breaking news
Empire
-
చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!
చిన్నపాటి స్టోర్ మాదిరి రెస్టారెంట్ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్ రెస్టారెంట్లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. అతడే ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల రెస్టారెంట్లు రన్ చేసే రేంజ్కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. తన బ్రాండ్ల వెనుకు ఉన్న తన ఫుడ్ బేవరేజ్ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్ ఎలాంటి సక్సెస్ సూత్ర పాటించి ఈ రేంజ్కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్బ్యాక్ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్ రెస్టారెంట్ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్ పెడితే విజయం తథ్యం అని అన్నారు. (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఫిన్ఫ్లూయెన్సర్ అంకుర్ వారికూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో విజయవంతంగా నడుస్తూ దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగిన తన ఆన్లైన్ లెర్నింగ్ (అప్స్కిల్లింగ్ కోర్సులు) వేదికను మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో అటు వ్యాపార వర్గాలు, ఇటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గత ఆరేళ్లుగా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ ఈ వ్యాపారాన్ని ఇకపై ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అర్థం లేదు అని వారికూ స్పష్టం చేయడం గమనార్హం.రూ.100 కోట్ల విక్రయాలు.. రూ.25 కోట్ల లాభాలు!తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ అంకుర్ వారికూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘రూ.100 కోట్ల విలువైన నా కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నాను. 2020లో మేము ఈ వెంచర్ను ప్రారంభించినప్పుడు ఇది ఇంతటి భారీ విజయాన్ని అందుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు మా కోర్సుల్లో చేరారు. రూ.100 కోట్ల అమ్మకాలు జరిగాయి, అలాగే రూ.25 కోట్ల నికర లాభాలను కూడా ఆర్జించాం. వ్యాపారపరంగా ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ.. దీనిని ఇలాగే కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని వారికూ పేర్కొన్నారు. అయితే, ఈ హఠాత్తు నిర్ణయానికి గల పూర్తి కారణాలను, తన తదుపరి కార్యాచరణను త్వరలో ఒక ప్రత్యేక వీడియో ద్వారా పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు.డిజిటల్ ప్లాట్ఫామ్లపై తిరుగులేని సామ్రాజ్యం2020లో కోర్సుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన అంకుర్ వారికూ, చాలా తక్కువ సమయంలోనే దేశంలోనే టాప్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా యువతకు కెరీర్ గైడెన్స్, పర్సనల్ ఫైనాన్స్, టైమ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై కోర్సులను అందిస్తూ భారీ డిజిటల్ ఉనికిని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయనకు.. యూట్యూబ్లో 7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఇన్స్టాగ్రామ్లో దాదాపు 4 మిలియన్ల ఫాలోవర్లు, ఎక్స్లో 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలువారికూ చేసిన ఈ ప్రకటన డిజిటల్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఆన్లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నారా? అని ఒక యూజర్ ప్రశ్నించగా.. వారికూ సమాధానమిస్తూ.. ‘అవును, అది కూడా ఒక కారణంగా ఉంది’ అని బదులివ్వడం ఐటీ, ఎడ్టెక్ రంగాల్లో హాట్ టాపిక్గా మారింది. మరికొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్న గిమ్మిక్ (పబ్లిసిటీ స్టంట్) అని కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
