-
డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 28న నియామకపత్రాల జారీ, 29న వెబ్ కౌన్సిలింగ్, జూన్ 1న పోస్టింగ్లు ఇవ్వనున్నారు. మొత్తం 10,313 పోస్టులకు ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు గంటా తెలిపారు. -
డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ దౌర్జన్యాలు ఆగడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. డీఎస్సీకి సంబంధించి లిస్టును విడుదల చేయాలని అడిగినందుకు.. డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం నరసరావుపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో డీఎస్సీ-2014 లిస్ట్ను విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో డీఎస్సీ అభ్యర్థి తలకు గాయమైంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఏపీలో డీఎస్సీ, తొలిరోజు ఎస్జీటీ పరీక్ష
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి డీఎస్సీ-2014 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష (డీఎస్సీ)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు జరిగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షకు 57,722 మంది హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 9వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్జీటీ ఖాళీల భర్తీకి రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం 364 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి పరీక్ష జరగనుంది. 10వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాంగ్వేజ్ పండిట్స్ పరీక్ష, ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పరీక్ష జరుగుతుంది. . 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1-15 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పరీక్ష నిర్వహించనున్నారు. -
పూర్తిగా సౌరశక్తితో విద్యుదీకరించిన గ్రామం?
సోషల్ - కంటెంట్ (ఎస్ఏ) నీటి సమస్యను తగ్గించి, నీటిపారుదల వ్యవస్థను పటిష్ట పరచడాన్ని ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా చేర్చారు. ఈ ప్రణాళిక ప్రారంభం నాటికే దేశంలో ఉన్న 158 భారీ; 226 మధ్య తరహా; 95 పొడిగించే, పునరుద్ధరించే, ఆధునికీకరించే పథకాలను ఈ ప్రణాళికా కాలంలో కొనసాగించారు. ఉత్తర భారత దేశంలో అత్యంత వాలు ఉన్న పర్వతీయ స్థలాకృతి కృత్రిమ నీటిపారుదలకు అనుకూలంగా లేదు. నీటిపారుదల, విద్యుచ్ఛక్తి భారతదేశంలో ప్రణాళికా కాలానికి ముందు 22.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణానికి నీటిపారుదల సామర్థ్యం ఉంది. ఇది 1993-94 సంవత్సరాంతానికి 85 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దీంట్లో 31.8 మిలియన్ హెక్టార్లు భారీ, మధ్యతరహా; 53.2 మిలియన్ హెక్టార్లు చిన్నతరహా పథకాల కింద ఉంది. దీంట్లో 76.3 మిలియన్ హెక్టార్ల భూమి మాత్రమే నీటిపారుదలను వినియోగించుకుంటోంది. 