breaking news
Commonwealth sport
-
రాష్ట్రానికి మీరే గర్వకారణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కామన్వెల్త్ క్రీడల్లో అయిదు రజత పతకాలను గెలుచుకున్న క్రీడాకారులను హోం మంత్రి కేజే. జార్జ్, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డిలు సత్కరించారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ (కేవోఏ) గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీఎన్. ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), అశ్విని పొన్నప్ప (షటిల్ బ్యాడ్మింటన్), వీఆర్. రఘునాథ్, ఎస్వీ. సునీల్, నిఖిన్ తిమ్మయ్య (హాకీ)లు సత్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జార్జ్, క్రీడాకారుల సాధన అపూర్వమని కొనియాడారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరాశ చెందరాదని ధైర్యం చెప్పారు. కేవోఓ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలను గెలుచుకున్న వారికి నగదు బహుమతితో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని గుర్తు చేశారు. నివేశనంతో పాటు స్వర్ణ పతక విజేతలకు రూ.25 లక్షలు, రజత పతక విజేతలకు రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అక్టోబరులో నిర్వహించే బ్రహ్మాండమైన కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేస్తారని తెలిపారు. -
ఇదెక్కడి చోద్యం సగం పరికరాలు మాయం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన బస్సులకు అమర్చిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాల్లో సగం ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో మొత్తం 3,700 బస్సులకు వీటిని అమర్చారు. డీటీసీ అధికారి ఒకరు అందించిన వివరాల ప్రకారం 2010లో వీటిని అమర్చారు. అందులో 1,800 లకు పైగా పరికరాలు కనిపించడం లేదు. కాగా ఇప్పుడివికాస్తా గల్లంతవడంతో బస్సులను సమర్థంగా నిర్వహించడంతోపాటు ఏ బస్సు ఏ సమయంలో ఎక్కడుందనే విషయం ప్రయాణికులకు తెలిసేవిధంగా చేయాలనే డీటీసీ లక్ష్యం కాస్తా దెబ్బతింది. బస్సు సేవలను మెరుగుపరచాలనే లక్ష్యంతో 3,700 జీపీఎస్ పరికరాలను శీతల, శీత లేతర బస్సులకు అప్పట్లో బిగించారు. బస్సులు ఎక్కడ ఉన్నాయనే విషయం ప్రయాణికులకు తెలిసేందుకు వీలుగా అప్పట్లో నగరంలోని అనేక బస్టాండ్లలో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలాఉంచితే జీపీఎస్ పరికరాల గల్లంతుపై డీటీసీ పోలీసులకు ఫిర్యాదుచేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు డీటీసీ బస్సుల్లో ఇప్పటికేఉన్న జీపీఎస్ పరికరాలు పనిచేయడం లేదు. ఇటువంటివన్నీ జరగడానికి డ్రైవర్లే కారణమై ఉండొచ్చని ఓ అధికారి ఆరోపించారు. జీపీఎస్లు సరిగా పనిచేస్తే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుందని, ఇందుకోసం మిలీనియం డిపోలో కంట్రోల్ రూంనుకూడా ఏర్పాటు చేశామన్నారు. భారీ సంఖ్యలో జీపీఎస్ పరికరాలు మాయమవడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. -
రిమ్జిమ్ రిమ్జిమ్ ఇ-రిక్షా
కొందరికి అవి జీవనాధారం: మరి కొందరికి ఓ బెడద న్యూఢిల్లీ: బన్సీలాల్ రిక్షా తొక్కి నెలకు ఐదువేల రూపాయలు సంపాదించేవాడు. ఇప్పుడు కాళ్లతో తొక్కే రిక్షాకు బదులుగా బ్యాటరీతో నడిచే దానికి మారాడు. ఇప్పుడు అతని ఆదాయం నెలకు రూ.15వేలపైనే. రాజధాని నగరంలో ఇ-రిక్షాల ఆగమనం ఎందరికో తిండి పెడుతూ, అటు పేదలు ఇటు పర్యావరణవేత్తల ఆదరణ చూరగొంటున్నాయి. ఇదివరకు ‘చేతికి-నోటికి’ అన్న చందంగా బతుకు గడిపిన రిక్షా కార్మికులు ఇప్పుడు కొంత మెరుగైన జీవనం గడుపుతున్నామంటున్నారు. ఇ-రిక్షాలకు