breaking news
India inflation
-
Srilanka Crisis.. భారత్కు ‘లంక’ గతే: రాహుల్ గాంధీ
ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో లంకేయులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. భారత్ కూడా చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోందంటూ ఓ గ్రాఫ్ను చూపిస్తూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందోని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ క్రమంలో బుధవారం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. భారత్ చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోంది. రెండు దేశాల్లో నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింసకు సంబంధించిన గ్రాఫ్ను పోస్ట్ చేసి.. ఇవి తీవ్ర స్తాయికి చేరుకున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రజల చూపును పరిస్థితుల నుంచి మళ్లించడం వల్ల నిజాలు అబద్ధాలు కాలేవు.. అంటూ కామెంట్స్ చేశారు. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన డేటా ఆధారంగా ఈ గ్రాఫ్లను రూపొందించినట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు.. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ దొరక్క అల్లాడుతున్న జనం వంట చేసుకునేందుకు కిరోసిన్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరోవైపు.. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్ కొనేందుకు తమ వద్ద డబ్బుల్లేవని లంక సర్కార్ చేతులెత్తేసింది. ప్రజలు.. పెట్రోల్ కోసం బంకుల వద్దకు రావద్దొని తెలిపింది. దీంతో ప్రభుత్వం తీరుపై లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM — Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022 -
భారతదేశం ద్రవ్యోల్బణ అంచనాలు
గ్రూప్స్ ప్రత్యేకం జె.ఎం.కీన్స ప్రకారం ‘ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణోద్యోగిత సిద్ధించిన తర్వాత ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం’ అంటారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు ప్రభుత్వం దవ్య, కోశ విధానాలతోపాటు ఇతర చర్యలు తీసుకుంటుంది. 2004-05 ఆధార సంవత్సరంగా టోకు ధరల సూచీని నిర్ణయించడానికి 676 వస్తువులను పరిగణనలోకి తీసుకున్నారు. మనదేశంలో ద్రవ్యోల్బణం రేటును తెలుసుకునేందుకు టోకు ధరల సూచీ (గిజిౌ్ఛట్చ్ఛ ్కటజీఛ్ఛి ఐఛ్ఛ్ఠీగ్కిఐ)ని ఉపయోగిస్తున్నారు. డాల్టన్ ప్రకారం ‘అధిక ద్రవ్యం అతి తక్కువ వస్తువులను వెంటాడటమే ద్రవ్యోల్బణం’. హాట్రే ప్రకారం ‘అధికంగా కరెన్సీని జారీచేయడమే ద్రవ్యోల్బణం’. ఇర్వింగ్ ఫిషర్ ప్రకారం‘అందుబాటులో ఉన్న వస్తువుల సప్లైలో పెరుగుదల కంటే, ద్రవ్య పరిమాణం పెరుగుదల ఎక్కువగా ఉండటమే ద్రవ్యోల్బణం.’ జె.ఎం.కీన్స ప్రకారం ‘ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణోద్యోగిత సిద్ధించిన తర్వాత ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం’ అంటారు. దీన్నే నిజ లేదా వాస్తవిక ద్రవ్యోల్బణంగా పేర్కొన్నాడు. కీన్స ప్రకారం సంపూర్ణోద్యోగితకు ముందున్న పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ఏర్పడదు. ద్రవ్యోల్బణ తీవ్రతను బట్టి ప్రొఫెసర్ ఆర్.పి. కెంట్ ద్రవ్యోల్బణాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు. 1. పాకే ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 3 శాతం వరకు ఉండటం. 2. నడుస్తున్న ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 3 నుంచి 5 శాతం వరకు ఉండటం. 3. పరుగెడుతున్న ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 5 నుంచి 10 శాతం వరకు ఉండటం. 4. ఉధృత ద్రవ్యోల్బణం (లేదా) అతి ద్రవ్యోల్బణం: ధరల్లో పెరుగుదల 10 శాతానికి పైగా ఉండటం. ఆర్.పి.కెంట్ ప్రకారం పాకే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడూ లాభదాయకమే. నడుస్తున్న ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి హెచ్చరిక వంటిది. ద్రవ్యోల్బణ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ పరిస్థితి ప్రభుత్వానికి సూచిస్తుంది. పరుగెడుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఉధృత ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. అనేక కారణాల వల్ల ఒక దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం తనకొచ్చే రాబడి కంటే వ్యయం ఎక్కువ చేసినప్పుడు ఏర్పడే లోటును పూడ్చుకొనేందుకు కొన్నిసార్లు నూతన ద్రవ్యాన్ని ముద్రిస్తుంది. దీనివల్ల అధిక కరెన్సీ చెలామణీలోకి వచ్చి ధరలు పెరుగుతాయి. ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వల్ల ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో ధరలు పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఒక దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకు ఇతర దేశాల్లో డిమాండ్ పెరిగితే, ఆ దేశ ఎగుమతులు పెరుగుతాయి. ఫలితంగా సంబంధిత దేశంలో ఆయా వస్తువుల లభ్యత తగ్గి అంతర్గత డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం గతంలో ప్రజల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం వల్ల కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ధరలు అధికమవుతాయి. దేశంలో వేగవంతమైన జనాభా పెరుగుదల వల్ల వస్తుసేవల డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వస్తు, సేవలను గుప్తపరచడం వల్ల వాటి ధరలు పెరుగుతాయి. ఉత్పత్తిదారులు ఏకస్వామ్యదారులుగా లేదా పరిమితస్వామ్యదారులుగా ఉన్నప్పుడు పోటీ లేకపోవడం వల్ల వస్తూత్పత్తి వ్యయాల కంటే వస్తు ధరలను అధికంగా పెంచి లాభాలను ఆర్జించేందుకు ప్రయత్నించడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. దీన్నే లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొనొచ్చు. 1. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం 2. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం దీన్నే అధిక డిమాండ్ ద్రవ్యోల్బణం అనీ అంటారు. ప్రభుత్వ వ్యయం, అనుత్పాదక వ్యయం, లోటు బడ్జెట్ తదితరాలు పెరగడం, ప్రత్యక్ష పన్నులు తగ్గడం, ప్రజల వినియోగస్థాయి పెరగడం, నూతన ద్రవ్యం జారీ వంటివి దీనికి కారణాలు. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం దీన్నే నూతన ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. 1950 వరకు ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగానే ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే కార్మికుల వేతనాలు పెరగడం, ఉత్పత్తికారకాల కొరత, ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తిదారుల లాభార్జన తదితరాలు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణాలు. వస్తు డిమాండ్, ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల సంభవించి, ఉత్పత్తిలో తగ్గుదల మూలంగా ధరలు పెరిగితే దాన్ని ‘మిశ్రమ ద్రవ్యోల్బణం’ అంటారు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి ధరలు