-
‘జువనైల్’ వయసు16కు తగ్గింపు
* బాల నేరస్తుల సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే * వామపక్షాల వాకౌట్; కలిసొచ్చిన కాంగ్రెస్ * బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే * ‘జువనైల్’ వయస్సు 16కు తగ్గింపు * రేప్ లాంటి హేయ నేరాలకు పాల్పడే 16 -18 ఏళ్ల పిల్లలకు కఠిన శిక్షలు * చర్చను గ్యాలరీ నుంచి వీక్షించిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు న్యూఢిల్లీ: అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన 16 నుంచి 18 ఏళ్ల వయసున్న మైనర్లను పెద్దలకు ఉద్దేశించిన చట్టాల ప్రకారం విచారించాలన్న సవరణతో కూడిన జువనైల్ జస్టిస్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అంతకుముందు, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వామపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి రాజముద్రతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. దీని ప్రకారం ఇకపై హత్య, రేప్ వంటి పాశవిక నేరాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన మైనర్లకు వయోజనులకుద్దేశించిన చట్టాల ప్రకారమే శిక్ష విధిస్తారు. ఢిల్లీ గ్యాంగ్రేప్ దోషి జువనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల శిక్షే అనుభవించి ఆదివారం విడుదలవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో.. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లు ఆమోదం విషయంలో అధికారపక్ష, విపక్షాలపై ఒత్తిడి నెలకొంది. బిల్లుపై చర్చను ఢిల్లీ గ్యాంగ్రేప్ బాధితురాలు ‘నిర్భయ’ జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీసింగ్ పాండేలు గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆమోదం ఆర్నెళ్ల క్రితమే జరిగుంటే నా కూతురిపై అత్యంత పాశవికంగా దాడి చేసినవాడు విడుదలై ఉండేవాడు కాద’ని ఆశాదేవి అన్నారు. 15 ఏళ్ల బాలుడు ఈ నేరం చేస్తే..? ‘జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) బిల్’ను మహిళ, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ సభలో ప్రవేశపెట్టారు. మరింత అధ్యయనం అవసరమంటూ సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరాయి. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ చర్చను ప్రారంభిస్తూ.. ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత ఆవశ్యకమన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆశాదేవి.. తన కూతురి గురించే కాకుండా, దేశంలో మరో నిర్భయ ఘటన జరగొద్దనే పట్టుదలతో పోరాటం చేస్తున్నారు’ అని ప్రశంసించారు. ‘రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నసమయంలో బాల నేరస్తుల చట్టం వచ్చింది. అప్పుడు కనీస వయస్సుగా 16 ఏళ్లనే నిర్ధారించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం దాన్ని 18 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ రాజీవ్ ప్రతిపాదించిన 16 ఏళ్లకు మారుస్తోంది’ అన్నారు. సెంటిమెంట్ ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ‘ఒకవేళ 15 ఏళ్ల 11 నెలల వయసున్న బాలుడు ఇలాంటి నేరానికి పాల్పడితే.. మళ్లీ జువనైల్ నిర్వచనాన్ని మారుస్తారా? ఉగ్రవాద సంస్థ ఐఎస్ 14 ఏళ్ల పిల్లలను కూడా చేర్చుకుంటోంది. జువనైల్ వయస్సును 14కు తగ్గిస్తారా?’ అని ప్రశ్నించారు. సమగ్రం.. సంవేదనాత్మకం.. బిల్లు సంవేదనాత్మకంగానూ, సమగ్రంగానూ ఉందని మేనక పేర్కొన్నారు. బాలలు పాల్పడుతున్న తీవ్రమైన నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలతో వివరించారు. ఒక్క ఢిల్లీలోనే రేప్ తరహా నేరాలకు పాల్పడి, అరెస్టైన 16 ఏళ్లు పైబడిన బాలుర సంఖ్య వెయ్యికి పైగా ఉందన్నారు. ‘నిర్భయ కేసులో దోషిగా తేలిన బాలనేరస్తుడి విషయంలో ప్రస్తుతం మనమేం చేయలేకపోవచ్చు. కానీ ఈ బిల్లుతో ఇంకెందరో బాలలు అలాంటి ఘాతుకాలకు పాల్పడకుండా అడ్డుకోగలం’ అన్నారు. ఈ బిల్లు యూపీఏ హయాంనాటిదేనని గుర్తు చేశారు. ఇది బాలల భద్రతకు, పరిరక్షణకు ఉద్దేశించినదన్నారు. రూపకల్పన సమయంలో నిర్భయ కేసును విచారించిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల సూచనలను తీసుకున్నామన్నారు. అవిద్య, పేదరికమే ఇలాంటి నేరాలకు కారణమనలేమని చదువుకున్నవారు, సంపన్నుల పిల్లలూ ఈ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. స్వీడన్ లాంటి సంపన్న దేశంలోనూ మైనర్లు రేప్లకు పాల్పడుతున్న ఘటనలున్నాయన్నారు. త్వరలో ప్రతీగ్రామంలోనూ ప్రత్యేక మహిళా పోలీసు అధికారులను నియమిస్తామన్నారు. బిల్లు ఆమోదం పొందడంలో సహకరించిన విపక్షాలక కృతజ్ఞతలు తెలిపారు. మేనకా గాంధీ వివరించిన బిల్లులోని కీలకాంశాలు.. నిందితుడైన ఏ ఒక్క బాలుడు నేరుగా జైలుకు వెళ్లడు. మొదట ఆ బాలుడు.. చిన్నపిల్లల చేష్టగా భావించి నేరం చేశాడా? లేక పెద్దల తరహా మనస్తత్వంతో నేరానికి పాల్పడ్డాడా? అనేది జువనైల్ జస్టిస్ బోర్డులోని మానసిక నిపుణులు నిర్ధారిస్తారు. దోషిగా నిర్ధారించిన తరువాత మొదట అతడిని బాలనేరస్తుల పరివర్తన కేంద్రం(బోర్స్టల్)కు పంపిస్తారు. 21 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ఆతడి మానసిక ఆరోగ్యం, సామాజిక స్పందనలను పరీక్షిస్తారు. ఆ తరువాత పెద్దల జైలుకు పంపే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. -
బాలనేరస్తుల సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. మంగళవారం రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. బాలనేరస్తుల వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించారు. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును లోక్సభ ఇదివరకే ఆమోదించిన సంగతి తెలిసింది. తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించడంతో రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశాక బిల్లు చట్టరూపం దాల్చనుంది. మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. పెద్దవాళ్లలా తీవ్రమైన నేరాలకు పాల్పడే మైనర్ల విషయంలో వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ ఈ సవరణనను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బిల్లును పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకి సమీక్ష కోసం పంపాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి సూచించారు. కానీ రాజ్యసభ దాన్ని ఆమోదించకపోవడంతో సీపీఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఇటీవలి కాలంలో మైనర్లు పాల్పడిన క్రూరమైన నేరాల చిట్టాను ఆమె సభలో చదివి వినిపించారు. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో జ్యోతి సింగ్ పాండే (నిర్భయ) తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీనాథ్ కూడా సభకు విజిటర్లుగా హాజరయ్యారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో దారుణమైన సామూహిక అత్యాచారానికి గురైన జ్యోతి సింగ్.. 13 రోజుల తర్వాత సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మైనర్ నిందితుడిని ఇటీవల బాల నేరస్థుల సంస్కరణ కేంద్రం నుంచి మూడేళ్ల తర్వాత విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
Advertisement