మారిన ఎందరో కార్మికులు ఇక తమ జీవనం సుఖప్రదం కాగలదని భావిస్తున్న తరుణంలోనే పూర్వ యూపీఏ ప్రభుత్వం వాటిని చట్ట వ్యతిరేకమైనవిగా ప్రకటిస్తూ ఏప్రిల్ 24న నోటిఫికేషన్జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల అనంతరం స్పందించిన రవాణా అధికారులు ఇ-రిక్షాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని సుమారు 30వేల ఇ-రిక్షాల కార్మికులు, వారి కుటుంబాలు భయాం దోళనకు గురయ్యారు. అయితే నూతన ప్రభుత్వంలో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతవారం చేసిన ప్రకటన ఈ కుటుం బాలకు ఊపిరిలూదింది. రాజధాని నగరంలో 30 వేలకు పైగా ఇ-రిక్షాలు తిరుగుతున్నాయని బ్యాట రీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అనుజ్ శర్మ చెప్పారు. ఈ సంఖ్యకు కార్మికుల కుటుంబాలను కూడా చేరిస్తే కనీసం 1.20 లక్షల మంది ఇ-రిక్షాలపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ‘‘ఇ-రిక్షాను కొన్నప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. రోజంతా సైకిల్రిక్షా తొక్కి సాయంత్రానికి అలసిపోయే వాడిని. ఇప్పుడు ఈ కొత్త రిక్షాలో ఎక్కువ మందిని ఎక్కిం చుకోవచ్చు, ఎక్కువగా సంపాదించవచ్చు’’ అని 40 ఏళ్ల బన్సీలాల్ పేర్కొన్నారు. పర్యావరణ వేత్తలు సైతం ఇ-రిక్షాలను ‘మాధ్యమిక’ ప్రజా రవాణా వ్యవస్థగా అభివర్ణించా రు. వీటి నుంచి ఎటువంటి కాలుష్య ఉద్గారాలు వెలువడవని పేర్కొన్నారు. అయితే వీటిని నడిపే డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రతాపరమైన మార్గదర్శకాలు రూపొందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ‘‘కాలుష్యాన్ని, కార్ల వినియోగాన్ని తగ్గించడంలో ఈ నూతన రవాణా సాధనం ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొం దించాలి’’ అని శాస్త్ర, పర్యావరణ కేంద్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అరుంధతీ సీజెల్ సూచించారు. ఇ-రిక్షాలు కామన్వెల్త్ క్రీడలకు ముందు 2010 లో ఢిల్లీలో మొదటిసారిగా దర్శనమిచ్చాయి. నగరమంతటా అవి విస్తరించడానికి మూడేళ్లు పట్టింది. ఢిల్లీ మెట్రో ఫీడర్ బస్సుల వైఫల్యం కారణంగానే ఇ-రిక్షాలు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి తమ నివాస ప్రాం తాలకు చేరవేసేందుకు ఫీడర్ బస్సులను ప్రవేశపెట్టారు. అయితే అవి సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇ-రిక్షాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతకాలం క్రితం వరకు బస్తీల వరకే పరిమితమైన ఇ-రిక్షాలు ఇప్పు డు రద్దీగా ఉండే రోడ్లు, ఫ్లైఓవర్లపై పరుగులు తీస్తున్నాయి. శిక్షణలేని డ్రైవర్లు వాటిని దురుసుగా నడుపుతుండడంతో ఇతర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రంతా బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు పని చేస్తుందని, గంట కు 20-30 కిలోమీటర్ల వేగంతో వెళుతుం దని బన్సీలాల్ చెప్పారు.ఇ-రిక్షా ఖరీదు రూ.85వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంది. ఇరుకు సందుల్లో కూడా దూసుకుపోతుంది. రవాణా మంత్రి గడ్కరీ ప్రకటన నేపథ్యంలో నగర మున్సిపల్ కార్పొరేషన్లు ఇ-రిక్షాలను ఈ నెలాఖరుకు క్రమబద్ధం చేయాలని నిర్ణయించాయి. వీటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోవడం సమస్యగా మారిందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు డ్రైవర్లకు జరిమానాలు విధిస్తున్నామన్నారు. ఇ-రిక్షాల డిజై న్ లోపాలతో కూడి ఉందని, శిక్షణ లేని డ్రైవర్ల వల్ల ప్రయాణికులకు ప్రమాదకరమని రవాణా విభాగం అధికారి పేర్కొన్నారు.