breaking news
electronics showroom
-
గోమతి ఎలక్ట్రానిక్స్లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి ఓల్డ్ సిటీలోని శాలిబండ క్లాక్ టవర్ పక్కన ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో దుకాణం సమీపంలో ఆగి ఉన్న ఒక కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. CNG వాహనం అయిన ఆ కారు గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగిన వెంటనే పేలిపోయింది. దాంతో మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.స్థానికులు చెప్తున్న వివరాలు.. షాప్ ముందు పార్క్ చేసిన కారుకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ కారులో ఉన్న డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కారు పేలుడు వల్ల అగ్నిప్రమాదం జరిగిందా? లేక షాప్లో ఉన్న కంప్రెషర్ పేలుడే అసలు కారణమా? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. పేలుడు శబ్దాలు వినిపించగానే పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. -
విజయవాడలో భారీ కుంభకోణం
సాక్షి, విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ కుంభకోణం బయట పడింది. ఓ కంపెనీకి చెందిన టీవీ షోరూంలో ఉద్యోగులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. కోటి రూపాయల మేర మోసం చేశారని పోలీసులకు సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. షోరూం మేనేజర్ సహా, సిబ్బందిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు మేనేజర్, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షోరూం, గోడౌన్లోని ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులు మాయం చేయడమేగాక వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. -
ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. భాస్కర్ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కోసం నాలుగంతస్తుల భవనాన్ని గోడౌన్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో టీవీలు, కూలర్లు, ఏసీలు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం షార్టు సర్క్యూట్తో గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైరింజన్ వచ్చి మంటలు అదుపు చేసినా లాభం లేకపోవడంతో మరో ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో చిక్కుకున్న ఓ బాలికను బయటకు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. 50 కూలర్లు, 100 వరకు ఎల్ఈడీ టీవీలు బూడిదయ్యాయి. గోడౌన్లో సుమారు రూ. కోటి విలువైన సరకు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం.


