భారత్‌కు ‘లంక’ గతే: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Said India Looks Like Sri Lanka - Sakshi

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో లంకేయులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ కూడా చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోందంటూ ఓ గ్రాఫ్‌ను చూపిస్తూ కేంద్రంపై ఆగ్రహం వ‍్యక్తం చేశారు. 

దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందోని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ క్రమంలో బుధవారం రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్స్‌ చేశారు. భారత్‌ చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోంది. రెండు దేశాల్లో నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింసకు సంబంధించిన గ్రాఫ్‌ను పోస్ట్‌ చేసి.. ఇవి తీవ్ర స్తాయికి చేరుకున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రజల చూపును పరిస్థితుల నుంచి మళ్లించడం వల్ల నిజాలు అబద్ధాలు కాలేవు.. అంటూ కామెం‍ట్స్‌ చేశారు. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన డేటా ఆధారంగా ఈ గ్రాఫ్‌లను రూపొందించినట్లు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. 

మరోవైపు.. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​, వంటగ్యాస్​ దొరక్క అల్లాడుతున్న జనం వంట చేసుకునేందుకు కిరోసిన్​​ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరోవైపు.. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్​ కొనేందుకు తమ వద్ద డబ్బుల్లేవని లంక సర్కార్‌ చేతులెత్తేసింది. ప్రజలు.. పెట్రోల్ కోసం బంకుల వద్దకు రావద్దొని తెలిపింది. దీంతో ప్రభుత్వం తీరుపై లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top