breaking news
Howrah - Tiruchirapalli Express
-
13 కేజీల బంగారం పట్టివేత
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడ రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 13 కేజీల బంగారాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. హౌరా-తిరుచ్చినాపల్లి ఎక్స్ప్రెస్లో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం ఆభరణాల రూపంలో ఉంది. తాము స్వాధీనం చేసుకున్న బంగారం దాదాపు 13 కేజీల వరకు ఉండటంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగారంతో వెళ్తున్న వ్యక్తి వద్ద ఎటువంటి రసీదులు లేకపోవడం, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గుడ్డ సంచీలో ఆభరణాలు తరలించడంపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. -
13 కేజీల బంగారం పట్టివేత