breaking news
Heroine Keerthi Suresh
-
నా ఎదుగుదలకు కారణం స్నేహితురాలు: నటి
అమ్మానాన్న ఓ స్నేహితురాలు. ఏమిటీ తలా తోక లేకుండా అనుకుంటున్నారా ? మన జీవితంలో మన మంచి కోరేవారెవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే. అయితే ఒక్కోసారి వారు కూడా చేయని మేలు స్నేహితుల వల్ల జరిగిపోతుంది. అసలు కీర్తీసురేశ్ హీరోయిన్గా ఇంత వేగంగా ఎదగడానికి కారణం ఎవరో తెలుసా ? కీర్తీసురేశ్ స్నేహితురాలట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటో తెలుసుకోవాలనుందా? కీర్తీకి చిన్నతనం నుంచి నటనంటే చాలా ఇష్టం అట. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును చేసింది. అయితే హీరోయిన్ అవ్వాలన్న తన కోరికను తల్లిదండ్రుల వద్ద చేబితే వారు వద్దన్నారట. ఇంతకీ కీర్తీసురేశ్ తల్లిదండ్రులెవరో తెలుసా? తల్లి మేనక ఒకప్పుడు నటుడు రజనీకాంత్కు జంటగా నటించారు. తండ్రి సురేశ్ మలయాళంలో పేరున్న నిర్మాత. అయినా హీరోయిన్ కావాలన్న కీర్తీ కోరికను నిరాకరించారు. దీంతో తన బాధను కీర్తీసురేశ్ స్నేహితురాలికి చెప్పుకుని తెగ బాధపడిందట. తాను వేరే వాళ్లకు పుడితే నటించడానికి అనుమతి లభించేదేమోనని వాపోయిందట. ఈ విషయం కీర్తీసురేశ్ తల్లిదండ్రుల తెలిసి అంతగా ఆశ పడుతున్న తన కూతుర్ని నటించడానికి ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని కీర్తీనే ఒక భేటీలో తెలిపారు. అలా కీర్తీసురేశ్ హీరోయిన్ అవ్వడానికి అమ్మానాన్న ఓ స్నేహితురాలు ఒక భాగం అయ్యారట. తన జీవితం మలుపునకు తన స్నేహితురాళ్లే అంటోంది హీరోయిన్ కీర్తీసురేశ్. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ అభిమానుల్నిఅలరిస్తున్న కీర్తీసురేశ్ కోలీవుడ్కు ఇదుఎన్న మాయం చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సక్సెస్ఫుల్ హీరోయిన్ పట్టికలో చేర్చాయి. విజయ్కు జంటగా నటించిన భైరవా చిత్రం తరువాత కోటీకిపైగా పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అదే విధంగా తెలుగులో నటించిన నేను శైలజా, నేను లోకల్ చిత్రాల విజయంతో కీర్తీ సురేశ్కు మంచిపేరు వచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన తానాసేర్న్ దకూటం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. త్వరలో విశాల్తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది. -
సాగర తీరంలో ప్రేమ పాఠాలు!
గోవా అంటే బ్యాచిలర్స్కు ప్యారడైజ్. ఇక ప్రేమికులైతే అక్కడికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు హీరో రామ్ కూడా హీరోయిన్ కీర్తీ సురేశ్తో కలిసి ప్రేమపాఠాలు వల్లిస్తున్నారు. అయితే నిజంగా కాదండోయ్... సినిమా కోసమే. రామ్, కీర్తీ సురేశ్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికి శోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. శనివారం నుంచి గోవాలో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 26తో పాట చిత్రీకరణ పూర్తవుతుంది. ‘‘రామ్ స్టయిల్లో సాగే ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తుంది. టైటిల్ ఈ వారంలోనే వెల్లడిస్తాం. జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయగ్రహణం: సమీర్రెడ్డి, సమర్పణ: కృష్ణచైతన్య.