breaking news
illegally occupied
-
హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు -
ఆక్రమిత ప్రాంతంలో చైనా వంతెన నిర్మాణం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. అయితే వంతెన నిర్మిస్తున్న ప్రాంతం గత 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆధీనంలో ఉందని తెలిపింది. చైనా చర్యల నేపథ్యంలో దేశ రక్షణ ప్రయోజనాలు సంపూర్ణంగా పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్లో భాగమేనన్నారు. చైనా ఇలాంటి వక్ర చర్యలకు బదులు ఘర్షణాత్మక అంశాలపై భారత్తో నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు. -
ఇదీ చెరువుల ‘రియాల్టీ’!
ఒకప్పుడు సాహెబ్నగర్ పంచాయతీ పరిధిలో ఆరుతడి పంటలకు నీరందించిన కప్రాయి చెరువు (కప్పల చెరువు) మొత్తం 71 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మిగిలింది 18 ఎకరాలు మాత్రమే. ఫలితంగా ఇటీవలి వర్షాలకు కట్ట తెగుతుందని ఎల్బీనగర్ ఏరియా గజగజ వణికింది. 1996లో హుడా అనుమతితో ఓ స్టార్ హోటల్ అధినేత చెరువు శిఖం భూమిలోనే వెంచర్ వేసి... హరిహరాపురం కాలనీ పేరుతో 627 ప్లాట్లు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షంతో హరిహరాపురం మొత్తం ఫస్ట్ఫ్లోర్ వరకు మునిగి పది రోజులు వరద నీటిలో విలవిలలాడింది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్... ఒకప్పుడు బాగ్లు (వనాలు), తలాబ్(చెరువులు)లతో అలరారిన మహానగరం. కానీ ఇప్పుడు చెరువు శిఖం భూము లతో పాటు తూములు, అలుగులు, నాలాలపై భారీ నిర్మాణాలతో వరదనీరు పోయే దారిలేక... చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఒకటా రెండా... జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా ఎనభై ఏడు చెరువులకు అధికార యంత్రాంగం కను సన్నల్లో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉరిపోసి.. ఉసురు తీశారు. చెరువు లను చెరపట్టి... ఐదువందల కాలనీలు ఏర్పాటు చేసి అమాయకంగా కొనుగోలు చేసిన జనాన్ని, ఇటు నగరాన్ని నిండా ముంచేశారు. నగరానికి తలాపున ఉన్న శాతంచెరువు 70 ఎకరాలకు గానూ ఇప్పుడు మిగిలింది కేవలం పది ఎకరాలే. ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా వచ్చే వరదతో నిండే, రామంతాపూర్ ప్రగతినగర్లో పంటలకు నీళ్లందించిన 26 ఎకరాల పెద్దచెరువు కుత్తుక వరకు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చేసింది. ఫలితంగా ఇటీవలి భారీ వర్షాలకు ఐదు కాలనీలను 12 ఫీట్ల వరద ముంచెత్తి... వాస్తవ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) హద్దులు ఏవో తేల్చిచెప్పింది. మిషన్ కాకతీయ పేరుతో నిర్ణయించిన పూర్తి జలాశయ హద్దులు (ఎఫ్టీఎల్) కూడా సరి కావని ప్రకృతి నిర్ధారించినట్లయింది. రెండు దశాబ్దాలుగా కాలయాపన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి పరిధిలో 1,728 చెరువులను గుర్తించిన యంత్రాంగం పూర్తి హద్దులు నిర్ణయించేందుకు రెండు దశాబ్దాలుగా కాలయాపన చేస్తూనే ఉంది. ఇప్పటివరకు కేవలం 192 చెరువులనే నోటిఫై చేసి చేతులు దులుపుకుంది. మిషన్ కాకతీయతో మళ్లీ నగర చెరువులకు ప్రాణం పోయాలన్న సర్కారు ప్రయత్నం ఆరేళ్లుగా కార్యరూపం దాల్చనే లేదు. మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశహర్మ్యాలే లేచాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నంచెరువు, మంగలికుంటలు సైతం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరందించిన దుర్గంచెరువు సైతం అన్యాక్రాంతం నుండి తప్పించుకోలేకపోయింది. 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల్లో గార్డెన్లు వెలిశాయి. దుర్గుం చెరువు నుండి కఠోరాహౌజ్కు నీరందించే గొట్టపుమార్గంపైన కూడా అక్రమ నిర్మాణాలు వచ్చేశాయి. నిధులు, నివేదికలు... బుట్టదాఖలు 2000 సంవత్సరంలో హైదరాబాద్ను వరదలు ముంచెత్తిన తర్వాత... కారణాలు, నివారణ మార్గాల కోసం 2003లో ప్రభుత్వం కిర్లోస్కర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో సర్వే చేయించింది. తొలుత ఓల్డ్ ఎంసీహెచ్ (హైదరాబాద్ జిల్లా), రెండవ దఫాలో జీహెచ్ఎంసీలో వరద నీటి పారుదల, కాలువల ఆధునీకరణ ప్రాజెక్ట్ను కిర్లోస్కర్ కమిటీ రూపొందించింది. దీనికి కోసం 6,247 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ధారించారు. అయితే అత్యవసరంగా మేజర్ నాలాలను విస్తరించేందుకు 2008లో జేఎన్యూఆర్ఎం కింద రూ.300 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిలో కేవలం రూ.120 కోట్లనే ఖర్చు చేశారు. మిగిలిన రూ.180 కోట్లు సకాలంలో ఖర్చు చేయక మురగబెట్టారు. రామంతాపూర్లో..పెద్ద విషాదం రామంతాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా..ఇప్పుడు మిగిలింది కేవలం 12 ఎకరాలే. అలుగు, తూము ఆనవాళ్లే లేకుండా నిండా నిర్మాణాలు వచ్చేశాయి. అధికారులే ఆక్రమణలు నిజమేనని సమాచారహక్కు చట్టం కింద తేల్చేసి చేతులు దులుపుకున్న ఫలితంగా ఇటీవలి వరదతో సాయిచిత్రనగర్, మహేశ్వరినగర్, రవీంద్రనగర్ నిండా మునిగాయి. మునుగుతాయని తెలిసినా... పేదలకు పట్టాలు 472 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాక్స్సాగర్లో 120 ఎకరాలు.. అన్యాక్రాంతమైపోయింది. ఇక్కడ ఒక ఎకరం ఖరీదు రూ.3 కోట్ల పైమాటే.. ఎఫ్టీఎల్లోనే భారీ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రసాయన గోదాములున్నాయి. 2003లో అప్పటి ప్రభుత్వం సైతం 11 ఎకరాల్లో 642 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చింది. అక్కడ ఉమామహేశ్వరినగర్ వెలిసింది. ఫాక్స్సాగర్కు వరద వచ్చిన ప్రతిసారీ ఉమామహేశ్వరి నగర్ నిండా మునగటం పరిపాటి అయింది. ఆపద తొలగని అంబీర్చెరువు ఇక ప్రగతినగర్, శంశీగూడల మధ్య ఒకప్పుడు పంటపొలాలకు నీరందించిన అంబీర్చెరువు సర్వేనెంబర్ 103లో 154.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు కాగితాల్లో చూపుతున్నా... అక్కడ 54 ఎకరాలకు పైగా నిర్మాణాలు వచ్చేశాయి. ప్రగతినగర్–శంశీగూడల సర్వేనెంబర్ల ఓవర్ల్యాపింగ్ను ఆసరాగా చేసుకున్న నాయకులు, వ్యాపారులు ఏకంగా జీహెచ్ఎంసీ అనుమతితోనే భారీ నిర్మాణాలు చేశారు. హైటెక్ సిటీకి చేరువగా ఉండటంతో కోట్లు గడించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి సాహీ ఎన్జీఓ సంస్థ కొండాపూర్ మజీద్బండలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని కుడికుంటకు మూడేళ్లలో కొత్త ఊపిరి పోసింది. ఆక్రమణలు లేకుండా చెత్త, డ్రైనేజీ నీటిని డైవర్ట్ చేసి వందేళ్ల క్రితం నాటి వైభవాన్ని తెచ్చింది. ఈ కుంటపై తీసిన ‘లాస్ట్ మైల్ ఫర్ వాటర్’అనే షార్ట్ ఫిలిం ఐక్యరాజ్య సమితి బెస్ట్ సిటీస్పై నిర్వహించిన కాంపిటీషన్లో స్థానం సంపాదించింది. ఈ విషయమై సాహి సభ్యురాలు కల్పనా రమేష్ మాట్లాడుతూ వ్యక్తులుగానే మేం కుడికుంటకు పునర్జీవం పోశాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నగరమంతటా చేయవచ్చని పేర్కొన్నారు. 2000 శాతం చెరువు పరిస్థితి ఇదీ.. 2020 ఈ పాపం అందరిదీ: లుబ్మా సర్వత్, సేవ్ అవర్ లేక్ సొసైటీ నగరంలో చెరువు, కుంటలు మాయమై వరద నీటిలో బతికే దుస్థితికి అన్ని వ్యవస్థలూ కారణమే. ఇది వ్యవస్థీకృత నేరంగా చెప్పొచ్చు. రాజకీయనాయకులు, అధికారులు, ఇతర రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యతతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హైదరాబాద్ మహానగరం వాస్తవ పరిస్థితి ఏమిటో ఇటీవలి వరదలు చూపెట్టాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన నిర్ణయాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. -
రిజర్వ్డ్ స్థలాల కబ్జా
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కోట్ల విలువ చేసే రిజర్వుడు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. లేఅవుట్లు వేసే సమయంలో ఉద్యానవనాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుంటారు. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. నెల్లూరు, సిటీ: నగరంలోని కోట్ల విలువ చేసే కార్పొరేషన్ రిజర్వుడు స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆక్రమణదారులు అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో లేఅవుట్లు వేసే సమయంలో పది శాతం స్థలాలను కార్పొరేషన్కు కేటాయించాల్సి ఉంటుంది. పార్కులు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ రిజర్వుడు స్థలాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50శాతం రిజర్వుడు స్థలాలను కబ్జా చేశారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ అధికారుల వద్ద కూడా ఆ స్థలాలకు సంబంధించి పత్రాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన అరకొర స్థలాలపై కన్నేసిన అధికార పార్టీ వారు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఉద్యానవనాల కోసం కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురవడంపై నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకునే దిక్కులేదు ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆక్రమణల విషయమై నగర పాలక సంస్థ టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టీపీఎస్లను కలిపి ఏడుగురిని సస్పెండ్చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో కొత్తగా అధికారులకు నియమించినా కేవలం 5 మంది మాత్రం విధుల్లో చేరారు. కొత్తగా వచ్చిన అధికారులకు నగరంపై అవగాహన లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది సహకారంతో ఆక్రమణదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారులకు అధికార పార్టీ అండదండలు నగరంలోని బాలాజీనగర్ 13వ డివిజన్లో రెడ్డిఅండ్ రెడ్డి హెచ్పీ గ్యాస్ గోదాము సమీపంలోని రిజర్వుడు స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి ఏకంగా ఓ గదిని నిర్మించి ప్రహరీ సైతం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలను కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ అజీజ్ దృష్టికి తీసుకెళ్లినా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.