పెరగడాన్ని స్తంభన ద్రవ్యోల్బణం (్ట్చజజ్చ్టజీౌ) అంటారు. ప్రభుత్వం ప్రత్యక్ష చర్యల ద్వారా లేదా భౌతిక నియంత్రణ ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే దాన్ని ‘అణచివేసిన ద్రవ్యోల్బణం’ అంటారు. ధరలు తగ్గుతున్న పరిస్థితిని ‘ప్రతి ద్రవ్యోల్బణం’ అంటారు. ప్రభుత్వం ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగించి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. అయితే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ద్రవ్య, కోశ విధానాలు పనిచేయవు. చాలా కాలం నిరంతరంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటే అనేక దుష్ఫలితాలు సంభవిస్తాయి. వాటిని ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు. 1. ఉత్పత్తిపై ప్రభావం. 2. పంపిణీపై ప్రభావం ఉత్పత్తిపై ప్రభావం ద్రవ్యోల్బణం వల్ల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు తమ వేతనాల పెరుగుదలను సాధించుకుంటారు. అందువల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి ఉత్పత్తి మందగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చు. పంపిణీపై ప్రభావం ద్రవ్యోల్బణ కాలంలో ధనిక వర్గానికి అనుకూలంగా ఆదాయం, సంపద పునఃపంపిణీ జరుగుతుంది. ఇది ఆదాయ అసమానతలను పెంచుతుంది. ఈ కాలంలో కొద్ది మంది లబ్ధి పొందితే చాలా మంది నష్టపోతారు. ఈ కాలంలో ఉత్పత్తిదారులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, రుణ గ్రహీతలు, రైతులు, ధనవంతులు లబ్ధిపొందితే.. వినియోగదారులు, రుణదాతలు, వేతనాలు పొందేవారు, స్థిర ఆదాయం పొందేవారు, పింఛన్దారులు, పేదవారు నష్టపోతారు. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడు రకాల చర్యలు తీసుకుంటుంది. అవి.. 1. ద్రవ్య విధానం. 2. కోశ విధానం. 3. ఇతర చర్యలు ద్రవ్య విధానం దేశంలో అధిక కరెన్సీ చెలామణీని అరికట్టడంలో భాగంగా కేంద్రబ్యాంకు చేపట్టే చర్యలు దీని పరిధిలోకి వస్తాయి. బ్యాంకు రేటును, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం, బహిరంగ మార్కెట్ చర్యల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను, బాండ్లను ప్రజలకు అమ్మడం వంటి పరిణామాత్మక ద్రవ్య విధానాలతోపాటు వినియోగ పరపతిని నియంత్రించడం, రుణాలకు పూచీగా పెట్టుకొనే ఆస్తులకు మార్జిన్లను పెంచడం వంటి గుణాత్మక ద్రవ్య విధానాల ద్వారా ప్రజల వద్ద ఉన్న ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించి వారి కొనుగోలు శక్తిని తగ్గిస్తారు. తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తారు. దీన్నే ఖరీదైన ద్రవ్య విధానం అంటారు. కోశ విధానం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కోశపర చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం వ్యయ పొదుపును పాటించడం, పన్నులు విధించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడం, ప్రజల నుంచి రుణాలు తీసుకోవడం వంటి చర్యల ద్వారా ధరలను అదుపులో ఉంచొచ్చు. ఇతర చర్యలు వస్తూత్పత్తిని పెంచడం ద్వారా డిమాండ్కు అనుగుణంగా సరఫరా పెంచి ధరలను అదుపులోకి తీసుకురావడం, వేతనాలను నియంత్రించడం, నిత్యావసర వస్తువులను రేషనింగ్ విధానం ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం తదితర చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచొచ్చు. మనదేశంలో ద్రవ్యోల్బణం రేటును తెలుసుకోవడానికి టోకు ధరల సూచీ (Wholesale Price Index-WPI)ని ఉపయోగిస్తున్నారు. ఒక సంవత్సర కాలంలో