65 నుంచి 40కు...
బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 28 మంది సీనియర్ ప్లేయర్లు కోర్ గ్రూప్ ప్రాబబుల్స్లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. భారత మహిళల హాకీ కోర్ గ్రూప్ ప్రాబబుల్స్: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్డుంగ్, సుమన్ దేవి (డిఫెండర్స్). సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, బల్జీత్ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్ (మిడ్ ఫీల్డర్స్). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్నీత్ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్ అటా్పడ్కర్ (ఫార్వర్డ్స్).