breaking news
dio visit
-
అసలేం తిన్నారు ?
సాక్షి, కూనవరం (తూర్పుగోదావరి) : కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐఓ) డాక్టర్ మల్లిక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. వైద్యశిబిరం ఏర్పాటు కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కూనవరం (రంపచోడవరం): కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐఓ) డాక్టర్ మల్లిక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. వైద్యశిబిరం ఏర్పాటు కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
గవద వ్యాధితో గజగజ
గోనబావి (గుమ్మఘట్ట): గోనబావి గ్రామంలో గవద (గొంతువాపు) వ్యాధి చిన్నారులను గజగజ వణికిస్తోంది. శుక్రవారం ఈ వ్యాధి లక్షణాలతో రెండో తరగతి చదువుతున్న వడ్డే అనిల్(7) మృతి చెందాడు. 24 గంటలు గడవక ముందే 4వ తరగతి విద్యార్థిని అక్షయ శనివారం గొంతు వాపు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంచం పట్టింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు జిల్లా ఇమ్యూనేజేషన్ అధికారి (డీఐఓ) పురుషోత్తం, వైద్యులు రామాంజినేయులు, రమేష్, సీహెచ్ఓ వెంటేశ్వర్లుతో కలసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికెళ్లి చిన్నారులకు చికిత్సలు అందజేశారు. డీఐఓ మాట్లాడుతూ చిన్నపిల్లలకు టీకాలు క్రమం తప్పకుండా వేయాలని, వీటి ప్రక్రియ సక్రమంగా చేపట్టకపోవడం, అపరిశుభ్రత, కలుషిత నీరు తాగడం వల్ల ఈ వైరస్ ప్రబలే అవకాశం ఉందన్నారు. అనంతరం వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థిని అక్షయను అనంతపురం ఆస్పత్రిలో చేర్చేందుకు వెంట తీసుకెళ్లారు.