breaking news
Indira Talwani
-
మసాచుసెట్స్ జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దక్షిణాసియాకు చెందిన మరో వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతి మహిళ ఇందిరా తల్వానీని మసాచుసెట్స్ జిల్లా జడ్జిగా నియమించారు. ఫస్ట్ సర్క్యూట్కు నామినేట్ అయిన తొలి సౌత్ ఏషియా మహిళ ఇందిరానే. ఆమె ప్రస్తు తం బోస్టన్లోని సీగల్రోయిట్మాన్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు. సివిల్ లిటిగేషన్ కేసుల్లో రాష్ట్ర, ఫెడరల్ ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్ను కొనసాగిస్తున్నారు. 1988లో ఉత్తర కాలిఫోర్నియా జిల్లా కోర్టు జడ్జి స్టాన్లీ ఏ వెజైల్ దగ్గర లా క్లర్క్గా ఇందిరా లీగల్ కెరీర్ను ఆరంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, ఒబామా నామినేట్ చేసిన దక్షిణాసియాకు చెందిన వారిలో ఇందిరా మూడో వ్యక్తి కావడం విశేషం. గతంలో దక్షిణాసియాకు చెంది న విన్స్ ఛాబ్రియాను ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జిగా, మనీష్ షాను ఉత్తర ఇల్లినాయిస్ జిల్లా జడ్జిగానూ ఒబామా నియమించిన విషయం తెలిసిందే. -
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ
అమెరికా (యూఎస్)లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఆమెను నామినేట్ చేశారు. భారత సంతతి వ్యక్తి మనీష్ షాను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా మహిళ ఇందిర కావడం విశేషం. ఇందిర ప్రస్తుతం బోస్టన్లోని సెగల్ రొటిమన్ ఎల్ఎల్పీలో విధులు నిర్వహిస్తోంది. అక్కడే రాష్ట్ర ఫెడరల్ ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసింది. పదోన్నతిపై మసాచూసెట్స్లో న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తారనే నమ్మకముందని ఒబామా అన్నారు.