Indian womens hockey squad
-
భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
ఏప్రిల్ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు సవితా పూనియా (గోల్ కీపర్), దీపిక (ఫార్వర్డ్) ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు. సలీమా టేటే కెప్టెన్గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్ కీపర్గా బిచు దేవి ఎంపికయ్యారు.డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్, రుతుజా దాదాసో పిసాల్, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్దుంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్ వ్యవహరించనున్నారు.ఈ సిరీస్ భారత జట్టుకు హాకీ వరల్డ్ కప్ 2026, ఆసియా గేమ్స్కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. -
65 నుంచి 40కు...
బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 28 మంది సీనియర్ ప్లేయర్లు కోర్ గ్రూప్ ప్రాబబుల్స్లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. భారత మహిళల హాకీ కోర్ గ్రూప్ ప్రాబబుల్స్: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్డుంగ్, సుమన్ దేవి (డిఫెండర్స్). సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, బల్జీత్ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్ (మిడ్ ఫీల్డర్స్). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్నీత్ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్ అటా్పడ్కర్ (ఫార్వర్డ్స్). -
వందనకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ గా ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా నియమితురాలైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫికి 18 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్లేయర్ సునీత లక్రా వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫి ఈ నెల 29 నుంచి నవంబర్ 5 వరకు సింగపూర్ లో జరగనుంది. జపాన్, భారత్, చైనా, కొరియా, మలేసియా జట్లు ఈ టోర్నమెంట్ లో ఆడనున్నాయి. కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల వందన సంతోషం వ్యక్తం చేసింది. "ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. జట్టు బలాలు, బలహీనతల గురించి మాకు తెలుసు. సమిష్టిగా, వ్యక్తితంగా మా ఆటను మెరుగుపరుచుకుని సత్తా చాటాలని భావిస్తున్నామ'ని వందన చెప్పింది. శాయ్ ఆధ్వర్యంలో భోపాల్ లో ప్లేయర్స్ కు శిక్షణ శిబిరం నిర్వహిస్తామని చీఫ్ కోచ్ నీల్ హాగూడ్ తెలిపారు. మహిళల హాకీ జట్టు వందన కటారియా(కెప్టెన్), సునీత లక్రా(వైస్ కెప్టెన్), సవితా, రజనీ(గోల్ కీపర్స్), దీప గ్రేస్ ఎక్కా, రేణుకా యాదవ్, నమితా టోప్పో, రాణి రాంపాల్, నిక్కీ ప్రదాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, పూనం రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనం బార్లా, హైనియలామ్ లాల్ రౌత్ ఫెలి


