breaking news
employees sacking
-
రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించింది. కంపెనీ ఇయర్ ఎండ్ రివ్యూలో భాగంగా మొత్తం ఉద్యోగులలో 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. పలు ఐటీ, టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పలువురు తమ అనుభవాలు, కథనాలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు కంపెనీకి సేవలందించిన ఇండియన్ టెకీ లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్గా మారింది. (అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!) మైక్రోసాఫ్ట్లో 21 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత సంస్థలో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడంపై ప్రశాంత్ కమాని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ తర్వాత మైక్రోసాఫ్ట్ మొదటి ఉద్యోగం. భయం, ఆందోళనతో ఉద్వేగభరితంగా విదేశానికి పయనం కావడం ఇప్పటికీ గుర్తుంది. కానీ తన జీవితం ఇలా మారిందా అని ఇంకా ఆశ్చర్య పోతున్నాను అని ఆయన అన్నారు. 21 సంవత్సరాల్లో ఎన్నో పాత్రల్లో, కంపెనీల్లో పని చేశాను. ఈ జర్నీ చాలా సంతృప్తికరంగా సాగింది. మైక్రోసాఫ్ట్లో పని చేయడం నిజంగా గిఫ్ట్గానే భావిస్తా అంటూ కమానీ పేర్కొన్నారు. (షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!) మైక్రోసాప్ట్లో ఉద్యోగం చేస్తున్నప్పటి ఆ అపారమైన అనుభవాన్ని కేవలం సంవత్సరాలతో కొలవలేను. చాలా ప్రతిభావంతులైన, తెలివైన వారి మధ్య పని చేయడం అదృష్టం. వారి నుండి చాలా నేర్చుకున్నాను వారికి కృతజ్ఞుడనంటూ ఆయన రాసుకొచ్చారు. తన జీవితాన్ని అత్యంత అర్ధవంతమైన మార్గాల్లో ప్రభావితం చేసినందుకు మైక్రోసాఫ్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మరీ ముఖ్యంగా అన్ని సమయాల్లో తనకు అండగా నిల బడిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను చాలా సందర్బాల్లో కుటుంబంకోసం లేకపోయినా, వారు మాత్రం తన కోసం ఎల్లపుడూ నిలబడ్డారనీ, ఇపుడు ఈ కఠిన సమయంలో కూడా తనకెంతో సపోర్ట్గా ఉన్నారంటూ ఉద్వేగాన్ని ప్రకటించారు. చివరగా తన అనుభవానికి సూట్ అయ్యే ఉద్యోగం ఇవ్వాలనుకునేవారు తనను సంప్రదించాలని కోరారు. ఈ నోట్ ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో భావోద్వేగాన్ని నింపుతోంది. కాగా కమానీ 1999లో సాఫ్ట్వేర్ డిజైన్ ఇంజనీర్గా మైక్రోసాఫ్ట్లో కెరీర్ను ప్రారంభించి 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్గా పనిచేసిన ఆయన 2015లో కంపెనీ నుంచి వైదొలిగారు. మైక్రోసాఫ్ట్లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా మళ్లీ చేరడానికి ముందు అమెజాన్లో రెండేళ్లు పనిచేశారట. అయితే మైక్రోసాప్ట్ తాజా లేఆఫ్స్లో కమానీ ఉద్యోగాన్ని కోల్పోయారు. -
టెక్ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహేంద్రకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామచంద్రరావు ఇవాళ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెక్ మహేంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందని తెలిపారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందని వివరించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషన ర్ చర్యలు తీసుకునేలోపే ఆ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం అన్యాయమని, ఫిర్యాదు పెండింగ్లో ఉండగా తొలగించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఈ సెక్షన్ నుంచి ఐటీ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 అమలు కాకుండా హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని, కాబట్టి ఈ నిబంధన ఐటీ కంపెనీలకు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమిషనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్యప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న టెక్ మహీంద్ర కంపెనీతోపాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. టెక్ మహీంద్రకు వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్కు అనుమతినిస్తూ విచారణను వాయిదా వేసింది.