breaking news
heavy fish
-
800 కిలోల భారీ చేప..వీడియో వైరల్
-
800 కిలోల భారీ చేప..వీడియో వైరల్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 800 కిలోల బరువున్న ఈ అరుదైన చేపను శంకర్ చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. ఏనుగు చెవిని పోలిన ఈ చేప 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ భారీ చేపను చూడటానికి స్థానికులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తీరప్రాంతంలో చేపలవేటకు వెళ్లిన మత్సకారులకు ఇది చిక్కింది. అయితే ఇంత భారీ చేపను తామెప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ అరుదైన చేప 50వేలకు అమ్ముడైంది. రే కుటుంబానికి చెందిన ఈ చేపను శంకర్ చేప అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ తరహా చేపలను బెంగాల్ వాసులు ఇష్టపడుతారట. గతేడాది మార్చిలోనూ ఇదే రకానికి చెందిన 300కిలోల చేప మత్సకారులకు చిక్కింది. (నోరూరించే పీతల కూర.. సరోజ్ దీదీకి సాయం!) -
చేప పొట్టలో విలువైన సంపద?
ఇందుకూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం పల్లిపాళెం సముద్ర తీరానికి ఆదివారం సుమారు 35 అడుగుల పొడవు ఉన్న భారీ చేప కొట్టుకొచ్చింది. ఈ చేప నాలుగు నుంచి ఐదు టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ఇది మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో కొందరు చేప పొట్ట భాగంలో కోసి చూడగా లక్షలాది రూపాయల విలువైన సంపద దొరికినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.