Civils candidates
-
సివిల్స్ విజేతలు అక్కడ సైన్స్.. ఇక్కడ ఆర్ట్స్..
సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా పలు అఖిల భారత సర్విసులకు అభ్యర్థులను ఎంపిక చేసే అత్యంత క్లిష్టమైన ఎంపిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో జనరల్ స్టడీస్ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్ వరకు అన్నిటిపై.. అభ్యర్థులకు ఉన్న అవగాహనను లోతుగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఇందులో పొందే మార్కులే తుది విజయాన్ని నిర్దేశిస్తున్న పరిస్థితి. దీంతో అకడమిక్గా టెక్నికల్, సైన్స్, మెడిసిన్ వంటి నాన్–ఆర్ట్స్ నేపథ్యాల అభ్యర్థుల్లో 85 శాతం మంది హ్యుమానిటీస్ సబ్జెక్ట్లనే ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుంటున్నారు. ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు. వీళ్లంతా అంతవరకు తాము చదువుకున్న సబ్జెక్ట్ వదిలేసి.. అందుకు భిన్నంగా హ్యుమానిటీస్ వైపు ఎందుకు మళ్లుతున్నారు.. ఎలా విజయం సాధిస్తున్నారు.. ఈ కారణాలపై విశ్లేషణ. ..: సాక్షి, స్పెషల్ డెస్క్ :..⇒ శక్తిదూబె.. సివిల్స్–2024 లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీ పూర్తి చేసుకున్న ఆమె.. సివిల్స్లో మాత్రం ఆప్షనల్ సబ్జెక్ట్గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకున్నారు.⇒ తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని ఎలక్ట్రానిక్స్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసి.. ఆంత్రోపాలజీని ఆప్షనల్గా ఎంచుకున్నారు.⇒ ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యాల అభ్యర్థులు.. సివిల్స్లో ఆప్షనల్ విషయంలో మాత్రం హ్యుమానిటీస్కు ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి మచ్చుకు రెండు ఉదాహరణలివి. వీరిద్దరే కాదు.. 2017 నుంచి 2021 వరకు 76% మంది టెక్, సైన్స్, మెడిసిన్ నేపథ్యాల విజేతలు కాగా.. వీరిలో 85% మంది హ్యుమానిటీస్ను ఆప్షనల్గా ఎంచుకోవడం విశేషం.వనరుల లభ్యతే కారణం.. హ్యుమానిటీస్ను ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకుంటున్న వారు సైతం.. అందులో నాలుగు సబ్జెక్ట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ. ఆప్షనల్ సబ్జెక్ట్గా హ్యుమానిటీస్ విభాగంలోని ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న అంశం.. వనరుల లభ్యత. సివిల్ సర్విసెస్ ఎంపిక ప్రక్రియలో రెండో దశలోని మెయిన్స్లో రెండు పేపర్లుగా 500 మార్కులకు ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ సబ్జెక్ట్కు సంబంధించి పరిపూర్ణ అవగాహన తప్పనిసరి.మెటీరియల్ లభ్యత, శిక్షణ సదుపాయం విషయంలో హ్యుమానీటీస్ సబ్జెక్ట్లకు సంబంధించి పుష్కలమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. కోచింగ్ ఫ్యాకల్టీలో సైతం 90 శాతం మంది ఈ సబ్జెక్ట్లలోనే అందుబాటులో ఉంటున్నారు. విశ్లేషణాత్మక వ్యక్తీకరణ సులభంగా ఉండడం కూడా ఈ సబ్జెక్ట్లను ఎంచుకోవడానికి కారణమని విజేతలు, కోచింగ్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. న్యూమరికల్ పాఠ్యాంశాలు ఉండే మ్యాథ్స్, సైన్స్లు సహనానికి పరీక్షగా మారుతున్నాయి.జీఎస్ పేపర్లకు సమయం ఆదా..హ్యుమానిటీస్ను ఆప్షనల్గా ఎంచుకోవడం వల్ల అభ్యర్థులకు కలిసొస్తున్న మరో అంశం.. జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లకు సమయం ఆదా చేసుకునే అవకాశం. ఒక జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఉండే మెయిన్స్ పరీక్షలో అత్యధిక శాతం అంశాలు సమకాలీన, భౌగోళిక అంశాలు, అంతర్జాతీయ సంబంధాలు, పరిపాలన, చరిత్ర, ఆర్థిక అంశాల నుంచే ఉంటున్నాయి. దీంతో హ్యుమానిటీస్లోని ఏ సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకున్నా.. ఎస్సే, జీఎస్ పేపర్లతో కలిపి చదివే అవకాశం ఉంటోంది. సివిల్స్ మెయిన్స్ ఆప్షనల్స్ విషయంలో హ్యుమానిటీస్ సబ్జెక్ట్లైన ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మిని్రస్టేషన్, సోషియాలజీ, పాలిటీలకు ఎప్పటి నుంచో స్కోరింగ్ సబ్జెక్ట్లనే పేరుంది. విధుల్లోనూ ఉపయోగంహ్యుమానిటీస్ సబ్జెక్ట్ను ఎంచుకుంటే.. భవిష్యత్తులో సివిల్ సర్విస్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధుల విషయంలోనూ స్పష్టత ఏర్పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు పాలిటీ, గవర్నెన్్స, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే.. పాలన పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, పాలనా దక్షతకు సంబంధించిన అంశాలతో సిలబస్ను కూర్చారు. దీనిపై పట్టు సాధించడం ద్వారా విజేతలుగా నిలిస్తే భవిష్యత్తులో విధి నిర్వహణలోనూ సమర్థవంతంగా వ్యవహరించొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలోని రెండో దశ మెయిన్స్లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. వీటిలో రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–2గా ఉంటాయి. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా యూపీఎస్సీ 2025 పేర్కొన్న 26 సబ్జెక్ట్ల నుంచి ఒక సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకోవాలి. మొత్తం 1,750 మార్కులకు ఉండే మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్ట్కే 29 శాతం వెయిటేజీ ఉంటోంది.నాలుగైదు నెలల్లో పట్టు సాధించే అవకాశం ⇒ హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. మంచి గ్రాహక శక్తి ఉన్న అభ్యర్థి నాలుగైదు నెలల్లో సంబంధిత సబ్జెక్ట్లో పట్టు సాధించే అవకాశం ఉండడమే. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు అకడమిక్ అభ్యసనం కోణంలో స్వతహాగా అనలిటికల్ స్కిల్స్ లభిస్తున్నాయి. ఇది కూడా వారికి కలిసొస్తున్న అంశమే. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ ఐఏఎస్ అకాడమీసక్సెస్ రేటు.. 2017 నుంచి 2021 వరకు సివిల్స్లో ఇంజినీరింగ్ అకడమిక్ నేపథ్యం ఉన్న 63.7%అభ్యర్థులు పరీక్షలు రాస్తే.. ఇంజినీరింగ్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని విజేతలైంది మాత్రం కేవలం 5.5%. మన దృక్పథాన్ని విశ్లేషించే అవకాశం⇒హ్యుమానిటీస్ ఆప్షనల్స్ విషయంలో సమాధానం ఇచ్చేటప్పుడు మన దృక్పథాన్ని, అప్పటి వరకు చదివిన అంశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ సబ్జెక్ట్స్కు లోతైన అవగాహన అవసరం. సివిల్స్ ప్రిపరేషన్ గడువుతో పోల్చుకుంటే ఇది కొంత కష్టమైన ప్రక్రియ. అందుకే టెక్ నేపథ్యం ఉన్న వారు హ్యుమానిటీస్ను ఆప్షనల్గా ఎంచుకుంటున్నారు. అలాగే హ్యుమానిటీస్ విషయంలో కోచింగ్ తీసుకోలేని వారికి కూడా విస్తృతమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడమూ సులభం. నా ఆప్షనల్ ఆంత్రోపాలజీ పరిధి ఎక్కువే అయినప్పటికీ.. సిలబస్లోని అంశాలను బేరీజు వేసుకుని చదివాను. – ఇ. సాయి శివాని, సివిల్స్–2024లో 11వ ర్యాంకు (తెలుగు రాష్ట్రాల్లో టాపర్)సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ – 2024 గణాంకాలు⇒ 5.8లక్షలు హాజరైన అభ్యర్థులు ⇒ 14,627 మెయిన్స్కు ఎంపికైన వారు⇒ 2,845 ఇంటర్వ్యూకు ఎంపికైన వారు ⇒ 1009 విజయం సాధించిన వారు -
ఢిల్లీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
ఆక్సిజన్ సిలిండర్తోనే సివిల్స్: రియల్ ఫైటర్ మూగబోయింది!
తిరువనంతపురం: కేరళలో ఆక్సిజన్ సిలిండర్తో 2019లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసిన లతీషా అన్సారీ మృతి చెందారు. కాగా జూన్ 16 ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అరుదైన జన్యు పర వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించడంతో పాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఒక పక్క తీవ్రమైన వ్యాధి బాధిస్తున్నా..లెక్క చేయకుండా సివిల్స్ పరీక్షను రాసి, వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ధైర్యం మూగబోయింది. అమృతావర్షిణి అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మృతిపై అమృత వర్షిణి ఫౌండర్ లతా నాయర్ రియల్ ఫైటర్ అంటూ నివాళులర్పించారు., కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(27) పుట్టినప్పటి నుంచి టైప్–2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. వీటితో పాటు పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినాసివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరు కావడం విశేషంగా నిలిచింది. లతీషాకు ఇతర ఆసక్తులు కూడా ఉన్నాయి. అందులో కీబోర్డ్ ప్లే చేయడం. టెలివిజన్లో సంగీత ప్రదర్శనతో పాటుగా ఆమె యూట్యూబ్ ఛానెల్ను కూడా నిర్వహించేది. లతీషా కొన్ని నెలలు తాత్కాలికంగా ఒక బ్యాంకులో పనిచేసింది, కానీ ఆమె పల్మనరీ హైపర్టెన్షన్ను తీవ్రతరం కావడంతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వైకల్యం ఉన్న పిల్లల కోసం ఆమె ఇంటి నుంచే ఆమె ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్పేది. చదవండి: Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్: సీరం కీలక ప్రకటన -
ఆక్సిజన్ సిలిండర్తో సివిల్స్ పరీక్ష
తిరువనంతపురం: ఓ సివిల్స్ అభ్యర్థి తపనను అనారోగ్యం కూడా అడ్డుకోలేకపోయింది. ఎముకల వ్యాధితో బాధ పడుతున్నా, ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(24) పుట్టినప్పటి నుంచి టైప్ –2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. అలాగే పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినప్పటికీ సివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఆమె ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరయింది. పరీక్ష అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ సుధీర్బాబుకు అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. లతీషా ఎం.కాం. వరకు చదువుకుందని అన్సారీ వెల్లడించారు. -
సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!
టాప్ స్టోరీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2ను రద్దు చేయాలంటూ.. కొద్దిరోజులుగా సివిల్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం సోమవారం స్పందించింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది. అయితే అభ్యర్థులు సీశాట్ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు సీశాట్ వివాదం ఏమిటి? దీనిపట్ల అభ్యర్థుల్లో అంత వ్యతిరేకత ఎందుకు? సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. అత్యుత్తమ కెరీర్కు బాటలు వేస్తూనే.. సమాజ సేవకు ధీటైన మార్గంగా నిలుస్తోంది.. సివిల్ సర్వీసెస్ పరీక్ష! ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టే సదవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో ‘ఇంగ్లిష్’ తమకు అందనీయకుండా చేస్తోందని సివిల్స్ ఔత్సాహి కులు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్టిట్యూడ్పై ఆందోళన సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.. ఇలా మూడు దశలుంటాయి. 2010 వరకు ప్రిలిమినరీ పరీక్ష విధానం కొఠారి కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉండేది. గతంలో ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్(150 మార్కులు) పేపర్, ఒక ఆప్షనల్ పేపర్(300 మార్కులు) ఉండేవి. యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఎస్కే ఖన్నా ఏక సభ్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచి ప్రిలిమ్స్ స్థానంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టారు. అభ్యర్థుల్లో ఎనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో రెండు పేపర్లు ఒక్కోదానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ వరకు ఫర్వాలేదుకానీ, రెండో పేపర్ మాత్రం ఇంగ్లిష్ బాగా వచ్చిన వారికి అనుకూలంగా ఉందని హిందీ రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హిందీ, ప్రాంతీయ భాషల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటున్నారు. ‘సివిల్స్-2013 