ఉగాండా గతి మార్చిన భారత్
అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.గణాంకాలు ఇలా..1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.1972లో 740 మిలియన్ షిల్లింగ్లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.ముసెవెని పిలుపుతో మారిన దశ1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణతిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.సుధీర్ రుపారేలియాబహిష్కరణ సమయంలో లండన్కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.మధ్వానీ గ్రూప్గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.మెహతా, ముక్వానో గ్రూప్స్మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎంతో ఎదిగింది.భారత్ - ఉగాండా సంబంధాలుప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య -
ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యా ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’.. ఆఫ్రికాలో సాగిస్తున్న కార్యకలాపాలపై పట్టు బిగించేందుకు రష్యా అధ్యక్షుని అధికారిక కార్యాలయం ‘క్రెమ్లిన్’ దృష్టి సారించింది. వాగ్నర్ వ్యవస్థాపకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం తర్వాత ఆ సంస్థ నిర్వహించిన భారీ ‘షాడో ఎంపైర్’ను రష్యా విదేశీ నిఘా సంస్థ ‘ఎస్వీఆర్’ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆఫ్రికా దేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేయడం, తప్పుడు సమాచార ప్రచారం ద్వారా అస్థిరత సృష్టించడం లాంటి కీలక బాధ్యతలను ఇప్పుడు ఎస్వీఆర్ నేరుగా పర్యవేక్షిస్తోంది.ప్రిగోజిన్ మరణానంతరం వాగ్నర్ గ్రూప్ నిర్వహించిన ప్రభావశీల కార్యకలాపాలను రష్యా విదేశీ నిఘా సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సుమారు 100 మంది కన్సల్టెంట్లతో నడుస్తున్న ఈ విభాగం ద్వారా ఆఫ్రికా దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. లిబియా, మాలి, సూడాన్ నుంచి మొదలుకొని దాదాపు 15కు పైగా ఆఫ్రికా దేశాల్లో ఈ నెట్వర్క్ విస్తరించింది. 2024లో కేవలం 10 నెలల కాలానికి సుమారు 7.3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60 కోట్లు) నిధులను ఈ కార్యకలాపాల కోసం కేటాయించినట్లు సమాచారం.ఫోర్బిడెన్ స్టోరీస్, ఆల్ ఐస్ ఆన్ వాగ్నర్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించిన తర్వాత, వాగ్నర్ గ్రూప్ యొక్క ‘ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్’ను ఎస్వీఆర్ దక్కించుకుంది. ఆఫ్రికాలో రష్యా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, పాశ్చాత్య దేశాల పోటీని తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.దాదాపు 1,400 పేజీల రష్యన్ అంతర్గత పత్రాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం, ఎస్వీఆర్ కేవలం సైనిక సహకారం అందించడమే కాకుండా, వ్యూహాత్మక స్థానాల్లో తమ ఏజెంట్లను నియమించడం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం లాంటి పనులు చేస్తోంది. ముఖ్యంగా మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా ప్రభావం తగ్గించేందుకు ఎస్వీఆర్ పావులు కదుపుతోంది.ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆఫ్రికాలో పట్టు కోసం రష్యా రక్షణ శాఖ- ఎస్వీఆర్ మధ్య అప్పుడప్పుడు పోటీ ఏర్పడుతోంది. రక్షణ శాఖ 'ఆఫ్రికా కార్ప్స్' పేరుతో సైనిక కార్యకలాపాలను సమన్వయం చేస్తుండగా, ఎస్వీఆర్ మాత్రం రాజకీయ ప్రభావాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లో ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కోసం ఎస్వీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతోంది. ఆఫ్రికా దేశాలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నా, అవి ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలుగా మారడం లేదని పరిశోధన పేర్కొంది. అయినప్పటికీ, ఆఫ్రికాలో తన ఉనికిని చాటుకునేందుకు రష్యా ఈ ‘దీర్ఘకాలిక వ్యూహాన్ని’కొనసాగిస్తున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: ట్రంప్పై ఇండో అమెరికన్ల వ్యతిరేకత: సర్వేలో వెల్లడి -
