breaking news
Counting the municipal election
-
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలోని జిల్లా సమాఖ్య భవనంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ పరిధిలోని 31 వార్డుల ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్కు మూడు చొప్పున మూడు రౌండ్లలో 31 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 10 గంటల లోపు పూర్తవుతాయి. కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సాయిలు పరిశీలించారు. మరోవైపు ఇద్దరు సీఐలతో పాటు నలుగురు ఎస్ఐలు, 8 మంది ఎఎస్ఐలతో పాటు 21 మంది పోలీసు సిబ్దంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. -
ఆగిన కౌంటింగ్
సాక్షి,చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ సహా జిల్లాలో మరో ఆరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోరుుంది. బుధవారం కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఈ పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలకు లోబడి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో రాజకీయ పార్టీల నేతలు ఊహించినట్లుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు లాగా, మే 16 తరువాత మున్సిపల్ ఫలితాలు వెల్లడించాలని తీర్పు రాలేదు. ప్రధాన రాజకీయపార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఫలితాలు వెల్లడించడం మేలేనన్నట్లుగా ఉన్నాయి. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, మదనపల్లి మున్సిపాల్టీలకు 9వ తేదీన కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. రెండు రోజుల తరువాత రిటర్నింగ్ స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోనే ఉంటారు బి.కొత్తకోట, న్యూస్లైన్: తంబళ్లపల్లె నియోజకవర్గంలో జెడ్పీటీసీ బరిలో ఉన్న తన మద్దతుదారులు పోటీ నుంచి తప్పుకోరని తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి హైదరాబాదులో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన మంగళవారం రాత్రి జీ.శంకర్యాదవ్తో కలిసి బి.కొత్తకోటకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మారిన వ్యక్తని, అందుకే టీడీపీలో చేరానని చెప్పారు. పార్టీలో చేరే విషయంలో చివరి వరకు అనుమానంగానే ఉండేదని, చివరకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరానని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జెడ్పీటీసీ బరిలో ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకొని టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు కలిచర్ల సమాధానమిస్తూ తన మద్దతుదారులు పోటీ నుంచి విరమించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరుగురిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా గెలుస్తారని చెప్పారు. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి స్థాపించిన పాదరక్షల పార్టీ ఎక్కడా కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ నాయకుడు జీ.శంకర్ మాట్లాడుతూ ప్రభాకర్రెడ్డి బాటలో ముందుకుపోతామని చెప్పారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే తమ కుటుంబం ఆయనతోనే ఉందన్నారు. ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీ పదవులను కైవశం చేసుకుంటామని జోస్యం చెప్పారు. నాడు ప్రత్యర్థులు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్యాదవ్, ప్రభాకర్రెడ్డి కాంగ్రెస్, పీఆర్పీ అభ్యర్థులుగా పోటీపడ్డారు. ప్రభాకర్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం, శంకర్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడంతో ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. అప్పటి నుంచి కలిచర్ల శంకర్ను ఉద్దేశించి బెంగళూరు బీసీ వద్దు.. స్థానిక బీసీకి టికెట్ ఇచ్చుంటే మద్దతు ఇచ్చేవాడిని అంటూ పత్రికా, బహిరంగ సమావేశాల్లో బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో శంకర్, కలిచర్ల ఇద్దరూ టీడీపీ గూటికే చేరి ఒక్కటి కావడం గమనార్హం.అధికారి గెలుపు అభ్యర్థులతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 813 మంది అభ్యర్థుల భవితవ్యం ఏప్రిల్ 9వ తేదీన తేలనున్నది. చివరి నిమిషంలో కౌంటింగ్ వాయిదా ఆరు మున్సిపాల్టీలు, చిత్తూరు కార్పొరేషన్లో ఓట్లు లెక్కింపునకు సంబంధించి లెక్కింపు కేంద్రాల్లో ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు ప్రారంభించి ఆయా మున్సిపల్ కమిషనర్లు సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టీ.వీ చానల్స్లో హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలను వాయిదా వేసినట్లు ప్రకటనలు రావడంతో రాష్ట్ర మున్సిపల్పరిపాలనా అధికారులను అడిగి నిర్థారించుకుని కౌంటింగ్ వాయిదావేశారు.అంతకు ముందే ఏప్రిల్ 2వ తేదీనే ఫలితాలు వెల్లడించమన్నా వెల్లడించే విధంగా డ్యూటీ సిబ్బందికి, మీడియాకు పాస్లు సిద్ధం చేశారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు పాస్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫలితాల కోసం మరోవారం : మార్చి 30న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం మరో వారం రోజులపాటు ఎదురుచూడాలి. వార్డుల్లో వివిధపార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వందలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్ తెలుసుకునేందుకు మరొక వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.వెఎస్సాఆర్సీపీ, తెలుగుదేశం అభ్యర్థులతో పాటు, ఆయా మున్సిపాల్టీల్లో నాయకత్వం వహించి ప్రచార సారథ్యం వహించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్చార్జ్లకు కూడా తమ ఎన్నికల లెక్కలు సరైనవో కాదో తెలుసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందా అన్న మీమాంసలోనూ రాజకీయపార్టీలు ఉన్నాయి. అయితే జిల్లాలో అత్యధిక మున్సిపాల్టీలు కైవసం చేసుకునే దిశగా వైఎస్సాఆర్సీపీ ఉందని పోలింగ్సరళి అధారంగా తెలుస్తున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు ముందు ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్లో, ఏప్రిల్ 11న తిరుపతి, చిత్తూరు డివిజన్లలో నిర్వహించనున్నారు. ఫలితాల ప్రభా వం స్థానిక ఎన్నికలపై ఎలా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.