breaking news
boggavarapu srisaila vasu
-
శ్రీశైలవాసు హత్యకేసులో పురోగతి
నందిగామ: జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు, చందాపురం గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు(42) హత్యకేసులో పురోగతి కనిపించింది. ఈ హ్యతకేసులో అనుమానితులు హనుమంతరావు, పాషాకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఓ మెడికల్ షాపులో ఉంచిన సీసీ కెమెరాలో రికార్డయిన పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు శ్రీశైలవాసు ఆఫీసులోకి వెళుతున్న దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి. పాషానే కాల్పులు జరిపివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. శ్రీశైలవాసును సోమవారం తుపాకీతో కాల్చిచంపారు. -
'శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు'
నందిగామ: తమ పార్టీ నాయకుడు బుగ్గవరపు శ్రీశైల వాసు హత్య వెనుక పలు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను అన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే గన్ కల్చర్ తరహాలో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లా నందిగామలో శ్రీశైల వాసును మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చిచంపారు.