breaking news
cab-driver
-
వానొస్తే జనం గుండెల్లో గుబుల్.. హైదరాబాద్లో క్యాబ్ ధరలు డబుల్!
ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన! ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా! వర్షం సినిమాలో పాట మాదిరి వానపడినపుడు హాయిగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రాంతాల్లోని జనం మనసుల్లో గిలిగింతలుగొలిపే సన్నివేశం. కానీ, హైదరాబాదీలకు మాత్రం బాధలు పంచే సందర్భం. ఎలాగంటే, జీహెచ్ఎంసీ అధికారులు ఓవైపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వరద నియంత్రణకు చర్యలు చేపట్టాం అని చెప్తుంటారు. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించవు. చిన్నపాటి వర్షానికే భాగ్యనగరంలో రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక వాహనదారుల కష్టాలు మామూలే. మామూలుగానే మన నగరంలో ట్రాఫిక్ ఎక్కువ. వాన పడిందా రచ్చ రచ్చే! ఎడతెరిపి లేకుండా వాన పడిందా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు తప్పవు. భారీ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. (చదవండి: వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!) అటు ఆకాశానికి, ఇటు జేబుకు చిల్లు! నగరంలో జోరు వాన. అరే! వానలో తడుస్తూ బైక్పై ఎలా? క్యాబ్లో వెళ్దామనే ఆలోచనే చేసే పరిస్థితిలో సామాన్య జనం లేరు. ఎందుకంటే ఇదే అవకాశంగా క్యాబ్ యజమానులు అమాంతం చార్జీలు పెంచేశారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండింతలు, మూడింతల సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, బేగంపేట ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 చార్జీ ఉంటుంది. ఈ వర్షాల కారణంగా ధరలు డబుల్ అయ్యాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు వెంటనే రైడ్ను క్యాన్సిల్ చేస్తున్నారు. హైదరాబాద్లో క్యాబ్ సర్వీసుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్తూ అనుజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్గా మారింది. @AnujGurwara అనే ట్విటర్ యూజర్ వర్షం పడటంతో చార్జీలను ఎలా పెంచేశారో తన స్వీయ అనుభవాన్ని షేర్ చేశాడు. ఈక్రమంలోనే పలువురు నెటిజన్లు కూడా అధిక చార్జీల బాధలు చెప్పుకున్నారు. ఇదిలాఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ విభాగం హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్: ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే..) This is the @Olacabs fare from Begumpet to the airport at 7.30pm today. Normal fare 700-800rs. Two @Uber_India drivers cancelled on me after asking for the fare being displayed on the app. The #Hyderabad cab situation continues to be terrible. pic.twitter.com/tFaB6ln96e — Anuj Gurwara (@AnujGurwara) July 19, 2023 #Hyderabad #City #Traffic #RealEstate #KishanReddy @kishanreddybjp pic.twitter.com/6c54vSdXOa — Guru Kotha (@Newguru_Kotha) July 20, 2023 Heavy rains in Hyderabad. #HyderabadRains pic.twitter.com/t4wYsc2VS8 — Kiran Kumar (@chkirankumar) July 20, 2023 Funds have been allocated by GHMC to construct a Dam near secretariat.. 🤣🤣#HyderabadRains https://t.co/bYzwhur0cd — Chinnu Rao.. #ProudHindu 🇮🇳 (@bubblebuster26) July 20, 2023 -
నటి సంజన వీరంగం..!
యశవంతపుర: డ్రగ్స్ వినియోగం– రవాణా కేసులో జైలు పాలై... మళ్లీ విడుదలైన నటి సంజన గల్రాని ఈసారి ఓలా క్యాబ్ డ్రైవర్తో గొడవ పడ్డారు. మంగళవారం ఉదయం షూటింగ్ స్పాట్కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు ఆమె క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్లోకి ఎక్కిన తరువాత గమ్యం మార్చాలని డ్రైవర్ సుసయ్ మణికి సూచించగా, అతడు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి అడిగాడు. అయితే లొకేషన్ను మార్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సంజన నానాతిట్లు తిడుతూ తనతో గొడవ పెట్టుకుందని డ్రైవర్ ఆరోపించాడు. గొడవను వీడియో తీశాడు. ఆమెపై రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్) తాను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సంజన ట్విట్టర్లో ఆరోపించారు. క్యాబ్లో ఏసీని పెంచాలని అడిగితే నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్ కూడా సరిగాలేదని చెప్పారు. అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డబ్బా కారులో వెళ్లాలా అని ఓలాపై మండిపడ్డారు. కారులో ఉండగానే ఆమె డయల్ 100కు ఫోన్ చేసి డ్రైవర్పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. Car number Ka 50 - 8960 @olamoney_in @Olacabs @Ola_Bangalore , we are Harrassed early morning by this driver named Susay mani s , Not increasing the A/c from speed level one , We are 4 people in car he is suffocating us . Full story in pic below pic.twitter.com/ivxwgeB7LL — Sanjjanaa Galrani (@sanjjanagalrani) October 5, 2021 -
ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం
సాక్షి,హైదరాబాద్:ఆటో,క్యాబ్డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు. అదే విధంగా క్యాబ్ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. టోల్ టాక్స్, రోడ్ టాక్స్లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు. -
జై శ్రీరాం అనాలంటూ క్యాబ్ డ్రైవర్పై దాడి
ముంబై : జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానేలో జరిగింది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు థానేలోని దివా ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ఫైజల్ ఉస్మాన్ ఖాన్ను అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. జై శ్రీరాం అనకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భౌతిక దాడికి పాల్పడ్డారు. రోడ్డు మధ్యలో కారును ఎందుకు ఆపావంటూ బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దౌర్జన్యానికి దిగారని డ్రైవర్ చెప్పారు. తాను ముస్లింనని గ్రహించిన వారు కారు నుంచి తనను బయటకు లాగి కొట్టారని వెల్లడించారు. జైశ్రీరాం అంటేనే తనను విడిచిపెడతామని బెదిరించారని తెలిపారు. క్యాబ్లో కూర్చున్న ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేయగా, డ్రైవర్ మొబైల్ ఫోన్ను లాక్కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నిందితులు వాడిన బైక్ రిజిస్ర్టేషన్ నెంబర్ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని ట్రేస్ చేసి నిందితులను జైదీప్ ముండే, మంగేష్ ముండే, అనిల్ సూర్యవంశీగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
బ్రేకింగ్ తీర్పు
నిజం గడపదాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగొస్తుందట!చలనం చెప్పులేసుకొనే లోపలే సంచలనం భూభ్రమణం చేసేస్తుందట!న్యాయానికి కళ్లుండవు... మీడియాకు కళ్లెం ఉండదు!న్యాయం ్రçప్రభవించే లోపలే నిందితుడు నేరస్థుడైపోతాడు!జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్...చివరకు జైలు నుంచి మనిషిని బయటకు తేవచ్చు కానిమనిషిలోంచి జైలును బయటకు తేలేం కదా!సమాజం ఇచ్చే బ్రేకింగ్ తీర్పులో ఉండే క్రైమ్...క్రిమినల్ జస్టిస్!! ఆదిత్య శర్మ.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి.. ఏంబీఏకు ప్రిపేర్ అవుతున్న మధ్యతరగతి యువకుడు. ఫుట్బాల్ ప్లేయర్. అమ్మా, నాన్న, అక్క, బావ.. అతని కుటుంబం. అమ్మ, నాన్న కిరాణా షాప్ నడిపిస్తుంటారు. అక్క స్టార్ హోటల్లో ఫ్రంటాఫీస్ ఎంప్లాయ్. బావ.. బ్యాంక్ లోన్తో కారు కొనుక్కొని క్యాబ్ రన్ చేస్తుంటాడు. ఆ రోజు.. ఆదిత్యశర్మ వాళ్ల జట్టు ఫుట్బాల్ మ్యాచ్ గెలుస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ రాత్రి పార్టీ చేసుకోవాలనుకుంటారు. ఆ రోజే ఆదిత్య వాళ్ల అక్క పెళ్లిరోజు. ఆమె ప్రెగ్నెంట్ అనే శుభవార్తా తెలుస్తుంది ఆదిత్యకు. ఆ సంతోషంతోనే రెడీ అయ్యి పార్టీకి వెళ్లబోతున్న ఆదిత్యను ‘‘నీ పార్టీకి ఇంకా టైమ్ ఉంది కదా.. రెండుమూడు రైడ్స్ చేసి పార్టీకి వెళ్లవా?’’ అంటూ బతిమాలుతుంది అక్క. కాదనలేక సరే అని రైడ్కి వెళ్తాడు. ఆ రాత్రి.. రైడ్స్ కంప్లీట్ చేసేసి పార్టీకి టర్న్ అవుతూండగా పొరపాటున ఇంకో రైడ్ యాక్సెప్ట్ చేస్తాడు ఆదిత్య. పికప్ చేసుకోలేను రైడ్ క్యాన్సల్ చేయమని ఆ ప్యాసెంజర్ని రిక్వెస్ట్ చేసి పక్కనే ఉన్న మెడికల్షాప్కి వెళ్తాడు. వచ్చేటప్పటికి వెనకసీట్లో ఓ అమ్మాయి కూర్చుని ఉంటుంది. ఆమె పేరు సనాయా. ఆశ్చర్చపోయి ‘‘ఎవరు మీరు’’ అని అడుగుతాడు. ఇందాక రైడ్ బుక్ చేసింది తనే అని చెప్తుంది ఆమె. క్యాన్సిల్ చేయమన్నాను కదా అని ఆదిత్య అంటున్నా వినకుండా డెస్టినేషన్లో డ్రాప్ చేయమని దబాయిస్తుంది. కార్లో వెళ్తున్నంత సేపూ టెన్షన్గా ఫోన్లో అరుస్తూ.. మాటిమాటికి డెస్టినేషన్స్ మారుస్తూ ఆదిత్యకు చిరాకు తెప్పిస్తుంది. అయినా ఓపిగ్గానే∙ గమ్యానికి చేరుస్తాడు. దిగకుండా అక్కడి నుంచి మళ్లీ ఇంకో డెస్టినేషన్ సెట్ చేస్తుంది. తీసుకెళ్లకపోతే కంప్లయింట్ చేస్తానని బెదిరిస్తుంది. కామ్గా ఆమె చెప్పిన అడ్రస్కు డ్రైవ్ చేస్తాడు. టెన్షన్ తగ్గి నార్మల్ అయ్యాక అతనితో మాట కలుపుతుంది. అతనిని ఇబ్బంది పెట్టినందుకు నొచ్చుకుంటుంది. గమ్యం వచ్చాక థ్యాంక్స్ చెప్పి దిగి వెళ్లిపోతుంది ఆమె. ఆదిత్య కూడా పార్టీకి చేరుకోవాలనే తొందరలో కారు స్పీడ్ పెంచుతాడు. ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర వెనక సీట్లోంచి ఏదో కిందపడ్డ చప్పుడు వినపడి చూస్తాడు. ఫోన్ కనపడుతుంది. రివర్స్ చేసుకొని మళ్లీ ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ ఇస్తాడు. లోపలికి రండి అంటూ ఇన్సిస్ట్ చేస్తుంది. తటపటాయిస్తూనే వెళ్తాడు ఆదిత్య. త్వరగానే మచ్చికవుతారు. డ్రింక్స్ తీసుకుంటారు. వంటింట్లో కూరగాయల కత్తితో ఆమె ఓ ఆట నేర్పిస్తుంది అతనికి. ఆ ఆటలో గురి తప్పి ఆమెకు గాయం చేస్తాడు అతను. గాబరాపడ్తాడు. బాధపడ్తాడు. చనువు పెరుగుతుంది. ఇద్దరూ బెడ్రూమ్లోకి వెళ్తారు. మత్తు వదిలి మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాడు ఆదిత్య. అప్పటికే మధ్య రాత్రి దాటుంటుంది. గబగబా బట్టలు వేసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. వీడ్కోలు చెబ్దామని ఆమెను కదపబోతుంటే వీపు మీద విచక్షణారహితంగా పొడిచిన కత్తిగాట్లతో రక్తం మడుగులో ఉంటుంది. భయంతో అక్కడి నుంచి పారిపోబోతూ అంతకుముందు ఆడుకున్న కత్తిని కడిగి జర్కిన్లో పెట్టుకుంటాడు. నేల మీద తనకు కనిపించిన రక్తపు మరకల్నీ శుభ్రం చేసి కిందకు పరిగెడ్తాడు. ఆ కంగారులో పార్కింగ్లో కార్ కీ పడిపోతుంది. గమనించుకోకుండా కార్ దగ్గరకు వెళ్లి డోర్ లాగుతాడు. సెన్సార్ మోగుతుంది. ఆ చప్పుడికి పక్కింటి వ్యక్తి కిటికీలోంచి ఆదిత్యను చూస్తాడు. ఆదిత్య మళ్లీ వెనక్కి వచ్చి పార్కింగ్లో కీ తీసుకొని కార్లో వెళ్లిపోతాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ చేస్తాడు. పోలీసులొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద స్టేషన్లో కూర్చోబెడ్తారు. ఈలోపు ఆదిత్యను చూసిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇస్తాడు మర్డర్ అయిందని. తర్వాత? పోలీస్ ఎంక్వయిరీలో భాగంగా స్టేషన్కు వచ్చిన ఆ పక్కింటి వ్యక్తి అక్కడ ఆదిత్యను చూసి హత్య చేసింది అతనే అని పోలీసులకు చెప్తాడు. ఆదిత్యను తనిఖీ చేసిన పోలీసులకు అతని దగ్గర కత్తి దొరుకుతుంది. కేస్ నమోదవుతుంది. మీడియా ఎంట్రెన్స్ రైడ్ మొదలు అతను ఆమె ఇంటికి వెళ్లడం, క్రైమ్ సీన్.. కత్తి.. అన్నీ ఆదిత్యను నేరస్థుడిగా చూపిస్తుంటాయి. డ్రింక్స్ తీసుకుని బెడ్రూమ్కి వెళ్లిన తను మెలకువ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా ఉన్నాడో? ఆ గ్యాప్లో ఏం జరిగిందో ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాదు. ఆ రాత్రి ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ కోసం సబ్ ఇన్స్పెక్టర్ నామ్దేవ్ పిలిస్తే వచ్చిన మాధవ్ మిశ్రా అనే లాయర్.. అది మర్డర్ కేస్గా టర్న్ అయ్యాక ఆదిత్య తరపున వాదించాలనుకుంటాడు. ఆదిత్యకు పరిచయం చేసుకొని కేస్ టేకప్ చేస్తానని భరోసా కూడా ఇస్తాడు. కొడుకు మర్డర్ కేస్లో ఇరుక్కొనేసరికి కుప్పకూలి పోయిన ఆదిత్య తల్లిదండ్రులు, సోదరికీ ధైర్యం చెప్తాడు మాధవ్. ఈలోపు మీడియా సంచలనం చేయడం మొదలుపెడ్తుంది. క్యాబ్డ్రైవర్ ఓ లేడీ ప్యాసెంజర్ను రేప్ చేసి, దారుణంగా చంపాడంటూ కథనాలు.. మానసిక విశ్లేషకులతో ప్యానల్ డిస్కషన్స్తో. ఇవి చూసిన క్యాబ్ కంపెనీ తమ క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి ఇందినా మథుర్ అనే పేరున్న లాయర్ను హైర్ చేసుకొని ఆదిత్య తరపున వాదించడానికి పంపిస్తుంది. అయితే ఆదిత్యకు బెయిల్ నిరాకరిస్తుంది కోర్ట్. మాధవ్ మిశ్రాకు మాత్రం ఆదిత్య ఎరక్కపోయి ఇరుక్కున్న అమాయకుడిగానే కనిపిస్తూంటాడు. ఆ దిశగానే ఆ కేస్ పరిశోధనలో పడ్తాడు అతను. కాని ఆదిత్యే నేరస్థుడని నిర్ధారణకు వచ్చేసిన ఇన్స్పెక్టర్కు మాధవ్ ఎంక్వయిరీ అంతా దోషిని విడిపించే ట్రయల్గా తోస్తుంది. అదేం లెక్క చేయక ఎస్ఐ నామ్దేవ్కి లంచం ఇస్తూ పరిశోధన సాగిస్తూనే ఉంటాడు మాధవ్. అక్కను.. అమ్మను.. ఆదిత్య కేసు వాదనలను వింటున్న మహిళా జడ్జి నేరం రుజువు కానిదే ఆదిత్యను దోషి అనడాన్ని ఖండిస్తూ ఉంటే మీడియా మాత్రం తన ప్రసారాల్లో ఆదిత్యను నేరస్థుడిగానే ప్రచారం చేస్తూంటుంది. ఆదిత్య సోదరిని, తల్లిని మిస్ లీడ్ చేసి.. ఎడిటింగ్ గిమ్మిక్కులతో వాళ్లతోనే అతనిని అపరాధిగా చెప్పిస్తుంది. దీనివల్ల ఆ కుటుంబం వీధికెక్కుతుంది. జైల్లో.. దొమ్మీలు, గ్యాంగ్ వార్స్, డ్రగ్స్, సెల్ ఫోన్ల స్మగ్లింగ్స్తో అండర్ వరల్డ్ను తలపిస్తున్న జైలును చూసి షాక్ అవుతాడు ఆదిత్య. ముస్తఫా, లాయక్ అనే ఇద్దరు కరడు గట్టిన ఖైదీల మధ్య శాండ్విచ్ అవుతాడు. ఆ జైల్ ముస్తఫా ఆధిపత్యంలో ఉంటుంది. అయిదు లక్షలు ఇస్తే లాయక్ నుంచి రక్షణ కల్పిస్తానని చెప్తాడు ముస్తఫా. అతనిచ్చిన ఫోన్తోనే వాళ్లక్కకు కాల్చేసి అయిదు లక్షలు సర్దమంటాడు ఆదిత్య. భర్తకు తెలియకుండా అయిదు లక్షలు పంపుతుంది ఆమె. కార్ ఈఎమ్ఐలు కట్టకుండా తమ్ముడికి డబ్బు సర్దిందని తెలిసీ ఆమెతో గొడవపెట్టుకుంటాడు భర్త. తమ్ముడు మర్డరర్, అక్క దొంగ అంటూ నిందలేస్తాడు. ఇటు జైల్లో ఆదిత్యకు బాసటగా ఉంటూనే అతని చేత డ్రగ్స్ను స్మగుల్ చేయిస్తుంటాడు ముస్తఫా. ఈ విషయాన్ని మాధవ్ పసిగట్టి జాగ్రత్త అంటూ ఆదిత్యను హెచ్చరిస్తాడు. యావజ్జీవ కారాగారం.. ఇందిరా మాథుర్ తన వాదనతో ఆదిత్య రేప్ చేయలేదని మాత్రం నిరూపించగలుగుతుంది కాని హత్య చేయలేదనడానికి కావల్సిన సాక్ష్యాలను సంపాదించలేకపోతుంది. అవి కూడా మాధవ్ మిశ్రా సంపాదించినవే. నిర్దోషి అని రుజువు చేయడానికి ఆధారాల్లేవ్ కాబట్టి గిల్టీగా ఒప్పుకోమని ఆదిత్య మీద ఒత్తిడి తెస్తుంది ఇందిరా. అంతకుముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ఒప్పందానికి వచ్చి. సందిగ్ధంలో పడ్తాడు ఆదిత్య. ఇందిర అసిస్టెంట్ సలహా మేరకు నాట్ గిల్టీ అనే చెప్తాడు జడ్జి ముందు. ఆ నిర్ణయానికి కోపం తెచ్చుకున్న ఇందిర ఆ కేస్ను తప్పుకొని అసిస్టెంట్కు ఇస్తుంది. మాధవ్ మిశ్రా సలహా, సహకారంతో కేస్ టేకప్ చేస్తుంది కాని ఓడిపోతుంది ఆ అసిస్టెంట్. హత్యానేరం కింద ఆదిత్యకు యావజ్జీవిత కారాగార శిక్ష పడ్తుంది. ఆ తీర్పు రోజే వాళ్లక్క డెలివరీ అవుతుంది. మగపిల్లాడు పుడతాడు. మరోవైపు జైలు వాసం తప్పదని తెలిసిన ఆదిత్య దానికి అలవాటు పడిపోతాడు. ముస్తఫాకు రైట్ హ్యాండ్గా మారుతాడు. లాయక్ పీచమణిచే నాయకుడిగా ఎదుగుతాడు. అసలు నేరస్థులు.. ఇంకోవైపు చనిపోయిన సనయా గురించి ఆరా తీస్తుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్తుంటాయి మాధవ్ మిశ్రాకు. ఒకప్పుడు సనాయా డ్రగ్ ఎడిక్ట్. తన సవతి తండ్రి స్నేహితుడు నడిపే డీ ఎడిక్షన్ సెంటర్లో చేరి ఆరోగ్యవంతురాలవుతుంది. తర్వాత న్యూయార్క్ వెళ్తుంది. కొన్నాళ్లకు తిరిగొచ్చి ఆ డీ ఎడిక్షన్ సెంటర్లోనే వలంటీర్గా చేరుతుంది. స్లమ్స్లోని పిల్లలకూ ఆ సెంటర్ ఫ్రీ ట్రీట్మెంట్.. చదువు.. బట్టలు ఇప్పిస్తూంటుంది. ఆ పిల్లల పట్ల సనాయా చాలా శ్రద్ధ తీసుకుంటూంటుంది. అయితే ఆమె హత్య జరిగేకంటే కొన్ని గంటల ముందు ఆ సెంటర్కు సంబంధించి ఓ ఘోరమైన నిజం తెలుస్తుంది ఆమెకు.. ఆ పిల్లలతో తన తండ్రి స్నేహితుడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని. హతాశురాలై ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆ నిర్వాహకుడిని బెదిరిస్తుంది. ఆ నిర్వాహకుడి భార్య కూడా సెంటర్ నిర్వహణలో భాగస్వామే. సనాయాకు నిజం తెలిసిందని ఆమెకూ అర్థమవుతుంది. ఇదంతా మాధవ్ మిశ్రా ఆరా తీస్తాడు. వీటితో కేస్ను అనఫీషియల్గా రీ ఓపెన్ చేయమని ఇన్స్పెక్టర్ను కోరుతాడు. కన్విన్స్ అయిన ఇన్స్పెక్టర్ ఓకే అంటాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, క్రైమ్ సీన్ ఎవిడెన్సెస్ రీ చెక్ చేస్తారు. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఎలిగేషన్ మీద ఆ ఇద్దరినీ స్టేషన్కు రప్పించి ఇంటారగేషన్ చేస్తాడు. సనాయాను చంపింది తనే అని ఒప్పుకుటుంది డీ ఎడిక్షన్ సెంటర్ ఓనర్ భార్య. అంటే సనాయా సవతి తండ్రి స్నేహితుడి భార్య. నిర్దోషిగా విడుదలవుతాడు ఆదిత్య. మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి, ఆదిత్యగా విక్రాంత్ మస్సే, ఇందిరా మాథుర్గా మీతా వశిష్ట్, ముస్తఫాగా జాకీ ష్రాఫ్ నటించారు. సరస్వతి రమ -
నిద్రిస్తున్న యువతి వీడియో తీసిన డ్రైవర్
హైదరాబాద్: హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను 'షీ' టీమ్ అదుపులోకి తీసుకుంది. కారులో నిద్రిస్తున్న యువతిని అభ్యంతకరంగా సెల్ ఫోన్ లో వీడియో తీసినందుకు అతడిని పట్టుకున్నారు. అనుమానంగా వెళుతున్న అతడిని 'షీ' టీమ్ పట్టుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. అతడి వద్ద నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రషీద్ గా గుర్తించారు. అతడిని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో మహిళల భద్రత కోసం నగర పోలీసులు 'షీ' టీమ్లను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.