1974-75 నుంచి ఆయకట్టు ప్రాంత అభివృద్ధిని చేపట్టారు. నీటిపారుదల ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రాలు బీహార్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్లలో ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం నీటిపారుదల కింద సాగయ్యేవిధంగా మార్పు దశలో ఉంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అతి స్వల్ప (్ఱ20%) నీటి పారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల లాంటి ఉపరితల జల పథకాలున్నాయి. నీటిపారుదల వసతుల ప్రగతి భారతదేశం వ్యవసాయిక దేశమైనందువల్ల సమర్థమైన నీటిపారుదలతో కూడిన పంటల వ్యవస్థ ఉన్నప్పుడే దేశంలోని అధిక జనాభా, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలుగుతాం. పంచవర్ష ప్రణాళికల ప్రధాన ఉద్దేశం ఇదే. దేశంలోని నీటిపారుదల అభివృద్ధికి అనేక భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదల పథకాలను చేపట్టారు. 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్నవి భారీ నీటి పారుదల పథకాలు. వీటిని నదులపై నిర్మిస్తారు. 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ఉండేవి మధ్యతరహా నీటి పారుదల పథకాలు. వీటిని నదులు, ఉపనదులపై నిర్మిస్తారు. 2,000 హెక్టార్లలోపు ఆయకట్టు ఉండేవి చిన్న తరహా పథకాలు. భూగర్భజల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ కోవలోకి వస్తాయి. సాధారణ బావులు, ఎక్కువ లోతులేని గొట్టపు బావులు, పంపుసెట్ల సాయంతో నీటిని పైకి తోడే లోతైన గొట్టపుబావులు భూగర్భ జల పథకాల్లోకి వస్తాయి. జల విద్యుచ్ఛక్తి పథకాలు జలవిద్యుత్ శక్తి ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. స్వాతంత్య్రానంతరం దీని అభివృద్ధికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. దీన్నే తెల్లబొగ్గు అని కూడా అంటారు. ఇది ఎంతగా ఉపయో గించినా తరగని శక్తి. ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిగా మారుస్తారు. దీన్ని ఒకసారి అభివృద్ధి పరిస్తే శతాబ్దాలపాటు జలవిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. జలవిద్యుచ్ఛక్తిని కొన్ని అనుకూల పరి స్థితుల్లోనే ఉత్పత్తి చేయగలుగుతాం. అవి: వేసవిలో కూడా నిరాటంకంగా నీటిని సరఫరా చేయగలిగే నది లేదా పెద్ద జలాశయం ఉండాలి. ఎత్తు నుంచి నీరు జాలువారడానికి వీలైన నిమ్నోన్నతం ఉండాలి. నదీజలం ఘనీభవించడానికి వీలులేని కనిష్ఠ శీతోష్ణస్థితి అవసరం. జీవనదులు లేని చోట జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి వీలుగా అధిక వర్షపాతం ఉండాలి. భారతదేశంలోని ముఖ్య బహుళార్థ సాధక పథకాలు భాక్రానంగల్ పథకం: హిమాచల్ ప్రదేశ్లో సట్లేజ్ నదిపై భాక్రా, నంగల్ అనే ప్రదేశాల్లో రెండు ఆనకట్టలు నిర్మించారు. ఇది 1204 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే దేశంలోనే అతి పెద్ద పథకం. ఈ పథకం ద్వారా 11,000 కి.మీ పొడవైన ప్రధాన కాలువలు, 3,400 కి.మీ ఉపకాలువలతో 14.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతిని కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారు దల, జలవిద్యుచ్ఛక్తి. దీని ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. బియాస్ పథకం: ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. ఇది రెండు భాగాలుగా ఉంది. ఎ) బియాస్- సట్లేజ్ల కలయిక బి) బియాస్ నదిపై పాంగ్ వద్ద నిర్మించిన ఆనకట్ట. ఇది 1020 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం ద్వారా 17 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి. ఈ పథకం ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. దామోదర లోయ పథకం: జార్ఖండ్లోని దామోదర్ నది ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. వీటి ద్వారా 1181 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 4.