-
కిరాణా కొట్టులా హెచ్సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం! చదవండి: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు -
విభేదాలు సహజమే!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కోసం కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలోని మూఢవిశ్వాసాలను తరిమేసేందుకు, సమాజంలో మార్పు తీసుకురావటంలో బాధ్యత తీసుకోవాలని ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, శకటాల కళాకారులకు ప్రధాని సూచించారు. ‘బలోపేతమైన, ప్రగతిశీల దేశాన్ని నిర్మించేందుకు అవసరమైన శక్తి అందరు ఐకమత్యంగా ఉంటేనే లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంలో తప్పులేదన్నారు. కులం, మతం, సమాజం వంటి జాఢ్యాలను పక్కనపెట్టి సమాజాన్ని ఏకం చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలటాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచే ప్రారంభించాలని యువతకు సూచించారు. 2019 కల్లా స్వచ్ఛభారత్ లక్ష్యాలను చేరటంలో చొరవతీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశసేవలో భాగంగా పౌర,మిలటరీ పురస్కారాలను పొందిన వారి గురించి యువత తెలుసుకుని ప్రేరణ పొందాలని మోదీ తెలిపారు. కంబోడియాతో 4 ఒప్పందాలు భారత్–కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషిచేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య మధ్య రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై శనివారం ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కంబోడియాకు ఆరోగ్యం, రోడ్ల అనుసంధానత, డిజిటల్ అనుసంధానత తదితర అంశాల్లోనూ రుణసాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని.. ప్రపంచశాంతికి ఇది పెనువిఘాతం కల్గిస్తోందని మండిపడ్డారు. కాగా, ప్రధాని మోదీ ఫిబ్రవరి 9నుంచి నాలుగురోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. వరుసగా పాలస్తీనా, యూఏఈ, ఓమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. -
ఆ నామమే చాలు...
ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ‘ఇతన్ని చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? లేక ఇదంతా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా? విష్ణువా?’ అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి ‘‘మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి’’ అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ‘‘ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణుభక్తుడు. అయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటినుంచి కలిపురుషుడు వీలయినంత వరకు హరినామస్మరణ జరగకుండా అడ్డుపడుతూ, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటి కాలిమీదనైనా నిలబడగలుగుతోంది. -
యువభేరికి ప్రభుత్వం ఆటంకాలు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులో ఏర్పాటుచేసిన యువభేరి కార్యక్రమానికి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. యువభేరి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివస్తున్న విద్యార్థులను అధికారులు అడ్డుకుంటున్నారు. పలుచోట్లు ఆర్టీఏ అధికారులు విద్యార్థుల బస్సులను అడ్డుకున్నారు. బస్సులను వదలకపోతే ధర్నాకు దిగుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. -
ప్రశాంత్ న్యాయవాదికి ఆటంకాలు కలిగించవద్దు
హెచ్సీయూ వర్గాలకు హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి ప్రశాంత్ను కలిసేందుకు అతని తరఫు న్యాయవాదికి ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని హైకోర్టు గురువారం యూనివర్సిటీ వర్గాలకు స్పష్టం చేసింది. ప్రశాంత్ను కలిసే విషయంలో ముందస్తు సమాచారంతో వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి తేల్చి చెప్పింది. అంతేకాక తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెచ్సీయూ వీసీ అప్పారావు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అప్పారావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ప్రశాంత్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ విచారించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్ ప్రశాంత్ను కలిసేందుకు యూనివర్సిటీకి వెళితే వర్సిటీ భదత్రా సిబ్బంది అడ్డుకుని బెదిరించారని తెలిపారు. దీనికి యూనివర్సిటీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, క్లయింట్ను కలిసే హక్కు న్యాయవాదికి ఉందన్నారు. ప్రశాంత్ను కలిసే విషయంలో వర్సిటీ వర్గాలకు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని అతని తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement