-
మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్
కోల్కత్తా: ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా రెండు గూడ్స్ రైళ్లు పట్టాలపై ఢీకొన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో బంకూర ప్రాంతంలోని ఓండా స్టేషన్ వద్ద లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. 12 బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఇక, ఈ ప్రమాదంలో ఒక రైలు లోకోపైలట్కు గాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పలు రైళ్లు రద్దు.. ఈ ప్రమాదంతో 14 రైళ్లను ఈరోజు రద్దు చేసినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. #ser #IndianRailways pic.twitter.com/WtvccLPEyR — South Eastern Railway (@serailwaykol) June 25, 2023 ఇది కూడా చదవండి: ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్లో కూలిన రెండో వంతెన! -
బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్.. కలకలం
న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేడు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్లోని ఫిరోజిపూర్ డివిజన్లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్పూర్ నగరంలోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. మిశ్రాను అరెస్ట్ చేసే వరకు విశ్రమించం: తికాయత్ 'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. లఖీమ్పూర్ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు) -
రైతుల్లో గూడ్స్ గుబులు
గొల్లపూడి (విజయవాడ రూరల్) : విజయవాడ రైల్వే జంక్షన్లో ప్రయాణికుల రద్దీ రాను రాను పెరుగుతోంది. ఈనేపధ్యంలో గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్కు రాకుండా ప్రత్యేక రైల్వే మార్గం నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, అహ్మాదాబాద్, ముంబాయి ఆ పై ప్రాంతాల నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్కు రాకుండా కొండపల్లి నుంచి గన్నవరం వెళ్లే విధంగా ప్రత్యేక మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ ఇప్పటికే 306 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిసింది. అయితే ప్రత్యేక రైల్వే లైను వేసేందుకు అవసరమైన భూములను తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు భూముల యజమానుల వివరాలను సేకరించింది. గొల్లపూడి,రాయనపాడు, గ్రామాల్లోని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుతో తమ భూములు కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. రాయనపాడు, గొల్లపూడి ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో ఈ మార్గం నిర్మించనున్నట్లు తెలిసింది. గొల్లపూడిలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారి ఎలైన్మెంటుకు ఉత్తరంగా వంద అడుగుల దూరంలో ఈ రైల్వే మార్గం ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం భూసేకరణ చేసి భూములను తీసుకొంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రిజిస్ట్రేషన్ ధరకు మూడు రేట్లు వస్తోందని, అయినా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువతో పోల్చుకుంటే తక్కువేనని సంబంధిత భూ యజమానులు అంటున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 25 లక్షల రూపాయలుండగా మూడు రేట్లు వస్తే 75 లక్షలేనని, మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైగా ఉందని చెబుతున్నారు. రాష్ట్ర రాజధానికి తలమానికంగా ఉన్న గొల్లపూడిలో భూములధరలు పై పైకి వెళతాయని ఆశపడిన వ్యాపారులు గూడ్సు రైల్వే మార్గంతో నష్టపోతామని తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో రియల్ ఎస్టేటు వ్యాపారులు ఎలైన్మెంట్ను మార్పుచేయించేందుకు రాజకీయనాయకుల ద్వారా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మూడు ఎక్స్ప్రెస్ రైలు లైన్లు గొల్లపూడి గ్రామాన్ని తాకుతూ వెళ్తున్నాయని, ఆరు విద్యుత్టవర్లు నిర్మించడంతోlఎంతో నష్టపోయామని గ్రామస్తులు అంటున్నారు. -
గార్డులు లేని గూడ్స్ రైళ్లు రాబోతున్నాయ్!
న్యూఢిల్లీ: సరకు రవాణా రైలు చివరి బోగీలో ఇక గార్డులు కనిపించరేమో. ప్రస్తుత మున్న విధానంలో మార్పులు చేసేందుకు రైల్వే శాఖ కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ(ఈఓటీటీ)గా పిలిచే పరికరాన్ని ఆఖరి బోగీలో అమరుస్తారు. ట్రాన్స్మిటర్ను లోకోమోటివ్కు బిగిస్తారు. రైలు నడుస్తున్నపుడు అంతా సవ్యంగానే ఉందని తెలిపేలా నిరంతరం ఈ రెండింటి మద్య సమాచార మార్పిడి జరుగుతుంది. సమాచార అంతరాయం కలిగితే డ్రైవర్కు సంకేతం అందుతుంది. తదనుగుణంగా రైలును అపి విడిపోయిన బోగీలను తిరిగి కలపడం లేదా ఇతర పునరుద్ధరణ పనులు చేసే వీలుంటుంది. ఈఓటీటీ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందని రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ తెలిపారు. తొలిదశలో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ఇలాంటి పరికరాలు వేయి కొనుగోలుచేసే ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement