breaking news
Enjoyment
-
సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి
కటక్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన సహచరులతో కలిసి కటక్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా మూడో వన్డే ఆదివారం కటక్లో జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు విశ్రాంతి దొరికింది. శుక్రవారం ఇరు జట్లకు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో కోహ్లి తన సహచరులతో కలిసి చిల్ అయిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశాడు.' ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో నా సహచరులకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు అందరం కలిసి బయటికి వచ్చాం. ఈ మధ్యాహ్నం సహచరులతో కలిసి ఆనందంగా ఆస్వాదిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ ఫోటోలో కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, రిషబ్పంత్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్లు ఉన్నారు. చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే విశాఖలో జరిగిన రెండో వన్డేలో రోహిత్, రాహుల్ శతకాలకు తోడు అయ్యర్, పంత్ల మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో 387 పరుగులు చేసింది. ఆపై విండీస్ను 280 పరుగులకు ఆలౌట్ చేసి లెక్కను సరిచేసింది. ఇదే మ్యాచ్లో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్తో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా కీలకంగా మారిన మూడో వన్డేలో విజయం సాధించి 2019కి గుడ్బై చెప్పాలని టీమిండియా భావిస్తోంది. A day off and an afternoon with the boys is exactly what we needed 😃🤙 pic.twitter.com/6K3KLW63iJ — Virat Kohli (@imVkohli) December 20, 2019 -
అలుపు సొలుపు ఉండదు
పని ఒత్తిళ్లు, ఎక్కువ పని గంటలున్నప్పుడు సాధారణంగా అలసిపోతుంటాం. కానీ ఈ రూల్ రకుల్కి వర్తించదట. లాంగ్ వర్కింగ్ డేస్లోనే ఇంకా మజా వస్తుంది అంటున్నారీ భామ. హీరోయిన్గా బిజీ షెడ్యూల్స్ గురించి ఆమె మాట్లాడుతూ–‘‘షూటింగ్ ఎప్పుడూ ఒకేచోట జరగదు. వివిధ ప్రదేశాలు తిరగాల్సి వస్తుంటుంది. ఈరోజు చెన్నైలో ఉంటే ఆ మరుసటి రోజు ముంబైలోనో, ఢిల్లీలోనో ఉంటాం. బట్ వర్క్హాలిక్ కాబట్టి ఇవన్నీ నన్ను అలసిపోయేలా చేయవు. వర్క్ ఎంత చేసినా అలుపు సొలుపు అంత సులువుగా రావు. లాంగ్ వర్కింగ్ షెడ్యూల్స్ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను’’ అని పేర్కొన్నారు. వర్క్హాలిక్ కాబట్టే ముంబైలో అజయ్ దేవగన్ సినిమా, హైదరాబాద్లో కార్తీ సినిమా షూటింగ్స్కు అటు ఇటు షిఫ్ట్ అవుతూ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు రకుల్. -
జల్సాల కోసం చోరీల బాట
గోల్కొండ: జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థుల గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వారికి బాస్గా వ్యవరిస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగితోపాటు ఇద్దరు మైనర్ విద్యార్థులు కూడా ఉన్నారు. గోల్కొండ ఇన్ స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి జానకినగర్కు చెందిన మహ్మద్ ఫర్మాన్ (18) ప్రైవేట్ షాపులో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. కొంత కాలం క్రితం అతడికి పారామౌంట్ కాలనీకి చెందిన ఎంఏ అక్రం (19) తో పరిచయమైంది. అక్రం ప్రైవేట్ కాలేజిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు సరిపోక పోవడంతో సులువైన చైన్స్నాచింగ్ బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ఇద్దరూ 17 ఏళ్ల విద్యార్థులను తమతో కలుపుకున్నారు. నలుగురూ కలిసి గోల్కొండ, ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఈ గ్యాంగ్ టూంబ్స్ చౌరస్తా వద్ద ఉందని గోల్కొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసుదేవ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని పటుకున్నారు. మార్నింగ్ వాక్కు వచ్చే వారి ఫోన్లను చోరీ చేయటానికే తామక్కడికి వచ్చామంటూ వారు విచారణలో వెల్లడించారు. వారి వద్దనుంచి రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
విదేశీ చదువుల కోసం కారు చోరీ!
అల్వాల్ : విలాసాలు, విదేశీ చదువుల కోసం దొంగతనానికి పాల్పడి ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. అల్వాల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం....వెంకటాపురంలో నివసించే గుజ్జల వెంకటరాంరెడ్డి ఈనెల 17న ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అల్వాల్ పోలీసులు దమ్మాయిగూడలోని ఓ అపార్ట్మెంట్ వద్ద కారును పట్టుకున్నారు. పోలీసులు మరింత లోతుగా విచారించి నిందితులను అరెస్టు చేశారు. కాప్రా జేజేకాలనీకి చెందిన వడ్డమాని మనోజ్కుమార్ (21), వడ్లమాని వెంకటసాయి వినయ్కుమార్ (24), వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి.సంతోస్ (20), తాళ్ల ప్రేమ్కుమార్ (20) బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగూడలో నివసించే జండాల ధర్మతేజ (21)తో పరిచయమైంది. ఐదుగురూ కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరం అవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈనెల 17న వెస్ట్ వెంకటాపురంలో గుజ్జల వెంకటరాంరెడ్డికి చెందిన కొత్త ఇన్నోవా కారును ఎత్తుకెళ్లారు. దమ్మాయిగూడలోని అపార్ట్మెంట్ వద్ద కారును విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు దొరికారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోండిలా..!
-
ఎంజాయ్మెంట్కి ఏ వన్ ప్లాట్ఫాం..
మండే సూర్యుడు.. మనూరికి వచ్చాడు. మస్తు సందడిని పంచాడు. మళ్లీ వచ్చే ఏడాది ఇలాగే వస్తానని చెప్పి ఎంచక్కా వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం సిటీలో కిర్రాక్ పుట్టించిన సన్బర్న్ ఈవెంట్ని పార్టీ పీపుల్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ‘ఈవెంట్ ఇక్కడే ఇలా ఉంటే ఇక గోవాలో ఎలా ఉంటుందో..’ అనేది ఇప్పుడు సిటీలో నడుస్తోన్న టాక్. డిసెంబర్లో అక్కడ జరిగే ఫెస్ట్కి ‘గో.. గోవా’ అంటూ ఇప్పటి నుంచే ‘ఆన్లైన్’లో ఉన్నారు. ఇంతకీ ఆ మండేసూర్యుడు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఏం మండించాడు?.. తెలుసుకోవాలంటే.. రీడ్ దిస్ హాట్ అండ్ ఎనర్జిటిక్ స్టోరీ... హైదరాబాద్ ఫుల్ హీట్ నగరంలో తొలిసారి గచ్చిబౌలిలోని బౌండరీ హిల్స్లో నిర్వహించిన సన్బర్న్ ఈవెంట్ సూపర్‘హీట్’ అయింది. దీనికి కనీసం 8000 మందికి పైనే పార్టీ లవర్స్ అటెండయ్యారు. ఎంట్రీ టికెట్ రూ.2 వేలు నుంచి మొదలుపెట్టి కేటగిరీని బట్టి విక్రయించారు. చాలామంది బ్లాక్లో రూ.లక్ష పెట్టి మరీ కొన్నారని సమాచారం. కొన్ని స్పెషల్ కేబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులకు రూ.