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెలల వ్యవధిలోనే భారీగా నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మరోసారి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అప్పు తీర్చడమే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయలతో రెండు టిఫిన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తాడట. నిరాశతో కూరుకుపోయిన జీవితాన్ని స్వయంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్కడి మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఫుడ్డెలివరీ బాయ్గా కోట్లు ఎలా సంపాదించాడో గర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమేదీ కాదని నిరూపించిన చైనా యువకుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.వ్యాపారంలో నష్టందక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50వేల యువాన్లు ఇక్కడి కరెన్సీ ప్రకారం. సుమారు ఆరున్నర లక్షలు అప్పు కూడా అయింది. సర్దుకున్న జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకెళ్లాలని నిర్ణయించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్లా కాకుండా.. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టకున్నాడు. నెలకు కనీసం ఇక్కడి కరెన్సీలో చూస్తే మూడు లక్షల రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.365 రోజులు పని & రోజుకు 300 పార్శిళ్లుఏడాది మొత్తంలో 365 రోజులు పని చేయడం, రోజూ కేవలం విశ్రాంతి, తినడానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయం అంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజూ కనీసం 300 పార్శిళ్లను లక్ష్యంగా పెట్టకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు.డబ్బు సంపాదన ధ్యేయంగా పని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వడం... ప్రతి పార్శిల్కు అత్యధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3లక్షల 24వేల కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు లక్షన్నరకు పైగా ఫుడ్ డెలివరీ పార్శిళ్లను అందజేశాడు. అతని అంకితభావాన్ని చూసి తోటి ఉద్యోగలు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80లక్షలు సంపాదించి.. వాటిలో కోటి 42 లక్షలు పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతన్నాడు. -
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
ఈసీ పక్షపాత అంపైరింగ్: రాహుల్
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు. శనివారం గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్మ్యాప్పై ఈ కార్యక్రమంలో చర్చించారు. -
సీజర్ అంటే ఏమనుకున్నావ్..?
