breaking news
Bride Mother
-
మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే..
సాక్షి, బాన్సువాడ టౌన్(నిజామాబాద్): మరో నెలరోజుల్లో కూతురి పెళ్లి. పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన గులెపల్లి నిర్మల(35), భర్త కిషన్ దంపతుల కుమార్తెకు వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఈక్రమంలో వారు ఈనెల 6న అల్లుడికి బైక్ కొనిచ్చారు. అనంతరం తమ పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పంది అడ్డుగా వచ్చి బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులనుని ఆస్పత్రికి తరలించగా, నిర్మలా కాలు విరగడంతో వైద్యులు సిమెంట్ పట్టి కట్టారు. దీంతో మరో నెలరోజుల్లో కూతురు పెళ్లి, తనకేమో ఇలా కాలు విరిగిందని నిర్మలా బాధపడుతుండగా, ఈ నెల 7న గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తరలించారు. అప్పటికే నిర్మలా మృతి చెందిందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. నిర్మలా మృతితో బాన్సువాడలో విషాదచాయలు అలుమకున్నాయి. నెల రోజుల్లో కూతురి పెళ్లి, ఇంకా ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండటంతో ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు -
తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.51 వేల ఆర్థికసాయాన్ని వధువు తల్లి జీవించి లేకపోతే, ఆమె తండ్రి పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.