కోట్లలోనే ఖర్చయిందని వినికిడి. ఈవెంట్కి స్పెషల్ ఎట్రాక్షన్గా హాజరైన డీజే ఆఫ్రోజాక్ కేవలం 30 నిమిషాలు మాత్రమే మ్యూజిక్ ప్లే చేశాడు. మరోవైపు మద్యం మోతాదు మించిన యువత హడావుడి మ్యూజిక్ లవర్స్ను కొంత భయపెట్టినా.. మొత్తం మీద ఈవెంట్ ఎటువంటి గొడవలకూ తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. అయితే ‘గోవాలో జరిగే సన్బర్న్కీ దీనికీ పోలికే లేదు. అక్కడ ఇంతకు పది రెట్లు ఎక్కువ క్రౌడ్ వస్తారు. మ్యూజిక్, సెట్స్ అంతా చాలా డిఫరెంట్’ అంటూ గోవాలో జరిగే సన్బర్న్ను కూడా చూసొచ్చిన ఒక పార్టీ లవర్ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా.. హైదరాబాద్లో మాత్రం ఇప్పటివరకూ ఇలాంటి ఈవెంట్ నిర్వహించలేదని పార్టీ సర్కిల్ అంతా దాదాపు అంగీకరిస్తోంది. బుకింగ్స్ షురూ.. సిటీలో ఈ ఈవెంట్ ఇచ్చిన కిక్తో... డిసెంబర్ 27 నుంచి గోవాలో ప్రారంభమయ్యే ఈ సెన్సేషన్ సన్బర్న్ ఈవెంట్కు టికెట్స్ కోసం అప్పుడే సిటిజనులు ఆన్లైన్లో అన్వేషణ మొదలెట్టేశారు. ఈసారి 8వ ఏడాది సన్బర్న్.. గోవాలో మరిన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్తో నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఆసియాలోనే ఏ ఈవెంట్కూ ఏర్పాటు చేయనంత పెద్ద స్టేజ్ను దీని కోసం నెలకొల్పనున్నారు. ఈవెంట్లో భాగంగా 3 రోజుల పాటు నార్త్ గోవాలో జరిగే ఆఫ్టర్ డార్క్ పార్టీస్ మరో స్పెషల్. ‘‘ఈ రోజుల్లో అందరూ బిజీ. చాలామందికి సూర్యుడిని చూసే సమయం కూడా లేదు. రోజూ పొద్దున్నే 5 గంటలకు లేచి సూర్యోదయం చూస్తే వచ్చే ఆనందం, సూర్యాస్తమయం చూస్తే కలిగే ప్రశాంతత వర్ణించలేం. రోజూ ఉచితంగా మన కళ్ల ముందు జరిగే మహాద్భుతమైన ఈవెంట్స్ అవి. మల్టీప్లెక్స్లో కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్, రిఫ్రెషింగ్ ఫీలింగ్ని ఇవి అందిస్తాయి. అంత గొప్పగా ఉండాలని కాదు దాని గొప్పతనం తెలియాలనే దీనికి సన్బర్న్ అని పేరు పెట్టాను’’ అంటారు దీని ఫౌండర్ డెరైక్టర్ శైలేంద్రసింగ్. గ్లోబల్ బ్రాండ్ క్రియేట్ చేయగలిగాం... అంటారు శైలేంద్ర. ‘‘మనం తినే ఇడ్లీ, సాంబార్, లస్సీల రుచి, వాటి విలువ మనకు అర్థం కావడం లేదు. అందుకే వాటి బ్రాండింగ్ గురించి మన వాళ్లు ఆలోచించరు. దేశీ లోకల్ బ్రాండ్గా పుట్టి గ్లోబల్ ప్రాచుర్యం పొందినవి చాలా తక్కువ. ఆ తక్కువగా ఉన్నవాటిలో ఇప్పుడు ఒకటిగా నిలిచింది సన్బర్న్. సన్బర్న్ అంటే కేవలం డాన్స్ మస్తీ కాదు. మ్యూజిక్ని, సోషల్ గేదరింగ్ని, సింపుల్గా లైఫ్ని అందరితో కలిసి పంచుకోవటం’’ అంటూ వివరించారాయన. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ - ఇడిఎమ్ ఇడిఎమ్ అంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్గా సాగే ఒక స్టైల్. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ స్టైల్ని ఇండియాలో పాప్యులర్ చేసింది సన్బర్న్. ఈ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్ట్ గోవాలో 2007లో తొలిసారి మొదలైంది. అక్కడ నుంచి ఏటేటా ఒకటి తర్వాత ఒకటిగా విస్తరిస్తూ ఈ ఏడేళ్ల కాలంలో 78 సిటీలలో 2,600కు పైగా ఈవెంట్లు జరిగాయి. తద్వారా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుని ఏషియాలో నంబర్వన్ ఫెస్టివల్గా ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్స్లో 9వ స్థానం పొందింది. ఎంజాయ్మెంట్కి ఏ వన్ ప్లాట్ఫాం.. లోకల్ టాలెంట్, లోకల్ డీజేస్తో పాటు, ఇతర ప్రాంతాల డీజేస్ మ్యూజిక్, డాన్స్ అంతా సందడి సందడిగా వుంటుంది. నిజానికి ఏ చిన్న ఈవెంట్ అయినా పాపులర్ కావాలంటే సెలబ్రిటీలు అవసరం. అయితే సన్బర్న్ పేరే ఒక సెలబ్రిటీ. అందుకే ఈ ఈవెంట్లో మీడియా, సెలబ్రిటీ హడావుడి ఏమీ కనిపించదు. సంగీతం, సంతోషం, ఉత్సాహం మాత్రం నిండి వుండే ఈ ఈవెంట్స్లో ప్రతిఒక్కరూ సెలబ్రిటీలే అంటారు ఈ ఫెస్ట్ నిర్వాహకులు. ఈ ఫెస్ట్లో అందరినీ ఓలలాడించే సంగీతం తప్ప లిరిక్స్ ఉండవు. ‘‘ఇండియా ఒక యునానిమస్ కంట్రీ. ఇక్కడ ప్రాంతానికో భాష. అలాంటి చోట భాష తెలియని పాట కాసేపటికి అనాసక్తిని మిగులుస్తుంది. అందుకే యూనివర్సల్ భాష అయిన సంగీతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాం’’అని చెప్పారు శైలేంద్ర. అందుకేనేమో... ఈ ఈవెంట్కి హాజరయ్యే వారందరూ ఒకే ప్లాట్ఫాం మీదకు వచ్చిన వాళ్లుగా కలసిపోతారు. భాష, ప్రాంతంలాంటి విభజనలు ఎవరిలో కనిపించవు. సిటీలో సన్బర్న్... గోవాలో జరిగే సన్బర్న్కు సిటీ నుంచి హాజరయ్యేవాళ్ల సంఖ్య పెద్దదే. టాలీవుడ్ హీరోలు మొదలుకుని సంపన్నులు, ఐటీ ఉద్యోగులు... వేల సంఖ్యలోనే నగరం నుంచి వెళుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునేనేమో... సిటీలో సన్బర్న్కు ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ నెల 22న తొలిసారి హైదరాబాద్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో 10వేల మందికి పైగా పాల్గొన్నారని అంచనా. ‘ఇన్విక్టస్ అనే మూవీలో ఒక క్రీడ యావత్ జాతిని స్ఫూర్తి దిశగా నడిపించగలదని చెబుతుంది. అలాగే ప్రతి వారినీ సంతోషపెట్టగల, స్పూర్తినివ్వగల శక్తి మ్యూజిక్కి వుందని చెప్పాలనేది నా ఉద్దేశం. ఐపీఎల్ తో పాటు ఇండియాకున్న మరో గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సన్బర్న్’ అని శైలేంద్రసింగ్ సగర్వంగా చెప్తారు గ్రేట్ ఈవెంట్... ఈవెంట్కి దాదాపు 8 వేల మంది వచ్చారు. ఇట్స్ ఓవరాల్ వెరీగుడ్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్ సౌండ్సిస్టమ్. వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సిటీ డీజేగా అంత పెద్ద ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది. ఆఫ్రోజాక్తో పాటు డీజేలు ఎబస్టార్, గ్రెగర్ సాల్టోలు మ్యూజిక్లో పీక్స్ చూపించారు. గోవాలో జరిగే సన్బర్న్లో ప్లే చేసే చాన్స్ వస్తే ఇట్స్ రియల్లీ ఎ డ్రీం కమ్ ట్రూ. - అజయ్, డీజే ఇంటర్నేషనల్ రేంజ్లో... సిటీలో నాకు తెలిసి ఇప్పటి దాకా ఇలాంటి ఈవెంట్ జరగలేదు. అదీ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం)లో. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ రేంజ్ సిటీ చేయడానికి ఇలాంటి ఈవెంట్లు అవసరం. ముగ్గురు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్తో ఓకే వేదికపై నుంచి కలసి వర్క్ చేయడం నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. ముంబై కన్నా మన సిటీలోనే ఈవెంట్ చాలా బాగా జరిగిందని అఫ్రోజాక్, సాల్టోలు నాతో అన్నారు. - శశాంక్, డీజే -
రెయిన్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్న హైదరాబాదీలు