-
రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. అతని కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. -
పోలీసు కస్టడీకి సింగ్ సోదరులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)ను రూ. 2,397 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఫోర్టిస్ హెల్త్కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. ‘ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును పక్కదోవ పట్టింది. స్వభావరీత్యా ఈ నేరం చాలా తీవ్రమైనది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పక్కదోవ పట్టిన నిధుల ఆచూకీ తెలుసుకోవడానికి, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వారిని పట్టుకోవడానికి నిందితుల పోలీసు కస్టడీ అవసరమని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ పేర్కొన్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ శివీందర్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పోలీసులు, కేంద్రానికి నోటీసులు ఇచ్చే విషయంపై ఉత్తర్వులను కోర్టు రిజర్వ్లో ఉంచింది. -
‘ఆప్’ ఎమ్మెల్యేకు జైలుశిక్ష
న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్దత్కు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధించింది. సోమ్దత్ ప్రస్తుతం పాత ఢిల్లీలోని సదర్ బజార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారంలోనే మరో ఆప్ ఎమ్మెల్యే జైలుకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినందుకు కొండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్కుమార్కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నెల జూన్ 29న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్.. సోమ్దత్ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. శిక్షను సవాల్ చేయడానికి సోమ్దత్కు మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు జనవరి 2015 నాటిది. అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమ్దత్ తనపై దాడి చేసినట్లు సంజీవ్ రానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్దత్ తన అనుచరులు 50-60 మందితో కలిసి తన ఫ్లాట్కు వచ్చి పదే పదే బెల్ కొట్టారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను బయటకి లాగి బేస్బాల్ బ్యాట్తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సునీల్ ఎమ్మెల్యే సోమ్దత్ బేస్బాల్ బ్యాట్తో రానాపై దాడి చేయడం నిజమేనని కోర్టుకు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్ దక్కకుండా దెబ్బ తీసేందుకే బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అందుకు రానాను పావులా వాడుకున్నారని సోమ్దత్ కోర్టుకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సోమ్దత్ ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఆయన జైలు శిక్ష విధించినట్టు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. -
పచౌరీపై అభియోగాలు మోపండి
న్యూఢిల్లీ: టెరీ (భారత్లో విద్యుత్, పర్యావరణం, సహజ వనరులపై పరిశోధనలు చేసే సంస్థ) మాజీ చీఫ్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అభియోగాలు మోపాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యంగా వ్యవహరించడం), 354 (ఏ) (శారీరకంగా తాకేందుకు ప్రయత్నించడం), 509 (వేధించడం, అసభ్య పదజాలం, అసభ్య చేష్టలకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చారు గుప్తా ఆదేశించారు. 2015, ఫిబ్రవరి 13న టెరీ మాజీ ఉద్యోగి ఒకరు తనతో పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మార్చి 21న పచౌరీకి ముందస్తు బెయిల్ మంజూరైంది. 2016 మార్చి 1న ఢిల్లీ పోలీసులు 1,400 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. -
శశిథరూర్పై చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్పై చార్జిషీట్ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు థరూర్ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్షీట్లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు. తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్స్టార్ హోటల్ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్ ట్విటర్లో పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement