breaking news
Indian Council of Medical
-
13న మెడికల్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్!
ప్రాథమిక చర్చలు జరిపిన ఇరు రాష్ట్రాల అధికారులు 6న మరోసారి భేటీ, 13న నోటిఫికేషన్ ఈ ఏడాదికి పాత ఫీజులతోనే సీట్లు భర్తీ ప్రవాస భారతీయ కోటాకు ఫీజు నిర్ధారణ ఎస్వీ, ఎన్టీఆర్ వర్శిటీ, జేఎన్టీయూలలో కౌన్సెలింగ్ హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు 13న మెడికల్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల అధికారులు సూచనప్రాయ అంగీకారానికి వచ్చారు. ఎంబీబీఎస్ ఫీజులు నిర్ణయం జరగలేదని, ఫీజు రీయింబర్స్మెం ట్ వివాదం కారణంగా రెండు రాష్ట్రాలు నువ్వా నేనా అంటూ కౌన్సెలింగ్కు ముందుకు రాలేదు. అయితే భారతీయ వైద్యమండలి నిర్ణయం మేరకు సెప్టెంబర్ 30లోగా అన్ని దశల కౌన్సెలింగ్లు పూర్తిచేసి, తరగతులు ప్రారంభించాలని నిబంధన ఉంది. ఆ లోగా పూర్తి కాకపోతే సీట్లు రద్దవుతాయి. దీంతో ఉభయ రాష్ట్రాల అధికారులు శనివారం ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఈనెల 6న మళ్లీ ఒకసారి ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ కానున్నారు. ఈనెల 13న నోటిఫికేషన్ ఇవ్వాలని ఆరోజు వీలుకాకపోతే ఆగస్ట్ 14న ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కౌన్సెలింగ్ తేదీ తర్వాత నాలుగు రోజుల్లో భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. గతంలో లాగే ఎస్వీఆర్ కళాశాల తిరుపతి, విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, హైదరాబాద్లోని జేఎన్టీయూలలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. పాత ఫీజులతోనే సీట్ల భర్తీ ఈ ఏడాది పాత ఫీజులతో భర్తీ చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చారు. ఈమేరకు ఆయా ప్రైవేటు కళాశాలలకు సైతం సమాచారమిచ్చారు. ఏఎఫ్ఆర్సీ నిర్ణయించినట్టు ఇప్పటికిప్పుడు ప్రత్యేక ప్రవేశ పరీక్ష, కామన్ ఫీజు విధానాలు అమల్లోకి తేలేమని, పాత ఫీజులతోనే ఈ ఏడాది భర్తీ చేద్దామని వారికి చెప్పారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బి.కేటగిరీ కోటాకు రూ.2.40 లక్షలు, యాజమాన్యకోటా సీట్లకు రూ.5.50 లక్షలు వసూలు చేస్తున్నారు. అలాగే డెంటల్ సీట్ల విషయంలో కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.45 వేలు, బి.కేటగిరీ సీట్లకు రూ.1.30 లక్షలు, యాజమాన్య కోటా సీట్లకు రూ.2.50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అంటే 2014-15 విద్యా సంవత్సరానికి కూడా ఉభయ రాష్ట్రాల్లో అవే ఫీజులు ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటాకూ ఏడాదికి 25వేల డాలర్లు ప్రవాస భారతీయ విద్యార్థుల కోటాకు ఏడాదికి 25 వేల డాలర్లు ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో ఏడాదికి రూ.15 లక్షలు అవుతుంది. గతంలో ఇచ్చిన జీవో ఆధారంగానే ఎన్ఆర్ఐ సీట్ల భర్తీ చేసుకోవాలని, ఎన్ఆర్ఐ కోటా ఫీజు పై ఇంకా ప్రైవేటు కళాశాలలను సంప్రదించాల్సి ఉంద ని ఓ ఉన్నతాధికారి చెప్పారు. యాజమాన్య సీట్ల భర్తీలోనూ ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చి, ఎంసెట్ మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేసుకునేలా చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఫీజు రీయిం బర్స్మెంట్పై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. -
ఇంటర్ మార్కులతో ఎంబీబీఎస్సా?
యాజమాన్య సీట్ల భర్తీ కుదరదు: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే ప్రయత్నాలను భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తిరస్కరించింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆధ్వర్యంలో పరీక్ష ద్వారానే ఎంపిక జరగాలని సూచించింది. ఈ మేరకు 2013లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు ఎంసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పోస్ట్ మెట్రిక్యులేషన్ పూర్తవగానే ఎంబీబీఎస్లో చేరడమనేది విరుద్ధమని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రవాస భారతీయులకు 15 శాతం కోటా మినహాయించి మిగతా 85 శాతం ప్రైవేటు సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేయనున్నట్లు వార్తలు రావటంపై ఎంసీఐ వర్గాలు స్పందించాయి. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై హెచ్చరిస్తూనే ఉన్నామని ఎంసీఐ అధికారి ఒకరు తెలిపారు. కచ్చితమైన విధివిధానాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రైవేట్ కళాశాలలే ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవాలని చెప్పామన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన ఎంసీఐ నిబంధనలు మారవని స్పష్టం చేశాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్లో ప్రవేశాలు సరికాదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. పరీక్షలు నిర్వహించుకోలేకపోవడం, సకాలంలో కౌన్సెలింగ్ చేయలేకపోవడమనేది విద్యార్థుల తప్పిదం కాదని, అది కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే అవుతుందని ఎంసీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై విధివిధానాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీ, అకడమిక్ క్యాలెండర్ తదితర విషయాలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక ఇవ్వనున్నట్టు భారతీయ వైద్యమండలి అధికారి చెప్పారు.