breaking news
Government activities
-
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సుల రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు. మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు. -
పంటలు ఎండిపోకుండా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్లో పంటలకు నీరందిస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్రావు, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానమిచ్చారు. ‘‘పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ కమీషన్ల కోసం కేవలం పంపులు, పైపులు తెచ్చిపెట్టి బిల్లులు తీసుకున్నారు. 2014 వరకు పనులు కదలలేదు. కరువు పీడిత ప్రాంతాలకు జీవమిచ్చే ప్రాజెక్టు కావడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. వచ్చే వానాకాలం నుంచి ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరిస్తాం. 40 చెరువులను నింపుతాం..’’అని చెప్పారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నామని, ప్రాజెక్టు కింద 58 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి రైతులకు పాస్పుస్తకాలు: మహమూద్ అలీ రైతులకు ఏప్రిల్ 20వ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ తెలిపారు. ధరణి వెబ్సైట్లో భూములకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, అరూరి రమేశ్, శ్రీనివాస్గౌడ్, ఎ.వెంకటేశ్వర్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.34 కోట్ల ఎకరాల్లో 93 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని పేర్కొన్నారు. 6,180 మందికి పునరావాసం: పద్మారావుగౌడ్ రాష్ట్రంలో గుడుంబా తయారీని పూర్తిగా రూపుమాపామని ఎౖMð్సజ్ మంత్రి పద్మారావుగౌడ్ తెలిపారు. గుడుంబా అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. గుడుంబా విక్రేతల్లో ఇప్పటివరకు 6,180 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. అందరికీ ఉపాధి కల్పిస్తేనే గుడుంబా నిర్మూలన అవుతుందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ధూల్పేటలో ఐదెకరాల్లో ఏదైనా పరిశ్రమను నెలకొల్పుతామని మంత్రి వెల్లడించారు. మహిళల కోసం 102 అంబులెన్స్ సేవలు: లక్ష్మారెడ్డి గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 102 అంబులెన్స్ సర్వీసును అమలు చేస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 241 వాహనాలను ఈ సేవలకు వినియోగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం: ఇంద్రకరణ్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం 1,805 ఆలయాలకు ఈ పథకం అమలవుతోందన్నారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఒడితెల సతీశ్కుమార్, పుట్ట మధుకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు: హరీశ్ మున్సిపాలిటీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు భారీగా నిధులను ఇవ్వబోతోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. లైబ్రరీల్లో ఇంటర్నెట్, వైఫై: కడియం అన్ని జిల్లాల కేంద్ర గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ గ్రంథాలయాల్లో ఇంటర్నెట్, వైఫై సేవలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్రెడ్డి, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 21 కొత్త జిల్లాల్లో నిర్మించే గ్రంథాలయాలకు ఒకే రకమైన డిజైన్ రూపొందించామని, ఒక్కోదానికి రూ.కోటిన్నర ఖర్చుచేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం: మహేందర్రెడ్డి డ్రైవర్ల వైద్య పరీక్షలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల కోసం ఏటా రూ.48 కోట్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆస్పత్రిలో, కరీంనగర్లోని 12 పడకల ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని మరో 15 డిస్పెన్సరీల్లో ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ టారిఫ్ రేట్లను సవరించే ప్రతిపాదన లేదు: జగదీశ్రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ స్లాబులు, రేట్లను సవరించే విషయం పరిశీలనలో లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా రూ.8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అయినా రూ.1,610 కోట్ల మేర డిస్కంల మీద ఇప్పటికీ భారం ఉంది’అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆర్డబ్ల్యూఎస్లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవ్: సండ్ర ఆర్డబ్ల్యూఎస్లోని 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పది నెలలుగా జీతాలు అందటం లేదని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రోజుకు 500–600 గ్రానైట్ లారీల ప్రయాణంతో సత్తుపల్లి రోడ్డు మృత్యుమార్గంగా మారిందని, దాన్ని నాలుగు వరుసలకు విస్తరించటంతోపాటు డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించాలని కోరారు. పాత పైపులైన్లతో సమస్యే: ఆర్.కృష్ణయ్య మిషన్ భగీరథ పథకం కింద గ్రామం వరకు కొత్త పైపులైన్లు నిర్మించి గ్రామాల్లో అప్పటికే ఉన్న పాత లైన్లనే వాడబోతున్నారని, అవి అస్తవ్యస్తంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాలకు మళ్లీ ఇబ్బంది తప్పదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మండల కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మించాలని కోరారు. నేనొచ్చిన బస్సు 3 సార్లు ఆగిపోయింది: సున్నం రాజయ్య ఆర్టీసీ బస్సుల కండిషన్ అధ్వానంగా తయారైందని, తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు తానొచ్చిన బస్సు నార్కెట్పల్లి–చౌటుప్పల్ మధ్య మూడు సార్లు ఆగిపోయిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. సభ దృష్టికి తెచ్చారు. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో తెల్ల బెల్లం కనిపిస్తే ఎక్సైజ్ పోలీసులు కేసులు పెడుతున్నారని, శ్రీరామ నవమికి పానకం కోసం బెల్లం కొనాలంటే జనం భయపడుతున్నారని పేర్కొన్నారు. గుడుంబాను నియంత్రించాలని కోరారు. -
19 నుంచి పకడ్బందీగా ఇంటింటి సర్వే
- 25 నుంచి 30 ఇళ్లను ఒక సెక్టార్గా చేయాలి - అధికారులు నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా.. - దళితుల భూ పంపిణీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ సిద్దిపేట రూరల్ : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని ఆయా శాఖల అధికారులచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలను సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 25 నుంచి 30 ఇళ్లను గ్రూపులుగా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్ను నియమించాలన్నారు. ఎన్యూమరేటర్లుగా పని చేయడానికి పోలీస్ సిబ్బందితో పాటు ఇతర అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్లదేన్నారు. ఈ కార్యక్రమం 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలన్నారు. ఇంటింటి సర్వేలో కుటుంబ సభ్యుల వాస్తవ పరిస్థితులకు మాత్రమే తెలియజేయాలన్నారు. ఆ ఒక్క రోజు ఏ అధికారి విధులకు హాజరుకాకపోయినా, సర్వేలో నిర్లక్ష్యం వహించినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే దళితుల భూ పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 9 గ్రామాల ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో 5 గ్రామాల్లో దళితులందరికీ భూములున్నట్లు గుర్తించామన్నారు. మరో నాలుగు గ్రామాల్లో పూర్తి స్థాయిలో భూములేవని వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల సక్రమంగా గుర్తించాలని, గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పత్రికల్లో వచ్చినట్లయితే తహశీల్దార్, ఆర్ఐతో పాటు సంబంధిత అధికారులను సైతం సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. మొదటి దశలో కుటుంబానికి ఎలాంటి భూమిలేని వారిని గుర్తించి పంపిణీ చేస్తారని, రెండో దశలో కుటుంబానికి మూడు ఎకరాలకు తక్కువగా భూమి ఉన్న వారిని పంపిణీ చేస్తామని తెలిపారు. వీటికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎలాంటి ఆటంకాలు లేకుంటే ఆగస్టు 15న పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీఓ బాల్రాజు, తహశీల్దార్ ఎన్వై గిరితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.