-
సి.రామాపురంలో ఉద్రిక్తత
తిరుపతి : సి.రామాపురంలోని డంపింగ్యార్డును తరలించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న నిరవధిక నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సి.రామాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత మూడు రోజులుగా రామాపురంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, నిరవధిక నిరసనకు దిగిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు 50మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పలువురు మహిళా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. -
మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలో సేకరించిన చెత్తాచెదారంను తమ గ్రామ సమీపంలో డంపింగ్ చేయడంపై తట్టివారిపల్లె, పుంగనూరువాండ్లపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆదివారం చెత్తను మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం వద్ద దింపి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని బాహుదా కాలువలో తొలగించిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి తమ గ్రామాల సమీపంలో డంపింగ్ చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీకి పంచాయతీలో డంపింగ్ యార్డు కేటాయించినా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను అక్కడకు చేర్చకుండా తమ గ్రామాల్లో దించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ పట్టణంలోని చెత్తను తీసుకువచ్చి చెరువు, తూముల్లో దించడం దారుణమని మండిపడ్డారు. వెంటనే చెత్తదిబ్బలు తొలగించకుంటే కార్యాలయం ఎదుట గ్రామస్తులంతా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. -
నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డు
రామన్నపేట: గ్రామాల్లో పారిశుద్ధ్యంను మెరుగుపరిచే విషయంలో పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి కరువయింది. ఉపయోగించేవారు లేక లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్యార్డులు నిరుపయోగంగా మారాయి. రామన్నపేట మండలంలో 20గ్రామపంచాయతీలున్నాఇయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీపథకం కింద 17గ్రామాల్లో డంపింగ్యార్డులను తవ్వడం ప్రారంభించారు. స్థలాభావంవల్ల నిధానపల్లి, ఇస్కిళ్ల, సిరిపురంగ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. 10మీటర్ల వెడల్పు, 15మీటర్ల పొడవు, 2మీటర్లలోతు ఉండేవిధంగా 550 పనిదినాలు, రూ. 1.48లక్షల అంచనావ్యయంతో డంపింగ్యార్డ్లను తవ్వడం ప్రారంభించారు. వీటిలో బోగారం, దుబ్బాక, జనంపల్లి, కుంకుడుపాముల, లక్ష్మాపురం, మునిపంపుల, రామన్నపేట, సూరారం, ఇంద్రపాలనగరం, ఉత్తటూరు, వెల్లంకి, ఎన్నారం గ్రామాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పల్లివాడ, నీర్నెముల, కక్కిరేణి గ్రామాల్లో వివిధ కారణాలవల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గేదెనుకొని తాడుకు భయపడ్డ చందంగా ప్రభుత్వం లక్షలు వెచ్చించి డంపింగ్యార్డులను తవ్వి, వేలుపెట్టి చెత్త బండ్లను సమకూర్చలేక పోయింది. కూడిపోతున్న డంపింగ్యార్డులు పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోని మురుగుకాలువలు, వీధుల్లో తీసిన చెత్తను ట్రాక్టర్లు, తోపుడుబండ ్లద్వారా డంపింగ్యార్డులకు చేరవేయవలసి ఉంటుంది. డంపింగ్ యార్డులను తవ్వే సమయంలోనే గ్రామీణ నీటిసరఫరా పారిశుద్ధ్య విభాగంవారు చెత్తను రవాణా చేయుటకు అవసరమైన బండ్లను సమకూర్చుటకు అవసరమైన రిక్వైర్మెంట్ను కూడా తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏఒక్కగ్రామానికి బండ్లను అందజేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీసిన చెత్తను జనావాసాలకు దగ్గరల్లో పడవేస్తున్నారు. అక్కడ పందులు సంచిరిస్తూ జుగుత్సాకరమైన వాతావరణంను సృష్టిస్తున్నాయి. లక్షలువెచ్చించి తవ్విన డంపింగ్యార్డులలో పక్కనున్న మట్టిజారి కూడిపోతున్నాయి. కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి....నక్క రామనర్సయ్య,జనంపల్లి వీధులు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సర్కారువాళ్లు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీధుల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ప్రజలు కూడా తమ ఇంటి మాదిరిగానే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తబండ్లను సమకూర్చాలి.....దేశపాక లక్ష్మినర్సు సర్పంచ్ ఎన్నారం ప్రభుత్వం డంపింగ్యార్డులను ఏర్పాటు చేసింది కానీ చెత్త బండ్లను ఇవ్వడం మరిచింది. గ్రామాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్యార్డులకు చేరవేయాలనేది మంచి ఆలోచన. ప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లు చెత్తను చేరవేయడానికి తోపుడు బండ్లను సమకూర్చాలి. -
ప్రజల ప్రాణాలతో చెలగాటం
జవహర్నగర్, న్యూస్లైన్: నగరానికి సమీపంలో ఉన్నా జవహర్నగర్ ప్రజలు దుర్భరజీవితాలను గడుపుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న డంపింగ్యార్డ్ రీసైక్లింగ్ ప్లాంటును సోమవారం ఆయన సందర్శించారు. ఫౌండేషన్ ప్రతినిధులతో మాట్లాడి రీసైక్లింగ్తో కలిగే ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్యార్డ్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ఇక్కడి డంపింగ్యార్డ్తో చుట్టుపక్కల 20గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూగర్భజలాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇక్కడ నివసించే వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలని, వీరందరికీ సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జనావాసాల మధ్య నుంచి డంపింగ్యార్డ్ను ఎత్తేసేవరకు ప్రజలు పోరాటం చేయాలని, దానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ విజయేందర్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజశేఖర్, డీఎస్ఎస్ జిల్లా అధ్యక్షురాలు బి.అనంతలక్ష్మి, టీఆర్ఎస్ జవహర్నగర్ అధ్యక్షుడు గండి రాంచందర్, నాయకులు జిట్ట శ్రీనివాస్రెడ్డి, ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్యాదవ్, మహేష్, కృష్ణ, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు యాదవ్, చాకలి నాగేష్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement