కొనసాగుతున్న జనగామ బంద్
జనగామ: జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో శనివారం పట్టణంలో బంద్ కొనసాగుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు, సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. స్థానికంగా భారీ ర్యాలీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు చేపట్టారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బచ్చన్నపేట, మద్దూరు, నర్మెటలో కూడా బంద్ పాటిస్తున్నారు.