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, వరదల నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లబ్ధి పొందుతున్నాయి. హీరాకుడ్ పథకం: ఒడిశాలో సంబల్పూర్ సమీపంలో మహానదిపై నిర్మించారు. ప్రపంచంలో పొడవైన ఆనకట్టల్లో ఇది ఒకటి. దీని ద్వారా 280 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.5 లక్షల హెక్టార్లు భూమికి నీటిపారుదల సౌకర్యం అందిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరదల నియంత్రణ. ఒడిశా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతోంది.నాగార్జున సాగర్ పథకం: దీన్ని కృష్ణానదిపై నిర్మించారు. భారీ నీటిపారుదల పథకాల్లో ఇది ఒకటి. దీని ద్వారా 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 8.3 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తుంగభద్రా పథకం: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మల్లాపూర్ వద్ద తుంగభద్రా నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 126 మెగావాట్ల జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. 3.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. దీని ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. కోసీ పథకం: బీహార్- నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో కోసీ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 386 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. ఈ పథకం ద్వారా బీహార్, నేపాల్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. చంబల్ పథకం: ఇది చంబల్ నదిపై నిర్మించిన ఆనకట్ట. దీంట్లో మూడు ఆనకట్టలున్నాయి. దీనివల్ల 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కలుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. గండక్ పథకం: బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 14.88 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రయోజనం పొందుతున్నాయి. రామ్ గంగా పథకం: ఉత్తరప్రదేశ్లో రామ్ గంగా నదిపై నిర్మించారు. దీని ద్వారా 198 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.75 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతి కల్పిస్తున్నారు. దీని ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పాదన, వరదల నియంత్రణ. ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. -
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’
జానపదం అంటే గ్రామీణ ప్రాంతం అని అర్థం. అమరకోశం, వ్యాసభారతంలో దీని ప్రస్తావన ఉంది. ఎర్రన అరణ్యశేషంలో గ్రామీణులు అనే అర్థంతో ‘జానపదులు’ పదాన్ని ప్రయోగించాడు. జానపద విజ్ఞానం అనేది ఫోక్లోర్ అనే ఆంగ్ల పదానికి అనువాదం. 1846లో డబ్ల్యు.