‘‘పురుషులందు పుణ్యపురుషులు..’’ అంటారు పెద్దలు. ఈ మాటకు వేర్వేరు అర్థాలు వాడుకలో ఉన్నా..ఎప్పటికప్పుడు మహానుభావులు మనకు ఎదురవుతూనే ఉంటారు. వీరు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో వారికే ఓ పట్టాన బోధపడదు. ‘కిక్’ సినిమాలో కథానాయకుడిలా ఏదో ఒక వింత పని చేయందే వీరికి కిక్కుండదు. క్రీస్తు పూర్వం చివరిదశ కాలానికి చెందిన రోమన్ జనరల్ జూలియస్ సీజర్ కూడా అలాంటివాడే..! ప్రాచీన రోమన్ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, సైన్యాధిపతి అయిన ‘జూలియస్ సీజర్’ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకొంటారు చరిత్రకారులు. ఇతడు రాజనీతి వ్యవహారాల్లోనే గాక లాటిన్ భాషలో గద్య కవిత్వం రాయడంలోనూ దిట్ట. ఈయన గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..! క్రీ.పూ.75వ సంవత్సరంలో ప్రస్తుత గ్రీసు, టర్కీల మధ్యనున్న ఏజియన్ సముద్రం గుండా ప్రయాణిస్తున్నాడు పాతికేళ్ల సీజర్. సహాయకులు సేవలందిస్తుండగా.. ప్రకృతి అందాలను ఓడపై నుంచి చూస్తూ హాయిగా సముద్రయానం చేసేస్తున్నాడు. అలా ఓడ ఓ దీవి సమీపానికి చేరుకోగానే ఊహించని ప్రమాదం ఎదురైంది సీజర్ బృందానికి. కండలు తిరిగిన సముద్రపు దొంగలు (పైరేట్స్) ఓడను చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో సీజర్కు అర్థమయ్యేలోపే మారణాయుధాల సాయంతో అతడి బృందాన్ని బంధించి, తమ నౌకల్లోకి ఎక్కించుకున్నారు. తమను ఎందుకు బంధించారో తెలియని సీజర్.. విడుదల చేయాల్సిందిగా సముద్రపు దొంగలను కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు. ‘‘అడగ్గానే విడిచిపెట్టేయడానికి వెర్రివాళ్లలా కనిపిస్తున్నామా..? 20 టాలెంట్ల వెండి ఇస్తేనే నిన్ను విడిచిపెడతాం’’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ మొత్తాన్నీ ఇప్పటి లెక్కల్లో చెప్పుకోవాలంటే 620 కేజీలకు పైమాటే! వేరే ఎవరైనా అయితే తమ సహాయకులను పంపించి పైరేట్లు కోరిన మొత్తాన్నీ తెప్పించేవారు. కానీ, జూలియస్ సీజర్ అలా చేయలేదు. పైరేట్లను ఎగాదిగా చూస్తూ వికటాట్టహాసం చేశాడు. ‘‘ఏయ్..! సీజర్ అంటే ఏమనుకున్నారు..? ముష్టి 20 టాలెంట్ల వెండి అడుగుతారా..? నా విలువ ఎంతో తెలుసా..! కనీసం 50 టాలెంట్లు అడిగితే కానీ నా సహాయకులను పంపను’’ అంటూ పట్టుదలకు పోయాడు. సీజర్ మాటలకు సముద్రపు దొంగలు తొలుత బుర్రలు గోక్కున్నారు. అయినప్పటికీ, చేసేదేం లేక అతడు చెప్పినట్టే కానిచ్చారు. అలా, వెళ్లిన సీజర్ పరిచారకులు వెండితో తిరిగి వచ్చేసరికి 38 రోజులు పట్టింది. అయితే, ఇన్ని రోజులూ ఈ రోమ్ వీరుడు పైరేట్ల చేతిలో బందీగా ఉండాల్సింది పోయి, వారిపైనే పెత్తనం చెలాయించాడట! పైరేట్లకు కవిత్వం చెబుతూ, లాటిన్ భాషలో వ్యాసాలు రాస్తూ కాలం గడిపేశాడట. అక్కడితో ఆగక.. సముద్రపు దొంగలతో తన వ్యక్తిగత పనులనూ ఈయన చేయించుకునేవాడని చెబుతాడు చరిత్రకారుడు ప్లుటార్చ్. అలా కొద్ది రోజులు గడిచాక పైరేట్లు సీజర్ పెత్తనాన్ని తట్టుకోలేకపోయారట. అతడితో వేగలేక, సొమ్ము వచ్చినా రాకున్నా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని అతడితో చెప్పారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బందీలు ఎగిరి గంతేస్తారు. కానీ, ఈ రోమన్ జనరల్ మాత్రం చిత్రంగా ప్రవర్తించాడు. పైరేట్ల మాటలను పట్టించుకోకుండా.. ‘‘మీకు నగదు ముట్టచెప్పందే నేను ఇక్కడి నుంచి వెళ్లను..’’ అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. తీరా నగదు వచ్చాక వారికి అందిస్తూ.. ‘‘మీ అంతు చూస్తాను. మిమ్మల్నందరినీ శిలువలకు వేలాడదీస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు. చెప్పినట్టుగానే కొద్ది వారాల వ్యవధిలోనే ఒక చిన్న ఓడల సమూహాన్ని వెంటబెట్టకుని అక్కడకు చేరుకున్నాడు సీజర్. అయితే, అతడి హెచ్చరికను పెద్దగా పట్టించుకోని పైరేట్లు అక్కడే కాలక్షేపం చేస్తూ కనిపించారు. అంతే.. వారందరినీ బందీలుగా పట్టుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. పనిలో పనిగా తన 50 టాలెంట్ల వెండితో పాటు దొంగల సొత్తును సైతం వెనక్కి తీసుకొచ్చాడు. ఇన్ని చేసిన వాడు శూల దండన విధించకుండా ఉంటాడా..! ఇదంతా చూసిన అప్పటి ప్రజలు జూలియస్ సీజర్ వింత ప్రవర్తనకు నోరెళ్లబెట్టారట! భలే విచిత్రమైన వ్యక్తి కదూ..!


