breaking news
Gold jewelery exports
-
రత్నాభరణాల ఎగుమతులు డౌన్
రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 16 శాతం తగ్గిపోయాయి. 2,263 మిలియన్ డాలర్ల (19,261 కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 2,688 మిలియన్ డాలర్లు (రూ.22,414 కోట్లు)గా ఉన్నట్టు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. అమెరికా టారిఫ్ల అనంతరం వీటి ఎగుమతులు తగ్గిపోవడం గమనార్హం. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 35 శాతం తక్కువగా 950 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 12,272 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్డ్ ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు సైతం 33 శాతం తగ్గి 81 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 17 శాతం పెరిగి 997 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది మే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 851 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలల్లో 17 శాతానికి పైగా క్షీణించి 150 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్స్టోన్ ఎగుమతులు ఏప్రిల్–మే నెలల్లో ఒక శాతం తగ్గి 62 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్అమెరికా టారిఫ్ల వల్లే..‘అమెరికా టారిఫ్ల వల్ల మొత్తం మీద ఎగుమతులు మే నెలలో 16 శాతం వరకు తగ్గాయి. అయినప్పటికీ బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం బంగారానికి డిమాండ్ను పెంచింది’ అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. -
బంజారాహిల్స్లో సందడి చేసిన సినీ తారలు తేజస్వి, కామాక్షి (ఫొటోలు)
-
70 శాతం తగ్గిన పుత్తడి ఆభరణాల ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ బంగారు అభరణాల ఎగుమతులు గత నెలలో 70 శాతం తగ్గాయని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తెలిపింది. బంగారం కొరతగా ఉండడం, దేశీయ మార్కెట్లో పరిమిత నిల్వల కారణంగా పుత్తడి ఆభరణాల ఎగుమతులు 70 శాతం క్షీణించి 44.14 కోట్ల డాలర్లకు తగ్గాయని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు. జీజేఈపీసీ వెల్లడించిన వివరాల ప్రకారం...., గత ఏడాది జూలైలో 150 కోట్ల డాలర్ల బంగా రం ఎగుమతులు జరిగాయి. బంగారం మెడళ్లు, నాణాలు ఎగమతులు 63 శాతం క్షీణించి 11.28 కోట్ల డాలర్లకు తగ్గాయి. అయితే వెండి ఆభరణాల ఎగుమతులు మాత్రం జోరుగా పెరిగాయి. ఈ ఎగుమతులు 184% వృద్ధితో 11 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద భారత దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 17% క్షీణించి 249 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ -జూలై కాలానికి ఈ ఎగుమతులు 14 శాతం క్షీణించి 1,100 కోట్ల డాలర్లకు చేరాయి. {పభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో ఆభరణాల తయారీకి అవసరమైన పుత్తడి కొరత తీవ్రంగా ఉంది. {పపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనదే.