breaking news
computers usage
-
రోజుకు 3 గంటలు చూసేస్తున్నారు.. అమేజాన్ సర్వేలో షాకింగ్ విషయాలు
వేసవి సెలవుల్లో పిల్లలు కనీసం 3 గంటలు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్తో గడుపుతున్నారని దేశంలో 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ‘అమేజాన్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుందని వారు భయపడుతున్నారు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు. కాకుంటే పిల్లల్ని స్క్రీన్ మీద నుంచి దృష్టి మళ్లించేలా చేయడమే అసలు సమస్య. మన దగ్గర సమయం లేక పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక వారి చేతుల్లో పెడుతున్న ఫోన్ ఇవాళ విశ్వరూపం చూపిస్తున్నదని అమేజాన్ సంస్థ తాజాగా కాంటార్ అనే ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వే చెబుతోంది. 10 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేయగా 69 శాతం మంది ఇప్పుడు మొదలైన వేసవి సెలవుల్లో పిల్లలు మూడు గంటలకు మించి ఫోన్గాని కంప్యూటర్ స్క్రీన్గాని చూస్తున్నారని అంగీకరించారు. మొత్తం 85 శాతం మంది తమ పిల్లలు అవసరానికి మించి ఫోన్లు చూస్తున్నారని ఇందుకు తాము చాలా ఆందోళన చెందుతున్నామని తెలియచేశారు. అంతంత సేపు వాళ్లు ఫోన్ చూడటం వల్ల మజ్జుగా ఉండటమే కాదు సోమరులుగా తయారవుతున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్నారు అని తెలియచేశారు. ► రెక్కలు కత్తిరించి అయితే ఈ తప్పు పిల్లలదా? వారు నిజంగా ఆడుకోరా? గెంతరా? అల్లరి చేయరా? అంటే చేస్తారు. కాని ఆటస్థలాలు లేకపోవడం, వీధుల్లో ఆడలేకపోవడం, అపార్ట్మెంట్లలో సెల్లార్లు ఉన్నా ఆడటానికి కమిటీలు అంగీకరించకపోవడం, పార్క్లు నామమాత్రంగా ఉండటం... వీటన్నింటి వల్ల రోజువారి జీవితంలో బడి నుంచి వచ్చాక మాత్రమే వారు ఫోన్ చేతిలోకి తీసుకునేవారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్లో, పని వొత్తిడి వల్లో, పిల్లలతో గడిపే సమయం వారు తమ ఫోన్కు ఇస్తున్నందు వల్లో పిల్లలు ఫోన్ చూస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో వారికి ఆ అలవాటు వ్యసనం స్థాయికి వెళ్లడం, నివారిస్తే అలగడం మనస్తాపం చేస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ► ఇలా చేయాలని ఉంది సర్వేలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ‘మీ పిల్లలు ఈ సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు’ అనే ప్రశ్నకు ఇంగ్లిష్ నేర్చుకోవడం (50 శాతం), నైతిక విషయాలు సంఘ మర్యాదలు తెలుసుకోవాలి (45 శాతం), కళలు నేర్చుకోవాలి (36 శాతం), ఆడుకోవడం విహారాలు చేయడం (32 శాతం) సమాధానం చెప్పాలి. అందరూ ఆశిస్తున్నది విజ్ఞానం వినోదం కలగలిసి ఉంటే బాగుంటుందని. ‘పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి కొత్త విషయాలు నేర్పించడంలో వారిని ఉత్సాహపరచాలని ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాతో అన్నారు’ అని సర్వే చేసిన కాంటార్ ఏజెన్సీ ప్రతినిధి తెలియచేశారు. ► మెల్లగా మళ్లించాలి స్క్రీన్ టైమ్ను తగ్గించాలంటే అది ఒక్కసారిగా బంద్ చేయకుండా మెల్లగా తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్లు రీచార్జ్ చేయకుండా నిరుత్సాహ పరచడం, ఇంట్లో రౌటర్ ఉంటే దానిని తరచూ ఆఫ్ చేస్తూ ఉండటం, ఈ పుస్తకం చదివితే ఫోన్ ఇస్తాను, కాసేపు ఆడుకుంటే ఇస్తాను, ఫ్రెండ్స్ను కలిసి వచ్చాక ఇస్తాను అని వారిని దారి మళ్లించడం, విహారాలకు తీసుకెళ్లడం, ఆడుకునే సమయం– కథలు చదివే సమయం– ఫోన్ సమయం అని టైమ్ విభజించి ఆ టైమ్ పాటించడం... అలా మెల్లగా ఫోన్ టైమ్ను తగ్గించాలి. పిల్లలు ఫోన్ చూడటం వల్ల వారి మానసిక, బౌతిక స్థితుల కంటే వారు చూస్తున్నది ఆరోగ్యకరమైనదో కాదో పరిశీలించే తీరికలో కూడా తల్లిదండ్రులు లేకపోతే అట్టి సర్వేలకు అందనంత తీవ్ర ఆందోళన చెందాల్సిందే. -
కంప్యూటర్లను కాపాడే.. ఎథికల్ హ్యాకర్