ధరల సూచీలో వచ్చిన మార్పు శాతాన్ని ‘ద్రవ్యోల్బణ రేటు’ అంటారు. ధరల సూచీని నిర్ణయించేటప్పుడు ఆధార సంవత్సరాన్ని నిర్ణయించి, దాని ధరల సూచీ 100గా భావించి, దాని ఆధారంగా టోకు ధరల సూచీని నిర్మిస్తారు. ఒక సంవత్సర కాలంలో టోకు ధరల సూచీలో మార్పు రాకపోతే శూన్య ద్రవ్యోల్బణం అని, టోకు ధరల సూచీలో మార్పు ఎక్కువగా ఉంటే ధనాత్మక ద్రవ్యోల్బణం అని, టోకు ధరల సూచీలో మార్పు తక్కువుంటే రుణాత్మక ద్రవ్యోల్బణం అని పేర్కొంటారు. మన దేశంలో టోకు ధరల సూచీని నిర్మించడానికి ఇప్పటి వరకు 6 సార్లు ఆధార సంవత్సరాలను ఎంచుకున్నారు. అవి..1952-53, 1961-62, 1970-71, 1981-82, 1993-94, 2004-05. ప్రస్తుతం అనుసరిస్తున్న 2004-05 టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం, 2010, సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకొచ్చింది. 1993-94 ఆధార సంవత్సరంగా టోకు ధరల సూచీని నిర్ణయించడానికి 435 వస్తువులను పరిగణనలోకి తీసుకున్నారు. 2004-05 ఆధార సంవత్సరంగా టోకు ధరల సూచీని నిర్ణయించడానికి 676 వస్తువులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 102 ప్రాథమిక వస్తువులు, 19 విద్యుచ్ఛక్తి, ఇంధన వస్తువులు, 555 తయారీ రంగ వస్తువులున్నాయి. టోకు ధరల సూచీ నిర్మాణంలో ప్రాథమిక వస్తువులకు 20.12%, విద్యుచ్ఛక్తి, ఇంధన వస్తువులకు 14.91%, తయారీ రంగ వస్తువులకు 64.97% భారం (వెయిటేజీ) ఇచ్చారు. భారత ఆర్థిక, పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ద్వారా ప్రతినెలా టోకు ధరల సూచీని (WPI)ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 16న విడుదల చేసిన నివేదికలో 2016 జూలై టోకు ధరల సూచీ WPI 183.9గా నమోదైంది (2004-05=100). ఈ ఏడాది జూలైలో ద్రవ్యోల్బణం 3.55%గా నమోదైంది. 2015 జూలై టోకు ధరల సూచీ 177.6 గా ఉండటం, ఈ రెండింటి మధ్య తేడా 6.3గా ఉండడం వల్ల ద్రవ్యోల్బణ రేటు 3.55%గా నమోదైంది. 2016 జూలై ద్రవ్యోల్బణ రేటును తెలుసుకునేందుకు, జూలై, 2016 గ్కిఐ మైనస్ జూలై, 2015 గ్కిఐ (183.9-177.6=6.3) మధ్య తేడాను తెలుసుకుని, తర్వాత ఆ తేడా 100కు ఎంతో తెలుసుకుంటే ద్రవ్యోల్బణ రేటు వస్తుంది. దీని ప్రకారం ద్రవ్యోల్బణ రేటు ఇప్పటి వరకు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణ అంచనాలకు WPIనే ఉపయోగిస్తోంది. దీనికి జాతీయస్థాయిలో ధరలను పరిగణనలోకి తీసుకోవడం ఒక కారణమైతే, వినియోగదారుల ధరల సూచీ కొన్ని వర్గాలకే పరిమితం కావడం మరొక కారణం. ఇందులో పారిశ్రామిక శ్రామికులు- వినియోగదారుల ధరల సూచీ (CPI-IW), వ్యవసాయ శ్రామికులు- వినియోగదారుల ధరల సూచీ (CPI-AL), గ్రామీణ శ్రామికులు- వినియోగదారుల ధరల సూచీ (CPI-RL)వంటి వివిధ వర్గాలకు సంబంధించిన సూచీలు ఉన్నాయి. అయితే 2011లో సంయుక్త వినియోగదారుల ధరల సూచీని (CPI-Combined)ప్రవేశపెట్టారు. టోకు ధరల సూచీ (WPI)కంటే సంయుక్త వినియోగదారుల ధరల సూచీ(CPI-Combined) వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని 2013లో రిజర్వు బ్యాంకు గవర్నర్ ఆధ్వర్యంలో ఉర్జిత్ ఆర్. పటేల్ చైర్మన్గా ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఆగస్టు 12, 2016న మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వినియోగదారుల ధరల సూచీ (గ్రామీణ, పట్టణ సంయుక్త సూచీ) 3.69% పెరిగిందని పేర్కొంది. దీని ఆధార సంవత్సరాన్ని 2010 నుంచి 2012కు మార్చారు. ఈ ఆధార సంవత్సరం 2015 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది