breaking news
Century crossed
-
2025లో అహో 2026లో ఒహో
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రైమరీ మార్కెట్లు లిస్టింగ్లతో సెంచరీ కొట్టాయి. మరోపక్క సెకండరీ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలను చేరడం ద్వారా చరిత్ర సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా రిటైలర్లు, దేశీ ఫండ్స్ కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న భారీ పెట్టుబడులు తోడ్పాటునిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది(2026)లోనూ ప్రైమరీ మార్కెట్లు సుప్రసిద్ధ కంపెనీల ఐపీవోలతో కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నాయి. వివరాలు చూద్దాం.. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 2025 జనవరి–డిసెంబర్ కాలంలో 103 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా రూ. 1.75 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. నిజానికి గతేడాది(2024)లోనూ ప్రైమరీ మార్కెట్లు సందడి చేశాయి. రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తదితర ఇష్యూలతో 91 కంపెనీలు రూ. 1,59,784 కోట్లు అందుకున్నాయి. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ రికార్డును టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ తదితరాల లిస్టింగ్తో 2025 అధిగమించింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, డిజిటల్ సేవల దిగ్గజం రిలయన్స్ జియోసహా.. ఫ్లిప్కార్ట్, ఫోన్పే, జెప్టో, ఓయో, బోట్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తదితరాలు ఐపీవోకు క్యూ కట్టడం ద్వారా 2026లోనూ ప్రైమరీ మార్కెట్లు దుమ్మురేపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 84 కంపెనీలకు సెబీ సై ఈ ఏడాదిలో మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. మరోపక్క ఇప్పటివరకూ 103 కంపెనీలు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించి లిస్ట్కావడం ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. ఈ బాటలో 2026 కొత్త ఇష్యూలతో మరింత కళకళలాడనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే 84 కంపెనీల ప్రాస్పెక్టస్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సహకరించనుంది. తద్వారా రూ. 1.14 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు తెరలేవనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుమించి మరో 108 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా రూ. 1.46 లక్షల కోట్ల నిధుల సమీకరణపై కన్నేశాయి. వెరసి 190 కంపెనీలు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు అందుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. కొన్నేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లకు మించి దేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం! దీనికి కార్పొరేట్ పెట్టుబడులు సైతం జత కలుస్తుండటం విశేషమని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీలు విస్తరణ ప్రణాళికలు లేదా వృద్ధి ఆధారిత పెట్టుబడుల ప్రణాళికలు పక్కనపెట్టినప్పుడు ఆదాయ మార్గంగా మ్యూచువల్ ఫండ్ పథకాలలో అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. వెరసి విదేశీ పెట్టుబడులను దేశీ ఇన్వెస్టర్లు తోసిరాజంటున్నట్లు వివరించారు. పెట్టుబడుల విక్రయంఐపీవో ద్వారా పలు దిగ్గజాలు నిధుల సమీకరణ చేపడుతుండటం పెట్టుబడుల విక్రయానికి దారి చూపుతోంది. తొలి దశ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు కొంత వాటా విక్రయించడం ద్వారా నిధుల సమీకరణతోపాటు పెట్టుబడులపై లాభాలను ఆర్జిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2025లో లిస్టయిన దిగ్గజాలను తీసుకుంటే.. ఉమ్మడిగా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీని పక్కనపెడితే ప్రమోటర్లు లేదా ముందస్తు ఇన్వెస్టర్లు రూ. 1.1 లక్షల కోట్లను అందుకున్నారు. టాటా క్యాపిటల్ ఐపీవోలో టాటా మోటార్స్(రూ. 15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 12,500 కోట్లు) భారీగా నిధులు సమకూర్చుకున్నాయి. ఇక ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ద్వారా యూకే భాగస్వామ్య సంస్థ రూ. 10,603 కోట్లు సమకూర్చుకుంది. ఈ బాటలో ఎల్జీ ఎల్రక్టానిక్స్(రూ. 11,607 కోట్లు), కేఎస్హెచ్ ఇంటర్నేషనల్(రూ. 290 కోట్లు)తో పాటు 2024లో స్విగ్గీ(రూ. 6,828 కోట్లు) అందుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!--సాక్షి బిజినెస్ డిస్క్ -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్తో ఎక్కి గైడ్నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
Petrol Price Hike: 23వ సారి.. హైదరాబాద్లో సెంచరీ క్రాస్!
హైదరాబాద్: పెరగడమే కానీ తగ్గడం తనకు లేదన్నట్టుగా ఉంది పెట్రోలు ధరల పరిస్థితి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోలు, డీజిల్లపై లీటరుకు 29 పైసల వంతున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. నిన్న కాక మొన్న జూన్ 9న పెట్రోలుపై లీటరుకు 23-25 పైసలు, డీజిల్పై 23-27 పైసల మేర ధరను చమురు కంపెనీలు పెంచాయి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. హైదరాబాద్లో ‘సెంచరీ’ తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోలో ధర వంద దాటనుంది. జూన్ 9న పెరిగిన పెట్రోల్ ధరలతో హైదరాబాదులో లీటరు పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26గా నమోదు అయ్యింది. తాజాగా 29 పైసలు పెంచడంతో భాగ్యనగరంలో కూడా పెట్రోలు సెంచరీని దాటింది. ఇప్పటికే ఏపీలో పెట్రోలు ధరలు వందను దాటేశాయి. ధరల పెరుగుదలలో ఇదే ట్రెండ్ కొనసాగితే డీజిల్ వందను దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఫలితాల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడాపెడా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 నుంచి జూన్ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. జూన్లో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు రూ. 1.37 రూపాయలు పెరిగింది. చదవండి : ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్ -
కనకమ్మ @ 110
సెంచరీ దాటినా చలాకీగా. రోజువారీ పనులు చేసుకుంటున్న అవ్వ జగమంత కుటుంబానికి పెద్ద దిక్కు మండలంలోని బంధనపల్లి శివారుతండాకు చెందిన భూక్యా కనకమ్మ అనే వృద్ధురాలు ప్రస్తుతం 110 ఏళ్లు వయస్సు ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భర్త భూక్యా తావుర్యా నడీడులోనే మరణించాడు. కాగా, కనకమ్మకు కుమారుడు జీవ్లా, ముగ్గురు కూతుర్లు (మంగతి, లచ్చమ్మ, ఈరమ్మ) ఉన్నా రు. అయితే కుమారుడు మరణించాక మనువ డు బీల్యాకు కనకమ్మే పెళ్లి చేసింది. అతడికి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకుకు కూతురు, రెండో కుమారుడికి ఇద్దరు కుమారు లు, మూడో కొడుకుకు కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, కనకమ్మ పెద్ద కూతురుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.. రెండో కూతురుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.. మూడో కూతురుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అలాగే వీరికీ కూడా సం తానం ఉన్నారు. మొత్తం అందరూ కలిపి ‘సెం చరీ’ దాటారు. అయితే ఇంత కుటుంబానికి పే...ద్ద మనిషి కనకమ్మే. ఇప్పుడు కూడా ఆమె అందరి బాగోగులూ చూస్తోంది. కాగా, వ య స్సు పెరిగిపోతున్నప్పటికీ ఆమె ఇప్పటివరకు ఎవరిపై ఆధారపడడం లేదు. గిన్నెలు తోముకోవడం, ఇళ్లూవాకిలి ఊడ్చుకోవడం ఇలా అన్ని పనులు సొంతంగానే చేసుకుంటోంది. అన్నట్టు.. ఇంకో విషయం.. కనకమ్మ నాటు వైద్యురాలు కూడా! సంతానం లేనివారికి ఆకుపసరు అందిస్తుంది. చిన్న పిల్లలు భయపడితే వారికి బూడిదతో బొట్టు పెడితే కుదుటపడతారని స్థానికుల విశ్వాసం. అలా కనకమ్మ జనంతోనూ మమేకమవుతోంది. ఆమె ఇంటి కెళ్లిన వారు ఆప్యాయం గా పలకరించి మంచీచెడ్డ మాట్లాడాకే వెనుదిరుగుతారు. కాగా, ఈ వయసులోనూ ఆమె మెనూ మాత్రం జొన్నరొట్టే! ఇంత వయస్సున్నా.. ఈమెకు అధికారులు ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె మునిమనుమడు ఎస్సై అయ్యూడనేది అధికారుల మాట. ఇది యూంత్రిక జీవనం. మనిషికి లక్షాతొంభై రోగాలు. ఒత్తిళ్లు.. ఆహారపు అల వాట్లు.. కారణాలేమైనా కావచ్చు.. మనిషి ఆయుర్ధాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఆరు పదుల వయస్సుదాటి బతికితే ‘అబ్బో ముసలోడు గట్టోడే’ అంటుంటారు. అదే వందేళ్లూ జీవిస్తే ఆశ్చర్యమే..! మరి 110 ఏళ్లు బతికి ఉంటే.. అమితాశ్చర్యం కదా! బతికి ఉండడమే కాదు.. ఈ వయసులోనూ తన రోజువారీ పనులు చక్కగా చేసుకుంటుంటే చూసిన వారు నోరెళ్ల బెట్టాల్సి వస్తోంది. మరీ ఆ ‘సీనియర్’ సిటిజన్ గురించి తెలుకోవాలనుకుంటున్నారా.. అయితే పదండి.. - బంధనపల్లి(రాయపర్తి) దేవతలా చూసుకుంటాం.. మా కనకమ్మను ఇ ప్పటికి మేము దేవత లా చూసుకుం టాం. ఆమెకు 110 యేళ్లకు పైగా ఉంటాయని మా బంధువులు చెబుతుంటారు. ఇప్పటికీ తనపని తానే చేసుకుంటుంది. ఆమెకే ఇబ్బంది రాకుండా కుటుంబ సభ్యుల మంతా జాగ్రత్తలు తీసుకుంటాం. - దీప్లానాయక్, కనకమ్మ మునిమనవడు