జె. థామస్ అనే ఆంగ్ల జానపద విజ్ఞాన శాస్త్రవేత్త ఫోక్లోర్ పదాన్ని రూపొందించాడు. జానపద సాహిత్యం జానపద కళలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, జానపద సాహిత్యం మొదలైన వాటన్నింటిని కలిపి జానపద విజ్ఞానం అంటారు. జానపద సాహి త్యం దీనిలో ఒక భాగం. జానపదులంటే అనాగరికులు, మొరటు వారు, కర్షకులు అనే అభిప్రాయం ఉండేది. జానపదులు నిరక్షరాస్యులైనప్పటికీ ప్రస్తుతం వారి జీవిత అనుభవసారాన్ని జానపద విజ్ఞానంగా, పరిశోధనాత్మకంగా అధ్యయనం చేస్తున్నారు. జానపదుల ప్రదర్శన కళల్ని పోషించి పరిరక్షిస్తున్నారు. జానపదుల భాష, సంప్రదాయం, సంస్కృతీవిశేషాలను నిశితంగా పరిశోధిస్తున్నారు. ఎం. డార్సన్ అనే జానపద విజ్ఞాన పరిశోధకుడు ‘జానపద విజ్ఞానం- జానపద జీవితం’ అనే గ్రంథంలో ‘ ఇది గత కాలానికి సంబంధించింది కాదని, వర్తమాన కాలానికి కూడా ప్రతిధ్వని’ అని అన్నారు. నిత్యం చైతన్య స్ఫూర్తి ఉన్న జానపద విజ్ఞానం ఆధునిక జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. బ్రిటిషర్ల పాలనలో మద్రాసులో సర్వే యర్ జనరల్గా ఉన్న కల్నల్ మెకంజీ (1754- 1821), కావలి బొర్రయ్య, వెంకటరామస్వామి, లక్ష్మయ్య సహకారంతో కైఫీయత్తులను రాయిం చి సంకలనం చేయించారు. ఆంధ్రదేశంలో స్థానిక చరిత్రలు, స్థలపురాణ చరిత్రలు, గ్రామ చరిత్రలకు సంబంధించిన కైఫీయత్తులు తెలు గువారి జానపద సంస్కృతికి దర్పణాలు. భారతదేశానికి 1874లో ఉద్యోగరీత్యా వచ్చిన జె.ఎ.బోయల్ జానపద సాహిత్యం పట్ల అభిమానంతో దక్షిణ భారతదేశానికి సంబం ధించిన ఆరు జానపద గేయ గాథలను సేకరించి ‘ఇండియన్ ఆంటిక్విటీ’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. దీనిలో సర్వాయి పాపని కథ ప్రసిద్ధి. జానపద గేయగాథలను సేకరించిన తొలి పాశ్చాత్యుడు బోయల్. సి.పి.బ్రౌన్ జానపద భాషలో గణనీయ కృషి చేశారు. బొబ్బిలి కథ, కుమార రాముని కథ, పల్నాటివీరచరిత్ర, కాటమరాజు కథ, కామమ్మ కథ వంటి ప్రసిద్ధ గాథలు సేకరించి ప్రచురించారు. ఆర్.ఎస్.బాగ్స ‘ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్’ అనే ప్రామాణిక నిఘంటువులో జానపద విజ్ఞానాన్ని సూక్ష్మదృష్టితో వర్గీకరించారు. ఛార్లెస్ ఇ.గోవర్ ఫోక్సాంగ్స ఆఫ్ సదరన్ ఇండియా (1871) అనే గ్రంథాన్ని ప్రచురించా రు. అందులో వేమన పద్యాలను జానపద గే యాల కింద ఉదహరించారు. ఈ విషయాన్ని తర్వాత జె.ఎ. బోయల్ (1874) ఖండించారు. స్టీ థాంప్సన్ అనే పాశ్చాత్యుడు ‘‘ది టైమ్స్ ఆఫ్ ది ఫోక్టేల్’’ అనే గ్రంథం ద్వారా జానపద కథా మూలాలను కథానిర్మాణ పద్ధతులను వివరించారు. జానపద సాహితీ వికాసం పాశ్చాత్య భాషావేత్తల గణనీయమైన కృషి తెలుగువారికి మార్గదర్శకమైంది. 20వ శతాబ్ది పూర్వార్ధంలో నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు సేకరించి 1903లో ప్రచురించారు. 1910-20 మధ్యకాలంలో అప్పగింతల పాటలు, అడవి గోవింద నామకీర్తనలు, శ్రావణమంగళవారం పాటలు వంటి స్త్రీల ఆధ్యాత్మిక, వైవాహిక సందర్భాలకు చెందిన పాటలతో పాటు ‘చల్ మోహన రంగ’, సిరిసిరిమువ్వ, వంటి ఉత్తేజపూరితమైన పాటలను కూడా ప్రచురించారు. 