ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
హసన్పర్తి : ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన ఈ జంట.. కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం నేరెళ్లల్లో సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. అయితే ప్రస్తుతం ఆ జంట పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..హసన్పర్తి మండలం నాగారానికి చెందిన బండారి హరీష నగర పరిధిలోని ఓ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఎండీ.ఖాజాపాషాతో ఆమె ప్రేమలో పడింది. ఖాజాపాషా గ్రామంలో బెలూన్ల (బుగ్గులు, పీకలు) వ్యాపారం చేస్తున్నాడు.కాగా, ఈనెల 15వ తేదీ న హరీ షకు నిశ్చితార్థం. ఈనెల 14న హరీష ఇంటి నుంచి పారిపోయింది. రెండురోజుల పా టు హరీషకోసం గాలింపు చేపట్టారు. జాడ కానరాకపోవడంతో ఈనెల 16న కుటుంబ సభ్యులు హసన్పర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నేరెళ్లలో ఆత్మహత్యాయత్నం..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంది. అయితే రెండురోజుల పాటు ఆ ప్రేమికులు నేరెళ్లలోని ఖాజాపాషా బంధులు ఇంటిలో ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్లితే కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించిన వారు పురుగుల మందు తాగారు. బాధితులను వెంటనే 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలివెళ్లారు.