తుది ఫలితాలు గత జూన్లో విడుదలయ్యాయి. టాప్ 24 ర్యాంకర్లలో ఏ ఒక్కరూ భారతీయ భాషను ఎంపిక చేసుకోని వారే! హిందీ మాధ్యమం టాపర్కు 107 ర్యాంకు వచ్చింది. హిందీ మాధ్యమం అభ్యర్థుల సక్సెస్ రేటు ఇప్పుడు మూడు కంటే దిగువకు చేరుకుంది. సీశాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది 15 శాతం ఉండేది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ‘2008లో ఐఏఎస్లో చేరిన వారిలో ఇంజనీర్లు 30 శాతం మంది ఉంటే, హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు 30 శాతం ఉన్నారు. సీశాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఏఎస్లో ప్రవేశించిన ఇంజరింగ్ గ్రాడ్యుయేట్లు 50 శాతానికి చేరగా.. హ్యుమానిటీస్ చదివినవారి వాటా 15 శాతానికి పడిపోయింది’ అంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతికూలం - ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్కు సంబంధించి 8 ప్రశ్నలు (20 మార్కులు) ఉన్నాయి! దీనివల్ల ఇంగ్లిష్ బాగా వచ్చినవారు లాభపడుతున్నారు. తమకు నష్టం వాటిల్లుతోంది. - ప్రశ్నపత్రం (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా మిగిలినవి) హిందీ అనువాదం ఇస్తున్నా, అది సరిగా ఉండటం లేదు. గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా అనువ దిస్తున్నారని, ఇది అభ్యర్థుల ను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు అర్థం కావడం లేదు. ఈ విభాగాల్లోనూ ఇంగ్లిష్ అభ్యర్థులతోపాటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాభపడుతున్నారు. హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు నష్టపోతున్నారు. - అందరికీ అవకాశాలుండేలా సివిల్స్ ప్రిలిమ్స్ను మార్చాలి. ‘ప్రస్తుత వివాదం మాట అటుంచి ప్రిలిమ్స్ పేపర్-2.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిరాశాజనకంగా ఉందనే వాదన మొదట్నుంచీ ఉంది’ అంటున్నారు సివిల్స్ శిక్షణలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బి.జె.బి.కృపాదానం. అనుకూలం ఉన్నతాధికారులుగా సమాజానికి సేవ చేయబోయే వ్యక్తులకు బుద్ధికుశలత, నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ సామర్థ్యం అవసరం. ‘క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలడన్నదాన్ని అంచనా వేసేందుకు సీశాట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్పై ప్రశ్నలు ఇస్తున్నారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తదితర విభాగాలకు చెందిన ప్రశ్నలూ ఈ కోవకు చెందుతాయి. ఇలా ఇవ్వడం సబబే. ఇవి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటున్నాయన్నది నిజం కాదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థి అకడమిక్ నేపథ్యం ప్రభావం ఉంటుందనుకోవడం లేదు’ అని కొందరు సబ్జెక్టు నిపుణులు, సివిల్స్ ఔత్సాహికులు చెబుతున్నారు. ఇందులోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ పీవో, క్యాట్ తదితర పరీక్షలతో పోలిస్తే సీశాట్లో ఇస్తున్న ప్రశ్నలు మరీ అంత కష్టంగా లేవంటున్నారు. పార్లమెంటులోనూ సెగలు అభ్యర్థుల ఆందోళనతోపాటు ఎంపీలు కూడా గళమెత్తడంతో సీశాట్ వివాదంపై గతంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి అరవింద్ వర్మ నేతృత్వంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం వెలువడింది. కాబట్టి అభ్యర్థులు అనవసర ఆందోళనలకు తావివ్వకుండా తమ ప్రిపరేషన్ను కొనసాగించాలని బ్రెయిన్ ట్రీ అకాడెమీ డెరైక్టర్ వి.గోపాలకృష్ణ సూచిస్తున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే కదా? ‘ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్పై ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఆ మాత్రం ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే! దైనందిన విధులకు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం అనేది అడ్డంకిగా మారుతుంది. ఇక అనలిటికల్, రీజనింగ్ నైపుణ్యాలు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చాలా ముఖ్యం. వీటిని పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వడం సబబే. కష్టపడి, విశ్లేషణాత్మకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.. ఇలా ఏ నేపథ్యమున్న వారైనా వీటికి సమాధానాలు గుర్తించగలరన్నది నా అభిప్రాయం. జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమంటే అసలు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకుండా చేయాలని కాదు కదా! ప్రపంచీకరణ నేపథ్యంలో సివిల్స్లో వచ్చిన మార్పులు ఆవశ్యకం.. అభిలషణీయం. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ పరీక్ష నిపుణులు