breaking news
CHOWDAVARAM
-
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నమ్మించి... నట్టేట ముంచి.!
నకిలీ బీ-ఫారాలతో పేదలను వంచించిన తమ్ముళ్లు ఒక్కో ఇంటికి రూ 1.75 లక్షల వంతున వసూలు అధికారుల స్టాంపులు, సంతకాలు సైతం ఫోర్జరీ గుంటూరు రూరల్ చౌడవరంలో వెలుగుచూసిన అక్రమాలు తహశీల్దారు పరిశీలనలో నకిలీ పత్రాల గుర్తింపు నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు ప్రభుత్వం మనది.. ఏంచేసినా మనల్ని అడిగేదెవరు.. అన్నట్టుంది జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ల తీరు. ముఖ్యనేతల అండదండలతో ఏమాత్రం జంకు లేకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. నిరుపేదలు, అమాయకులను ఎంచుకొని మోసగిస్తున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి ఇళ్లు, నివేశన స్థలాలు మంజూరు చేయిస్తామని లక్షల రూపాయలు దండుకొంటున్నారు. జన్మభూమి కమిటీ ల పేరుతో గ్రామాల్లో పెత్తనం చెలాయించడం నుంచి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించే స్థాయికి ఎదిగారు. తాము మింగే అవినీతి సొమ్ములో ముఖ్యనేతలకూ కొంత ముట్టజెబితే ఆ తర్వాత ఏ ఇబ్బంది వచ్చినా వారే చూసుకుంటారనేది వీరి ధీమాగా కనిపిస్తోంది. గుంటూరు రూరల్ : జిల్లాలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. నకిలీ పత్రాలను ప్రభుత్వ బీ ఫారాలుగా నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటన గుంటూరు రూరల్ మండలం చౌడవరంలో వెలుగుచూసింది. గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులుగా చెప్పుకొంటున్న నలుగురు టీడీపీ మండల స్థాయి నాయకులు ప్రభుత్వ అధికారుల రౌండ్సీళ్లు, సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ బీఫారాలు సృష్టించి పేదలకు అంటగట్టారు. రాజధాని నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రావడం, స్థలాలకు పత్రాలు లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోననే అమాయకులు వీరిని ఆశ్రయిస్తుండటం అక్రమాలకు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా నకిలీ పత్రాలను ప్రజలకు అందజేసి, నాలుగు విడతలుగా ఒకొక్కరి నుంచి రూ 1.75 లక్షలకు పైగా దండుకున్నారని సమాచారం. గుంటూరు నగరంలో రోడ్ల పక్కన గుడిసెల్లో నివసించే పేదలను 1998 సంవత్సరానికి ముందు ఖాళీ చేయించిన అధికారులు, వారికి నగరశివారు చౌడవరం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. ఈ స్థలాలకు మంజూరు చేసిన బీ ఫారాలు కొందరికి చేరగా మరికొందరికి అందలేదు. అనంతరం మరికొందరు మిగిలిన ప్లాట్లను కొనుగోలు చేసి కొందరు, ఆక్రమించుకొని మరికొందరు ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. చౌడవరం గ్రామంలో ఇళ్లు, స్థలాలు, స్థలాలకు పత్రాలు లేని పేదలను ఎంచుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు తమ పలుకుబడితో పత్రాలు ఇప్పిస్తామని వారిని నమ్మించారు. గతంలో పనిచేసిన తహశీల్దారు భానుప్రకాష్ సంతకాలను, రెవెన్యూ స్టాంప్లు, రౌండ్సీల్స్ను తయారు చేయించారు. వాటి సాయంతో నకిలీ పత్రాలను సృష్టించి పేదల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ వ్యవహారం ఆనోట ఈ నోట తహశీల్దారు రజనీకుమారి దృష్టికి వచ్చింది. తప్పులు దొర్లాయంటూ పత్రాలు వెనక్కి.. తమ వ్యవహారం అధికారుల దృష్టికెళ్లిందని తెలుసుకుని ఇందులో ముఖ్యపాత్ర పోషించిన నలుగురు తెలుగు తమ్ముళ్లు అర్ధరాత్రి గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లారు. తాము ఇచ్చిన పత్రాల్లో చిన్నపాటి తప్పులు దొర్లాయని, వాటిని మార్చి మళ్లీ ఇస్తామని చెప్పి వెనక్కు తీసుకున్నారని సమాచారం. కాగా కొందరు తమకిచ్చిన పత్రాలను జిరాక్స్ తీశామని తెలపటంతో తహశీల్దారు సోమ, మంగళవారాల్లో గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వారి వద్ద ఉన్నవి నకిలీ పత్రాలేనని గుర్తించారు. పేదలను మోసం చేస్తున్న వారిపై మంగళవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ముఖ్యనేత, ప్రజాప్రతినిధులు ఈ అక్రమాల్లో ప్రమేయం ఉండడంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందువెనుకా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పత్రాలు నకిలీవని తేలింది.. రెండురోజులపాటు చౌడవరం గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాను. స్థానికుల వద్ద ఉన్న పత్రాలను పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. దీనిపై మంగళవారం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వీలైనంతర త్వరగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. - రజనీకుమారి, తహశీల్దారు, గుంటూరు రూరల్ మండలం