట్ల సంపాదన.. ఆ యంగ్ బ్యూటీ ఎవరంటే?)అయితే ఆ లిప్ సీన్ అన్ని టేకులు తీసుకోవడానికి కారణం హీరోయినే అని చెబుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ కామీషు అంటే.. 2014 లో వచ్చిన కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan), మిస్తి చక్రవర్తి జంటగా నటించారు. సుభాష్ గయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఒక లిప్ లాక్ కోసం ఏకంగా 37 టేకులు చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో కార్తీక్ ఆర్యనే చెప్పాడు. ‘ముద్దు సీన్ కూడా తలనొప్పిగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కాంచి సినిమాలో ఓ కిస్ సీన్ ఉంటుంది. లవర్స్గా నటించిన మిస్తి, నేను ముద్దు పెట్టుకోవాలి. షూటింగ్ ప్రారంభమైంది. ఇద్దరం కలిసి కిస్ చేసుకున్నాం. కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు. కట్ చెప్పేసి మళ్లీ ముద్దు పెట్టుకోమన్నాడు. అలా మొత్తంగా 37 టేకులు తీసుకున్న తర్వాత ‘ఓకే’ చెప్పాడు.(చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ అలీ.. వీడియో వైరల్!)అయితే అన్ని టేకులు తీసుకోవడంతో నా తప్పేమి లేదు. కానీ మిస్తి ఎక్కన నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని కాస్త భయపడ్డాను. దర్శకుడు చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నాం. అయినా ఆయన కట్ చెప్పేశాడు. ఒకనొక దశలో నాకే చిరాకు వేసింది. ‘నాకు ముద్దు పెట్టుకోవడం రావట్లేదు. ఎలా పెట్టుకోవాలో మీరు చేసి చూపించండి సార్’ అని డైరెక్టర్ని అడగాలనిపించింది(నవ్వుతూ) అని కార్తిక్ చెప్పారు. అయితే ఈ ముద్దు సీన్ గురించి మిస్తి ఎక్కడ మాట్లాడలేదు. కానీ హీరో కార్తినే తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంచి చిత్రం విషయానికొస్తే.. 2014లో ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, రిషి కపూర్, ఆదిల్ హుస్సేన్, ముఖేష్ భట్ కీలక పాత్రలు పోషించారు. -
కాంచీ విడుదలకు తొందరేం లేదు: సుభాష్ ఘాయ్
తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు. సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.