20వ శతాబ్ది ఉత్తరార్ధంలో వేటూరి ప్రభా కరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు వంటి పండితులు జానపద సాహిత్యానికి విశేష కృషి చేశారు. చిలుకూరి నారాయణరావు లక్షకుపైగా సామెతలు సేకరించి ప్రచురించారు. నేదునూరి గంగాధరం, మిన్నేరు, మున్నేరు, పన్నీరు, సెల యేరు, పసిడి పలుకులు, వ్యవసాయ సామె తలు, ఆటపాటలతో ‘జానపద వాఙ్మయ వ్యాసావళి’ని ప్రచురించారు. కృష్ణశ్రీ ‘స్త్రీల రామాయణపు పాటలు’,‘స్త్రీల పౌరాణిక పాట లు’, ‘పల్లె పదాలు’ వంటి గ్రంథాలు రచించా రు. హరి ఆదిశేషుడు ‘జానపదగేయ వాఙ్మ యం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. దీనికిగానూ ఆయనకు మద్రాసు తెలుగు భాషాసమితి బహుమతి లభించింది. జానపద సాహిత్యం వర్గీకరణ జానపద విజ్ఞానంలో ప్రధానాంశమైన సాహిత్యంలో వస్తు సంస్కృతి, సాంఘిక ఆచారాలు, ప్రదర్శన కళలు, భాషావిశేషాలు ప్రతిబింబిస్తాయి. సాహిత్యంలో ప్రధానంగా గేయశాఖ, వచనశాఖ, దృశ్యశాఖ ముఖ్యమైనవి. జానపద గేయాలను 1. కథాసహితాలు 2. కథా రహితాలు అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. కథాసహిత గేయాల్లో ప్రధానంగా శ్రామిక, స్త్రీల, వృత్తి సంబంధ గేయాలు ఉంటా యి. శ్రామికుల అలసటను, శారీరక శ్రమను పోగొట్టి ఉత్సాహాన్ని పెంపొందించేవి శ్రామిక గేయాలు. స్త్రీల పాటల్లో వ్రత, పౌరాణిక కథలు ఉంటాయి. వృత్తిసంబంధ గేయాల్లో వీరగాథలు, అద్భుత గాథలు, చారిత్రక గాథలు, మతసంబంధ గాథలు ఉంటాయి. జన జీవనంలో జానపద గేయం అన్ని కోణాలను సృశిస్తుంది.కథా రహిత గేయాల్లో శ్రామిక, పారమార్థిక కౌటుంబిక గేయాలు ప్రధానమైనవి. జానపద కళా రూపాలు జానపద కళా రూపాలు దృశ్యశాఖకు సంబంధించినవి. వీటిలో యక్షగానం, తోలుబొమ్మలాట, బుర్రకథ, పులి వేషాలు, గొరవ నృత్యం, ఒగ్గుకథ, కోలాటం వంటివి ప్రసిద్దమైనవి. మౌఖికం, అనామక కర్తృత్వం, జానపద సాహిత్య లక్షణం వచన జానపద సాహిత్యంలో సామెతలు, పొడుపు కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక సమాజం - జానపద సాహిత్య ప్రయోజనం ఎంతో వైజ్ఞానిక ప్రగతిని సాధించిన ఆధునిక సమాజంలో జానపద సాహిత్యం కొన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తోంది. ప్రత్యేకించి.. 1. కుటుంబ నియంత్రణ 2. అక్షరాస్యత 3. పొదుపు ఉద్యమం 4. స్త్రీ విద్య 5. పిల్లల పెంపకం 6. అవినీతి నిర్మూలన 7. ఆరోగ్య కార్యక్రమాలు 8. ఆర్థిక అసమానతలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యవంతుల్ని చేయడానికి జానపద సాహిత్యం తోడ్పడుతుంది. ప్రసిద్ధ జానపద గ్రంథాలు- రచయితలు ఎంకిపాటలు - నండూరి సుబ్బారావు బంగారుమామ పాటలు - కొనకళ్ల వెంకటరత్నం తెలుగు జానపద గేయ సాహిత్యం(తొలి సిద్ధాంత గ్రంథం) - ఆచార్య బి.రామరాజు యక్షగాన వాఙ్మయ చరిత్రం - ఆచార్య ఎస్.వి. జోగారావు తెలుగు హరికథా సర్వస్వం , జానపద కళాసంపద, తెలుగులో కొత్త వెలుగులు - ఆచార్య తూమాటి దొణప్ప తెలుగు జానపద గేయ గాథలు - ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు వీర గాథా కవిత్వం, రేనాటి సూర్య చంద్రులు - ఆచార్య తంగిరాల సుబ్బారావు తెలుగు-కన్నడ జానపద గేయాల తుల నాత్మక పరిశీలన, జానపద సాహిత్య స్వరూపం,ఆంధ్రుల జానపద విజ్ఞానం - డాక్టర్ ఆర్.వి.ఎస్. సుందరం అనంతపురం జిల్లా స్త్రీల పాటలు, జానపద విజ్ఞాన వ్యాసావళి, జానపదుల తిట్లు -డాక్టర్ జి.ఎస్.మోహన్ {స్తీల రామాయణ పాటలు, పల్లెపదాలు ఊర్మిళాదేవి నిద్ర, - కృష్ణశ్రీ పల్లెపదాల్లో ప్రజా జీవనం - డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి జానపద పురాగాథలు - డాక్టర్ రావి ప్రేమలత ముద్రిత జానపద గేయాల్లో నిఘంటువు కెక్కని పదాలు- డాక్టర్ నాయని కోటేశ్వరి తెలంగాణ శ్రామిక గేయాలు -డాక్టర్ జి. లింగారెడ్డి స్తీల గేయాలు - సంప్రదాయాలు - డాక్టర్ సి.