అప్కమింగ్ కెరీర్: కార్యాలయాల్లో కంప్యూటర్ లేనిదే పని జరగని రోజులివీ. అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. సమస్త సమాచార మార్పిడి ఆన్లైన్లోనే సాగుతోంది. టెక్నాలజీతో లాభాలు ఉన్నట్లే.. నష్టాలూ ఉన్నాయి. కంప్యూటర్లో నమోదు చేసిన సమాచారమంతా భద్రంగా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఒకరు ఉపయోగిస్తున్న కంప్యూటర్లో అక్రమంగా ప్రవేశించి, డేటాను అస్తవ్యస్తం చేసి, అంతులేని నష్టం చేకూరుస్తున్న ఘనులు అన్ని దేశాల్లో ఉన్నారు. మరి, కంప్యూటర్లను సురక్షితంగా మార్చలేమా? అలా మార్చేవారే.. ఎథికల్ హ్యాకర్లు. మనదేశంలో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే: ఎవరికీ తెలియకుండా అక్రమంగా కంప్యూటర్లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే యజమాని అనుమతితోనే కంప్యూటర్లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం. కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్ నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. భారీ డిమాండ్: భారత్లో ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం ఎంతో ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్కు సరిపడ నిపుణులు అందుబాటులో లేరని చెబుతున్నాయి. ప్రధానంగా బీపీఓ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వీరికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎథికల్ హ్యాకర్లకు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది. రాణించాలంటే: ఎథికల్ హ్యాకర్గా వృత్తిలో పేరు తెచ్చుకోవాలంటే.. హ్యాకర్లు ఉపయోగించే విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ సంపూర్ణంగా ఉండాలి. జావా, సీ++ వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు అవసరం. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘యూనిక్స్’పై పరిజ్ఞానం సంపాదించాలి. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక వైఖరి ఉండాలి. అర్హతలు: మనదేశంలో ఎథికల్ హ్యాకింగ్పై సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: ఎథికల్ హ్యాకర్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో స్కిల్స్ పెంచుకుంటే వేతనం పెరుగుతుంది. మనదేశం కంటే విదేశాల్లో అధిక వేతనాలు అందుతున్నాయి. అక్కడ అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్లకు ఏడాదికి 50 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వేతన ప్యాకేజీ ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: అంకిత్ ఫాడియా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ వెబ్సైట్: www.ankitfadia.in కోనిగ్ సొల్యూషన్స్ వెబ్సైట్: www.koenig-solutions.com ఇన్నోబజ్ నాలెడ్జ్ సొల్యూషన్స్ వెబ్సైట్: www.innobuzz.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -ఘజియాబాద్ వెబ్సైట్: www.imt.edu భద్రతకు ఢోకాలేని కోర్సు ‘‘టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కేకొద్దీ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుంటాయి. ముఖ్యంగా గోప్యంగా ఉండాల్సిన బ్యాంకిం గ్, ఫైనాన్స్, ఆర్థిక, రక్షణ, వ్యక్తిగ త విషయా లు బయటకు పొక్కితే ఊహించని ప్రమాదం సంభవించినట్లే. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఆన్లైన్ మోసాలు, ఆర్థిక కార్యకలాపాల్లో చొరబాట్లు ఎక్కువయ్యాయి. ఫోన్కాల్స్, ఈ-మెయి ల్స్, ఎస్.ఎం.ఎస్. వంటి దైనందిన టెక్నాలజీలోనూ ఎన్నో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరిక ట్టేందుకు, మోసగాళ్ల ఆగడాలను అడ్డుకునేందుకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఙానమే ఎథికల్ హ్యాకింగ్. దీన్ని సవాల్గా తీసుకొని పనిచేసే వారికి అద్భుతమైన కెరీర్ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, ఐటీ సెక్టార్లో మంచి అవకాశాలున్నాయి. సంతృప్తికరమైన వేతనంతో భద్రమైన కొలువును సంపాదించవచ్చు. -ఎన్.రామకోటేశ్వరరావు, ఐటీ సర్టిఫికేషన్ శిక్షకులు