హెచ్. వసుంధరా రెడ్డి తెలుగు పొడుపు కథలు - డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి జానపద కళారూపాలు - డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గిరిజన గీతాలు - డాక్టర్ ఫిరాట్ల శివరామకృష్ణమూర్తి తోలుబొమ్మలాట - మొదలి నాగభూషణ శర్మ ప్రసిద్ధ జానపద గేయాలు శృంగారరస ప్రధానాలు: చెల్లి చంద్రమ్మా, ఊర్మిళాదేవి నిద్ర, చల్మోహనరంగ కరుణరస ప్రధానాలు: సారంగధర కథ, కామమ్మ కథ అద్భుత రస ప్రధానాలు బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ, బాలవర్థిరాజు కథ, మదన కామరాజు కథ. హాస్య ప్రధానాలు: గంగా-గౌరీ సంవాదం, గౌరీ-లక్ష్మీసంవాదం. చారిత్రక ప్రాధాన్యమున్న కథలు దేశింగు రాజు కథ, సర్దార్ పాపన్న కథ, చిన్నపరెడ్డి కథ. మాదిరి ప్రశ్నలు 1. జానపద విజ్ఞానం అంటే? 1) జానపద సంస్కృతి 2) జానపద ప్రదర్శన కళలు 3) జానపద విశ్వాసం 4) పైవన్నీ 2. పొడుపు కథలు జానపద సాహిత్యంలో ఏ విభాగానికి సంబంధించినవి? 1) గేయ 2) దృశ్య 3) వచన 4) ప్రదర్శన 3. ‘రేనాటి సూర్యచంద్రులు’ ఏ శాఖకు చెందింది? 1) పౌరాణిక 2) సాంఘిక 3) ఇతిహాస 4) చారిత్రక 4. శారదకాండ్రు ఏ ప్రాంతంలో ఉన్నారు? 1) రాయలసీమ 2) తెలంగాణ 3) కోస్తాంధ్ర 4) ఉత్తరాంథ్ర 5. తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది? 1) మౌఖిక జానపద విజ్ఞానం 2) వస్తు సంస్కృతి 3) జానపద కళలు 4) జానపద ఆచారాలు 6. జానపద గేయాల ప్రచురణకు తెలుగులో ఎవరు ఆద్యుడు? 1) మెకంజీ 2) థామ్స్ 3) సి.పి.బ్రౌన్ 4) జె.ఎ.బోయల్ 7. వీరగాథలపై పరిశోధన చేసినవారు? 1) డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి 2) డాక్టర్ జి. లింగారెడ్డి 3) డాక్టర్ తంగిరాల సుబ్బారావు 4) డాక్టర్ జి.ఎస్. మోహన్ 8. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన మహిళా పరిశోధకురాలు? 1) డాక్టర్ రావి ప్రేమలత 2) డాక్టర్ నాయని కృష్ణకుమారి 3) డాక్టర్ పి. కుసుమ కుమారి 4) డాక్టర్ డి.లలిత కుమారి 9. పొడుపు కథలకు పర్యాయపదం? 1) విడుపు కథ 2) ప్రహేళిక 3) మారు కత 4) పైవన్నీ 10. ‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనే సామెతలో ఆమెత పదానికి అర్థం? 1) మేత 2) నగ 3) విందు 4) స్త్రీ డీఎస్సీ(ఎస్ఏ, ఎల్పీ) 2012లో అడిగిన ప్రశ్నలు 1. జానపద సాహిత్యానికి ప్రధాన లక్షణాల్లో ఒకటి? 1) అనామిక లేదా సామూహిక కర్తృత్వం 2) నిర్ణీత రచనా కాలం 3) కృతకశైలి 4) లిఖిత రచన 2. అప్పగింతలు, అలక పాటలు ఈ శాఖకు చెందినవి? 1) శ్రామిక గేయాలు 2) పారమార్థిక గేయాలు 3) బాల గేయాలు 4) స్త్రీల పాటలు 3. జానపదోచ్ఛారణలో ఎలా జరుగుతుంది? 1) ఒత్తులు నిలుస్తాయి 2) పదాదివకారం నిలుస్తుంది 3) మార్ధన్య దంతమాలీయభేదం నిలుస్తుంది 4) చకారం సకారం అవుతుంది 4. డాక్టర్ బిరుదురాజు రామరాజు దేనికి ప్రసిద్ధులు? 1) కార్యపరిష్కారణ శాస్త్రం రాసినందుకు 2) విశ్వవిద్యాలయ ఆచార్యులైనందుకు 3) జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు 4) జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు 5. జానపద గేయాల్లో రామాయణ పాటలు ఏ శాఖకు చెందినవి? 1) శృంగార గేయాలు 2) శ్రామిక గేయాలు 3) పౌరాణిక గేయాలు 4) చారిత్రక గేయాలు సమాధానాలు 1) 1; 2) 4; 3) 4; 4) 3; 5) 3.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement